Perni Nani: పవన్ యాత్ర కాదు.. చంద్రయాత్ర. వారాహి యాత్రపై పేర్నినాని వ్యంగ్యస్త్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్నినేని సెటైర్ల వర్షం కురిపించారు. ఈనెల 14 నుంచి వారాహి యాత్రను ప్రారంభించనున్నట్లు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటికే వారాహి యాత్రపై వైసీసీ నేతలు తమదైన శైలిలో కామెంట్లు కురిపిస్తున్నారు. తాజాగా స్పందించిన పేర్ని నాని.. వారాహి మీద పవన్ కళ్యాణ్ ది టూర్ ప్యాకేజీనా అంటూ ప్రశ్నించారు. పవన్ తన యాత్రకు అన్నవరం భీమవరం అని కాకుండా చంద్రవరం అని పెట్టాల్సింది అని పేర్నినాని ఎద్దేవా చేశారు.
Read Also: Rahul Gandhi: మరోసారి ప్రధాని మోడీని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ
Also Read
- UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Ben Stokes: "నేను మానసికంగా అలసిపోయాను".. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
వారాహి యాత్రపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. సినిమా మొదలు పెట్టేటప్పుడు క్లాప్ కొట్టి చెప్పే డైలాగుల్లా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. నాకు అధికారం అవసరం లేదు… ముఖ్యమంత్రి చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత ఇంకేంటి ప్రజల్లోకి వెళ్ళేదంటూ ప్రశ్నించారు. ఇది చంద్రయాత్ర అని ఆరోపించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. చంద్రబాబును పొగడటమే పవన్ కళ్యాణ్ పని అంటూ కామెంట్స్ చేశారు. వారాహి అంటే దసరా నుంచి గిర్రున తిరుగుతుంది అదేనా.. తిరగటం లేదా అంటూ సెటైర్లు వేశారు. వారాహిని తెలంగాణలో దాచి పెట్టారా.. ఇప్పుడు చంద్రబాబు గోదావరి జిల్లాల్లో తిరగమని చెప్పి ఉంటాడంటూ పేర్ని నాని అన్నారు. ఆ ప్రాంతమైతే.. లోకేష్ యాత్రకు అడ్డు రాదు కదా అని తీవ్రంగా వ్యంగ్యస్త్రాలు సంధించారు పేర్ని నాని.
Read Also: PERNI NANI: రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఎందుకు శుభాకాంక్షలు చెప్తున్నారు?.. పేర్ని నాని మండిపాటు
దసరా, సంక్రాంతి, ఉగాది అయిపోయాయి. అన్నవరం ..భీమవరం కన్నా చంద్రబాబు యాత్ర అనడం బెటర్ అని కామెంట్స్ చేశాడు పేర్ని నాని. అన్నవరం – భీమవరం బదులు చంద్రవరంయాత్ర అంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాలుగు పీ లు చెబుతున్నాడని.. దీని అర్ధం ప్రైవేటు, ప్రైవేటు, ప్రైవేటు, ప్రైవేటు అని అన్నారు. అదే జగన్ ఐతే ఏదైనా పబ్లిక్, పబ్లిక్, పబ్లిక్, పబ్లిక్ అంటాడని పేర్ని తెలిపారు. 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు అంటే సంపద సృష్టి కాదా అని ప్రశ్నించారు. అంతేకాకుండా బందరు పోర్టు ప్రభుత్వం నిర్మిస్తోందని పేర్కొ్న్నారు. జగన్ సంపద సృష్టిస్తుంటే చంద్రబాబు ప్రైవేటుకు దోచి పెట్టాడని ఆరోపించారు.
తాజావార్తలు
-
UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
-
Samsung Galaxy Z Slide: 10-ఇంచెస్ డిస్ప్లేతో సామ్ సంగ్ రోలబుల్ స్మార్ట్ఫోన్.. 2028లో మార్కెట్లోకి?
-
Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
-
Vaibhav-BCCI: అప్పుడు నీతులు చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు!
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!