Home
Parliament Session
Parliament Session News
-
Parliament Winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారు..
Winter session of Parliament from December 7: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారు అయింది. డిసెంబర్ 7 నుంచి 29 వరకు సమావేశాలు జరగనున్నాయి. 23 రోజుల పాటు 17 సమావేశాలు జరగనున్నట్లు కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం వెల్లడించారు. 23 రోజుల్లో 17 రోజులు పార్లమెంట్ సమావేశాలు ఉండనున్నాయి. రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ మొదటిసారిగా రాజ్యసభ సమావేశాలను నిర్వహించనున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల… -
Parliament Monsoon Session: పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా.. వెంకయ్యకు ఘన వీడ్కోలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే నాలుగు రోజుల ముందే ముగిశాయి. పార్లమెంట్ ఉభయసభలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఆగస్టు 12న సమావేశాలు ముగియాల్సి ఉన్నప్పటికీ.. అంతకన్నా ముందే ఈ రోజే పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. -
Pending Cases in Courts: దేశంలో దాదాపు 5కోట్ల కేసులు పెండింగ్.. పార్లమెంట్లో కేంద్రం వెల్లడి
భారతదేశంలోని న్యాయస్థానాల్లో దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. భారతదేశంలోని వివిధ కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులు ఐదు కోట్ల మార్కుకు చేరుకుంటున్నాయని కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో వెల్లడించారు. -
Adhir Ranjan Chowdhury: ఆ ఎంపీలను సస్పెండ్ చేయాలి.. లోక్సభ స్పీకర్కు అధిర్ రంజన్ చౌదరి లేఖ
పార్లమెంట్లో ఇవాళ జరిగిన పరిణామాలపై కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. కాంగ్రెస్ అధినేత్ర సోనియా గాంధీ పట్ల బీజేపీ ఎంపీల అనుచిత ప్రవర్తనను ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లేందుకు చొరవ తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు. -
Spent on Ads: ప్రకటనల కోసం రూ.3,339 కోట్లు.. పార్లమెంట్లో కేంద్రం వెల్లడి
కేంద్రం 2017 నుంచి ప్రకటనల కోసం రూ. 3,339 కోట్లు ఖర్చు చేసిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవాళ రాజ్యసభలో వెల్లడించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆయన తెలిపారు. -
Parliament Monsoon Session: రాజ్యసభలో మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు
రాజ్యసభలో జరిగిన గందరగోళ పరిస్థితుల మధ్య డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో మరో ముగ్గురు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడింది. సభను, సభాపతి అధికారాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సభా వెల్లోకి ప్రవేశించి, నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారని డిప్యూటీ చైర్మన్ వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
Parliament Monsoon Session: కొత్త రాష్ట్రాల ప్రతిపాదన లేదు.. పార్లమెంట్లో కేంద్రం స్పష్టం
భారతదేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్రం స్పందించింది. ప్రస్తుతానికి దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే విషయంపై ఎలాంటి ప్రతిపాదన లేదని కాంగ్రెస్ ఎంపీ అదూర్ ప్రకాశ్ అడిగిన ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు. -
Parliament Monsoon Session: రాజ్యసభ నుంచి 19 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్
రాజ్యసభలో జరిగిన గందరగోళ పరిస్థితుల మధ్య డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిక ధరలపై సభలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. డిప్యూటీ ఛైర్మన్ సభను సజావుగా సాగేలా సహకరించాలంటూ కోరారు. కానీ ఆందోళనను విరమించకపోవడంతో... నిరసనలతో గందరగోళం సృష్టిస్తూ, సభా కార్యకలాపాలరు అంతరాయం కలిగిస్తున్నారంటూ విపక్షాలకు చెందిన 18 మంది ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. -
Parliament Monsoon Session: లోక్సభలో 4గురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు
లోక్సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. అనుచిత ప్రవర్తనతో సభకు ఆటంకం కలిగిస్తున్నారని లోక్సభ స్పీకర్ నలుగురు కాంగ్రెస్ ఎంపీలను మొత్తం వర్షాకాల సమావేశాల నుండి సస్పెండ్ చేశారు. -
PT Usha: రాజ్యసభ ఎంపీగా పీటీ ఉష ప్రమాణస్వీకారం
రాజ్యసభ ఎంపీగా ప్రముఖ మాజీ క్రీడాకారిణి పీటీ ఉష ప్రమాణస్వీకారం చేశారు. ఆమె హిందీలో భాషలో ప్రమాణం చేసింది. ఇటీవల ప్రఖ్యాత స్వరకర్త ఇళయరాజా, ఫిల్మ్ రైటర్ విజయేంద్ర ప్రసాద్, ఆధ్యాత్మిక నాయకుడు వీరేంద్ర హెగ్గడేతో పాటు ఉష పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ చేయబడింది. ఉషను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభకు నామినేట్ చేసింది.
తాజావార్తలు
-
OPEC+ : పెట్రోల్.. డీజిల్ ఉత్పత్తిపై ఒపెక్+ కీలక నిర్ణయం!
-
SRH Vs KKR: ఆరో విజయానికి కళ్లెం వేసిన కేకేఆర్.. ఓటమిలోనూ అభిషేక్ శర్మ రికార్డు..
-
Garlic Chicken Fry Recipe : చికెన్ ఫ్రై ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..!
-
Air Cooler: రోజుకు 8 గంటలు కూలర్ ఆన్లో ఉంటే ఎంత బిల్లు వస్తుందో తెలుసా?
-
Jabalpur Boat Tragedy: “లైఫ్ జాకెట్” ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!