World Cup 2023: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్కు ఎంత మంది సెక్యూరిటీ తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 14న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే అందుకోసం హైసెక్యూరిటీని ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్ పోలీసులు, ఎన్ఎస్జి, ఆర్ఎఎఫ్, హోంగార్డులతో సహా వివిధ ఏజెన్సీలకు చెందిన 11,000 మందికి పైగా సిబ్బందిని మోహరిస్తారని ఓ సీనియర్ అధికారి తెలిపారు. బెదిరింపుల నేపథ్యంలో అత్యున్నత స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. గత 20 ఏళ్లలో అహ్మదాబాద్ లో క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా మతపరమైన హింసకు గురికానప్పటికీ.. ముందుజాగ్రత్త చర్యగా అనేక మతపరమైన సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించనున్నట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ తెలిపారు.
Israel-Hamas War: ఇజ్రాయెల్, పాలస్తీనాలో ఖైదీల మార్పిడి.. మధ్యవర్తిత్వం వహిస్తోన్న ఖతార్!
Also Read
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
నిన్న గాంధీనగర్లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి, రాష్ట్ర డిజిపి వికాస్ సహాయ్, జిఎస్ మాలిక్, ఇతర సీనియర్ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. హైప్రొఫైల్ క్రీడలు జరిగేలా పోలీసుల కార్యాచరణ ప్రణాళికను సమీక్షించారు. అనంతరం మాలిక్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారని, మ్యాచ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. స్టేడియం వద్ద ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామన్నారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు జారీ చేయడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని మాలిక్ తెలిపారు.
Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రేపు సీఐడీ విచారణకు నారా లోకేశ్
నివేదికల ప్రకారం.. ముంబై పోలీసులకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంను పేల్చివేస్తామని, ప్రధానికి హాని చేస్తానని ఒక గుర్తు తెలియని పంపిన వ్యక్తి బెదిరింపులు జారీ చేసిన ఈ-మెయిల్ ను అందుకుంది. అంతేకాకుండా ఈ-మెయిల్ పంపిన వ్యక్తి రూ. 500 కోట్లు, కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను జైలు నుండి విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. ఈ బెదిరింపులను నగర పోలీసులు సరిగ్గా అంచనా చేశారని, మెయిల్ విదేశం నుండి పంపినట్లు కనుగొనబడిందని మాలిక్ చెప్పారు.
తాజావార్తలు
-
Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!