పెగాసస్ వ్యవహారం భారతీయ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది.. పార్లమెంట్ ఉభయసభలను స్థంభించిపోయాయి.. అయితే, పెగాసస్ స్పైవేర్పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో సంస్థ నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ స్పైవేర్ను తమకు అమ్మేందుకు బెంగాల్ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం కానందున ఆ సంస్థ ఆఫర్ను తాము తిరస్కరించామని చెప్పారు దీదీ. నాలుగైదు ఏళ్ల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. పెగాసస్ స్పైవేర్…
దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. పెగాసస్పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ విషయంలో భారత్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఒప్పందంపై దర్యాప్తు చేయాలని పిటిషనర్, న్యాయవాది ఎంఎల్ శర్మ కోరారు. ఈ ఒప్పందంలో పాల్గొన్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. పెగాసస్పై న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ప్రచురించిన వివరాలను ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. Read Also: ఔను .. భారత్ పెగాసిస్ కొనుగోలు…
క్షిపణి వ్యవస్థతో పాటు ఆయుధాల కొనుగోలుకు ఉద్దేశించిన రెండు వందలక కోట్ల డాలర్ల డిఫెన్స్ ప్యాకేజీలో భాగంగా 2017లో భారత ప్రభుత్వం ఇజ్రాయెలీ స్పైవేర్ పెగాసస్ను కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ సంచలానత్మక కథనం ప్రచురించింది. ‘ ద బాటిల్ ఫర్ ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ సైబర్ వెపన్’ పేరుతో ఈ కథనం వెలువడింది. దాంతో భారత్లో మరోసారి పెగాసిస్ అంశం ప్రధాన వార్తగా మారింది. అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల కొనుగోలుకు భారత్, ఇజ్రాయేల్…
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 2017లోనే ఇజ్రాయెల్తో భారత ప్రభుత్వం డీల్ జరిగిందని న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. క్షిపణి వ్యవస్థతో పాటు స్పైవేర్ పెగాసస్ను 200 కోట్ల డాలర్లతో భారత్ కొనుగోలు చేసిందని ఆరోపించింది. కొందరు జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయనాయకులపై కొన్ని దేశాల ప్రభుత్వాలు పెగాసస్తో నిఘా పెట్టాయన్న కథనాలు గత ఏడాది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజా ఆరోపణలతో మరోసారి ఈ…
దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈరోజు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మనం సమాచార యుగంలో జీవిస్తున్నామని, సాంకేతికత ఎంత ముఖ్యమో గుర్తించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. గోప్యత హక్కును కాపాడుకోవడం ముఖ్యమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పెగాసస్పై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని, పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై నిపుణుల కమిటీ దర్యాప్తు చేస్తుందని సుప్రీం కోర్టు పేర్కొన్నది. సుప్రీంకోర్టు రిటైర్డ్…
సంచలనం సృష్టించిన పెగాసెస్ కుంభ కోణం విషయంలో రేపు తీర్పు వెలువరించనుంది సర్వోన్నత న్యాయస్థానం.. పెగాసెస్ స్పైవేర్ను నిబంధనలకు వ్యతిరేకంగా ఉపయోగించి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచిందా..? లేదా..? తెలుసుకోవాలనుకుంటున్నామని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. సెప్టెంబర్ 13న తీర్పు రిజర్వు చేసిన సంగతి తెలిసిందే.. ఈ కుంభకోణంపై నిపుణుల కమిటీతో సంప్రదించాల్సి ఉందని వ్యాఖ్యానించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ట్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమకోహ్లిలతో కూడిన ధర్మాసనం. సంప్రదించిన కొంతమంది నిపుణులు వ్యక్తిగత కారణాలతో…
పెగాసస్ స్కామ్ వ్యవహారం భారత రాజకీయాలను ఓ కుదుపు కుదిపింది.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొత్తం పెగాసస్ వ్యవహారంలో అట్టుడికిపోయాయి. ఇక, ఈ వ్యవహారంలో విచారణకు ద్విసభ్య కమిషన్ వేసి.. పెగాసస్పై విచారణకు పూనుకున్న తొలి రాష్ట్రంగా వార్తల్లోని నిలిచింది పశ్చిమబెంగాల్.. అయితే, ఇవాళ కేంద్రంతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ద్విసభ్య కమిషన్ విచారణ నిలుపుదల చేయాలంటూ “ప్రజా ప్రయోజన వ్యాజ్యం” దాఖలు అయ్యింది.. జస్టిస్ మదన్ బీ లోకూర్…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొత్తం ఆందోళనలు, నిరసనలతో హోరెత్తాయి… ఓవైపు పెగాసస్ వ్యవహారం.. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలపై ఆందోళన.. ఇలా రకరాల సమస్యలపై నిత్యం పార్లమెంట్ ఉభయసభల్లో ఏదో ఒక రచ్చ జరుగుతూనే వచ్చింది… షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరగాల్సి ఉన్నా.. లోక్సభను ఇవాళే నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్.. ఇక, ఈ సమావేశాల్లో లోక్సభ మొత్తంగా 21.14 గంటలు మాత్రమే పనిచేసింది… విపక్షాల నిరసనల కారణంగా ఏకంగా…
రాజకీయ రచ్చకు కారణం అవుతోన్న పెగాసస్ అంశంపై విచారణకు సిద్ధమైంది సుప్రీంకోర్టు.. పెగాసస్ పిటీషన్లపై వచ్చే గురువారం విచారణ చేయనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం.. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం ముందు ఈ విచారణ జరగనుంది.. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంలో మూడు పిటిషన్లు దాఖలు అయ్యాయి.. ప్రత్యేక దర్యాప్తును కోరుతూ ఎన్. రామ్, శశికుమార్ పిటిషన్ వేయగా.. న్యాయవాది ఎమ్.ఎల్. శర్మ మరొక పిటిషన్ దాఖలు చేశారు.. ఇక, సీపీఎం ఎంపీ జాన్…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న అంశం పెగాసస్… ఉభయసభల్లోనూ ఇదే వ్యవహారం రభస సృష్టిస్తోంది… పెగాసస్ వ్యవహారంపై ప్రభుత్వం చర్చించాల్సిందేనంటూ 9 రోజులుగా ప్రతిపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తున్నాయి. అలాగే 50 పని గంటల్లో 40 పనిగంటలను సభ కోల్పోయిందని అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు జరిగిన అవాంతరాల వల్ల 133 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.. అయితే, ప్రతిష్ఠంభన తొలగిపోయేందుకు ఏమాత్రం సూచనలు కూడా కనిపించడంలేదు.. పెగసస్ వివాదం కారణంగా,…