పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్– ఇ–ఇన్సాఫ్ (పీటీఐ)కు బ్యాట్ గుర్తు కేటాయింపు వివాదంపై ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు
వరల్డ్ మోస్ట్ వాంటెడ్ మసూద్ అజార్ మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన బాంబు పేలుడులో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాకిస్థాన్ ఇంకా ధృవీకరించలేదు. సోమవారం ఉదయం భవల్పూర్ మసీదు నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై బాంబు విసిరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. దాడికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో మార్కెట్లో పేలుడు జరుగుతున్నట్లు కనిపిస్తోంది.…
మాములుగా అయితే కుక్కలను ఎంతో ముద్దుగా ఇష్టంగా పెంచుకుంటాం. ఏటైనా బయటకు వెళ్లినప్పుడు వాటి మెడకు గొలుసు కట్టి తీసుకెళ్తుంటాం. కానీ పాకిస్తాన్ లో మాత్రం ఓ పిల్లవాడు మాత్రం ఏకంగా పులికే గొలుసును కట్టి ఏం చక్కా పట్టుకుని తిరుగుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాకిస్థాన్కు చెందిన నౌమాన్ హసన్ అనే వ్యక్తి తన పెంపుడు పులులను వీడియోలలో ప్రదర్శించడం ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. చాలా…
వరల్డ్కప్లో పాకిస్తాన్కు మరోసారి ఓడిపోవడంతో భారత జట్టుపై సర్వాత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియాను భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినంధించారు. భారత ఘన విజయం పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు.
ఈనెల 14న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే అందుకోసం హైసెక్యూరిటీని ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్ పోలీసులు, ఎన్ఎస్జి, ఆర్ఎఎఫ్, హోంగార్డులతో సహా వివిధ ఏజెన్సీలకు చెందిన 11,000 మందికి పైగా సిబ్బందిని మోహరిస్తారని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఖలిస్థానీ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలు ఇరుదేశాల మధ్య దుమారం రేపిన సంగతి తెలిసిందే . తాజాగా భారత్ పై దాయాది దేశం పాక్ సంచలన ఆరోపణలు చేసింది. రెండు రోజుల క్రితం తమ దేశంలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో భారత దేశ ప్రమేయం ఉందని పాక్ మంత్రి ఒకరు అన్నారు. మస్తుంగ్ లో జరిగిన సూసైడ్ అటాక్ వెనక రా ఏజెంట్ల పాత్ర ఉందని…
దాయాది దేశం పాకిస్తాన్ లో మరోసారి ముష్కర మూకలు రెచ్చిపోయాయి. పదుల సంఖ్యలో అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నారు ఉగ్రవాదులు. తనని తాను పేల్చుకొని ఆత్మహుతి దాడి చేసి ఎంతో మందిని బలితీసుకున్నాడు ఓ దుర్మార్గుడు. బలూచిస్థాన్ ప్రావిన్సులోని మస్తుంగ్ జిల్లాలో ఇది జరిగింది. మహ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని భక్తులు ఎంతో సంతోషంగా ర్యాలీకి సమాయత్తం అవుతున్నారు మస్తుంగ్ జిల్లాలో. ఇంతలోనే ఓ అనుకోని ఘటన జరిగింది. Also Read: Cars under 6 Lakhs: రూ.6…
వన్డే ప్రపంచ కప్లో భాగంగా హైదరాబాద్లో న్యూజిలాండ్తో పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ సెంచరీ చేశాడు. 92 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఈ సెంచరీ ప్రపంచ కప్కు ముందు ఎంతో బలాన్ని ఇచ్చింది.
మరో వారం రోజుల్లో ఇండియాలో వరల్డ్ కప్ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల జట్లు భారత్కు చేరుకోగా.. వార్మప్ మ్యాచ్లు నేటి నుంచి ప్రారంభించాయి. తొలిసారిగా వన్డే ప్రపంచకప్కు ఇండియా ఆతిథ్యమిస్తుండటం విశేషం. అయితే ఈసారి జరగబోయే వన్డే వరల్డ్ కప్లో ఏఏ జట్లు సెమీ ఫైనల్ కు చేరుతాయనే చర్చ కూడా మొదలైంది. కొందరు క్రికెట్ దిగ్గజాలు సెమీస్ కు వెళ్లే టీమ్లను తెలిపారు.