Smriti Irani: ప్రశ్నించే దమ్ములేనోడు అడ్డుతగులుతున్నాడు.. రాహుల్పై స్మృతి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Irani: పార్లమెంట్ ఉభయ సభల్లో అంతరాయాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఆయనెప్పుడూ పార్లమెంట్లో గళం వినిపించింది లేదని… ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదని ఆమె మండిపడ్డారు. ఎప్పుడూ పార్లమెంట్ కార్యకలాపాలను అగౌరవపరుస్తూ వస్తున్నాడని ఆరోపించారు. పార్లమెంట్లో 40% కంటే తక్కువ హాజరు ఉన్న వ్యక్తి ఆయనేని. అలాంటి రాజకీయంగా ఉత్పాదకత లేని వ్యక్తి.. ఇప్పుడు పార్లమెంటులో చర్చ జరగకుండా చూసుకోవడానికి తనను తాను అంకితం చేసుకుంటున్నాడంటూ స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు.
జీఎస్టీ పెరుగుదల, ద్రవ్యోల్బణం, ఇతర సమస్యలపై ప్రతిపక్షాలు పార్లమెంట్లో నిరసనలు చేస్తుండగా.. స్మృతి ఇరానీ ప్రత్యేకంగా రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. వయనాడ్కు వెళ్లిన తర్వాత పార్లమెంట్లో ఎలాంటి ప్రశ్నలూ అడగలేదన్నారు. 2019లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ఆయన హాజరు కేవలం 40 శాతం మాత్రమేనని ఆమె విమర్శించారు. రాహుల్ గాంధీ రాజకీయ చరిత్ర మొత్తం పార్లమెంటరీ విధానాన్ని, రాజ్యాంగబద్ధమైన విధానాలను అగౌరవపరచడంతోనే నిండిపోయిందని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను ముందుకు తీసుకురావడానికి పార్లమెంట్ ఒక ఉత్పాదక వేదిక అని మంత్రి వెల్లడించారు.
Also Read
- Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
- Rahul Gandhi on NEET Paper Leak: "యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే".. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ వైఖరేంటి ? ఎవరికీ మద్దతిస్తారు ?
మంగళవారం రాహుల్ గాంధీ ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెరుగుదలకు వ్యతిరేకంగా పార్లమెంటులోని గాంధీ విగ్రహం ముందు ప్రతిపక్షాల నిరసనలో పాల్గొన్నారు. గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి ప్రభుత్వం నిత్యావసర ధరలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. వర్షాకాల సమావేశాల మొదటి రోజు ఉభయ సభల్లో ప్రతిపక్షాల గందరగోళం ఏర్పడింది, అవి కొన్ని గంటల్లోనే వాయిదా పడ్డాయి. జులై 18న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి.
తాజావార్తలు
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
-
Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!