Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Rs 130 Crore Loss From Government Opposition Parliament Deadlock

‘పెగాసస్’ సెగలు.. రూ. 133 కోట్లు వృథా..!

Published Date :August 1, 2021 , 7:34 am
By Sudhakar Ravula
‘పెగాసస్’ సెగలు.. రూ. 133 కోట్లు వృథా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న అంశం పెగాసస్‌… ఉభయసభల్లోనూ ఇదే వ్యవహారం రభస సృష్టిస్తోంది… పెగాసస్ వ్యవహారంపై ప్రభుత్వం చర్చించాల్సిందేనంటూ 9 రోజులుగా ప్రతిపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తున్నాయి. అలాగే 50 పని గంటల్లో 40 పనిగంటలను సభ కోల్పోయిందని అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు జరిగిన అవాంతరాల వల్ల 133 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.. అయితే, ప్రతిష్ఠంభన తొలగిపోయేందుకు ఏమాత్రం సూచనలు కూడా కనిపించడంలేదు.. పెగసస్ వివాదం కారణంగా, ప్రధాన మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి, ప్రతిపక్షాల మధ్య నెలకున్న ప్రతిష్ఠంభనతో, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కలిగిన అంతరాయం వల్ల, ప్రజల కట్టిన పన్నుల సొమ్ములో సుమారు 133 కోట్ల రూపాయలకు పైగానే వృధాగా నష్టపోయనట్లు అంచనా వేస్తున్నారు..

జులై 19వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి “పెగసస్” కుంభకోణం పై చర్చను డిమాండ్ చేస్తూనే ఉన్నాయి ప్రతిపక్షాలు.. కేవలం ప్రభుత్వాలకే “ఇజ్రాయెల్ స్పైవేర్” సంస్థ అమ్మిన సాఫ్టువేర్ నుపయోగించి, దేశంలోని ప్రముఖుల ఫోన్లను హ్యాక్‌ చేసి, సంభాషణలు, సమాచారం పై నిఘా పెట్టినట్లుగా వచ్చిన కథనాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.. విపక్ష రాజకీయ నాయకులు, పాత్రికేయులు, న్యాయమూర్తులు, ఇతర ప్రముఖలే లక్ష్యంగా ఇజ్రాయెల్ స్పైవేర్ కు చెందిన “పెగసస్”సాఫ్టువేర్ ను ఉపయోగించి, వారి ఫోన్ల సంభాషణల పై నిఘా పెట్టారని వచ్చిన ఆరోపణల పై సిట్ట్ంగ్ జడ్జి లేదా మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని పట్టుబడుతున్నాయి ప్రతిపక్షాలు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 ప్రముఖ మీడియా సంస్ధల సంయుక్త పరిశోధనా కథనాలపై దర్యాప్తును కోరుతున్నాయి.. అయితే, ప్రతిపక్షాల డిమాండ్‌ను నిర్ద్వందంగా కొట్టిపారేస్తోంది మోడీ సర్కార్.. పార్లమెంట్‌లో ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటన సరిపోతుందని చెబుతున్నారు.. మరోవైపు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా మంత్రి కాకముందు ఈ ఫోన్ ట్యాపింగ్‌కు గురైనవారిలో ఒకరుగా ఉన్నారని పరిశోధనాత్మక వార్తా కథనాలలో వెల్లడి కావడం ఆసక్తికరంగా మారింది.

ఇక, ప్రతిపక్షాలది అనవసరమైన రాద్ధాంతం అని కొట్టిపారేస్తోంది ప్రభుత్వం.. పేరు వెల్లడించని ప్రభుత్వవర్గాల సమాచారం అంటూ శనివారం మీడియాకు అందిన ఓ ప్రకటనను బట్టి, ప్రతిష్ఠంభన కారణంగా సుమారు 54 గంటలు నడవాల్సిన లోకసభ, కేవలం 7 గంటలు మాత్రమే పనిచేయగలిగిందని, 53 గంటలు సభాకార్యక్రమాలు నిర్వహించాల్సిన రాజ్యసభ, కేవలం 11 గంటలు మాత్రమే పనిచేయగలిగింది. ఇంతవరకు పార్లమెంట్ ఉభయ సభలు 107 గంటలు మేరకు సభా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా, కేవలం 18 గంటలు మాత్రమే పనిచేయగలిగింది. ఆవిధంగా, సుమారు 89 పని గంటల సమయం వృథా అయుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానా, ప్రజాధనం సుమారు 133 కోట్ల రూపాయలకు పైగానే వృథా అయ్యిందని ప్రకటనలో పేర్కొంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా కొనసాగకుండా కాంగ్రెస్ పార్టీనే అడ్డుపడుతుందంటూ, బీజేపీ ఎంపీల సమావేశంలో 4 రోజుల క్రితం ప్రధాని మోడీ విమర్శించిన తర్వాత ఈ అనధికార ప్రకటన రావడం గమనార్హం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • government
  • Modi government
  • opposition
  • Parliament
  • Pegasus

తాజావార్తలు

  • Off The Record : తెలంగాణ స్పీకర్ కు ఢిల్లీ పిలుపు

  • Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • Iran War: భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్..

  • MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి హైకోర్టులో ఊరట

ట్రెండింగ్‌

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions