Parliament Monsoon Session: రాజ్యసభలో మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Monsoon Session: రాజ్యసభలో జరిగిన గందరగోళ పరిస్థితుల మధ్య డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో మరో ముగ్గురు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడింది. సభను, సభాపతి అధికారాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సభా వెల్లోకి ప్రవేశించి, నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారని డిప్యూటీ చైర్మన్ వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సభ నుంచి సస్పెండ్ అయిన వారిలో ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ కుమార్ పాఠక్, స్వతంత్ర ఎంపీ అజిత్ కుమార్ భుయాన్ ఉన్నారు. గురువారం రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారనే ఆరోపణలపై ఈ వారం మిగిలిన కాలానికి రాజ్యసభ నుండి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్కు గురైన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఇప్పటి వరకు 23 మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేశారు.
సభా కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలిగించినందుకు మంగళవారం మొత్తం 19 మంది ప్రతిపక్ష ఎంపీలను ఈ వారం మిగిలిన వారం పాటు ఎగువ సభ నుంచి సస్పెండ్ చేశారు. ఎగువ సభలో ఒకే బ్యాచ్ సస్పెన్షన్లలో ఇదే అత్యధికం. గత ఏడాది నవంబర్లో వ్యవసాయ బిల్లులపై వర్షాకాల సమావేశాల సందర్భంగా వారు సృష్టించిన గందరగోళానికి 12 మంది ప్రతిపక్ష ఎంపీలను శీతాకాల సమావేశమంతా సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన 19 మంది సభ్యుల్లో ఏడుగురు టీఎంసీకి చెందినవారు, ఆరుగురు ఎంపీలు డీఎంకే, ముగ్గురు టీఆర్ఎస్, ఇద్దరు సీపీఎం, ఒక సీపీఐకి చెందినవారు. సస్పెండ్ అయిన ఆ 19 మంది సభ్యుల్లో టీఆర్ఎస్కు చెందిన బడుగుల లింగయ్య, రవిచంద్ర వద్దిరాజు, దామోదర్రావులతో పాటు సుస్మితా దేవ్, శాంతను సేన్, డోలా సేన్, కనిమొళి, మౌసుమ్ నూర్, శాంతా ఛెత్రీ, నదీముల్, రహీమ్, గిరిరాజన్, అభిరంజన్ బిస్వార్, అహ్మద్ అబ్దుల్లా, రహీం, కల్యాణసుందరం, ఎన్.ఆర్.ఇలాంగో, శివదాసన్, సందోష్ కుమార్ ఉన్నారు. అయితే, సస్పెండ్ అయిన సభ్యులు.. సభను వీడకుండా అక్కడే నిరసనకు దిగారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఇప్పటివరకు 23 మంది రాజ్యసభ ఎంపీలు, 4 లోక్సభ ఎంపీలతో సహా మొత్తం 27 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు.
Also Read
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
Voter ID:17 ఏళ్లకే ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈసీ కీలక నిర్ణయం
లోక్సభలో సోమవారం నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. అనుచిత ప్రవర్తనతో సభకు ఆటంకం కలిగిస్తున్నారని లోక్సభ స్పీకర్ నలుగురు కాంగ్రెస్ ఎంపీలను మొత్తం వర్షాకాల సమావేశాల నుండి సస్పెండ్ చేశారు. మాణిక్కం ఠాగూర్ సహా నలుగురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్కు గురైన ఎంపీల్లో మాణిక్కం ఠాగూర్, టీఎన్ ప్రతాపన్, జ్యోతిమణి, రమ్య హరిదాస్లు ఉన్నారు.
తాజావార్తలు
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!