ఇటీవల ఆఫ్ఘనిస్థాన్పై పాకిస్థాన్ వైమానిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 46 మంది మరణించగా.. మృతుల్లో అత్యధికులు మహిళలు, పిల్లలు ఉన్నారని.. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అఫ్గానిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించారు. ఈ దాడి తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటోంది. ఇరువైపుల సైన్యాలు పరస్పరం సరిహద్దుల్లోకి ప్రవేశించి ప్రజలను చంపేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కొత్త యుద్ధం వచ్చే…
పెళ్లిళ్లలో డబ్బు వృథా చేయడం పెద్ద విషయం కాదు కానీ.. పాకిస్థాన్లో ఓ పెళ్లిలో డబ్బులు వృథా చేసిన తీరుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఒక తండ్రి తన కొడుకు పెళ్లి కోసం విమానం బుక్ చేశాడు. ఈ విమానం వధువు ఇంటిపై డబ్బు వర్షం కురిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎగతాలి చేస్తున్నారు.
Taliban: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. పాకిస్తాన్ తన భూభాగాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో తాలిబన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా తాలిబన్లు పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఆర్మీ ఔట్పోస్టులపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్లోని కుర్రం, ఉత్తర వజీరిస్తాన్లోని గిరిజన జిల్లాలను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. ప్రాణనష్టంపై ఖచ్చితమైన సమచారం లేనప్పటికీ, రెండు వైపుల భారీగా ఆయుధాలను మోహరించినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ ప్రతీకార దాడులకు శ్రీకారం చుట్టింది. పాక్లోని కొన్ని స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగింది. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
Abdul Rehman Makki: ముంబై ఉగ్రదాడి కుట్రదారు, లష్కరే తోయిబా (ఎల్ఈటీ) డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రహ్మాన్ మక్కీ ఈరోజు పాకిస్థాన్లో గుండెపోటుతో మరణించారు. అయితే, గత కొద్ది రోజులుగా లాహోర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మధుమేహ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతూ.. ఈ రోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారని జమాత్-ఉద్-దవా అధికారి ధృవీకరించారు.
Pakistan: 2011లో అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. మన పెరట్లో పాముల్ని పెంచుకుని, అవి పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించడం అవివేకం అవుతుందని పాకిస్తాన్ని ఉద్దేశించి అన్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిన పాకిస్తాన్ ఎదుర్కొంటోంది.
Pakistan : ఇటీవల ఉగ్రదాడి ఘటనలతో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు తాజా పరిణామంలో ఆఫ్ఘనిస్థాన్లో పాకిస్థాన్ వైమానిక దాడులు చేసింది.
Pakistan: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా, ప్రజలు అడుక్కుతింటున్నా పాకిస్తాన్ మాత్రం తన సైనిక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. గేమ్ ఛేంజింగ్గా మారే మిలిటరీ డీల్కి దాయాది దేశం సన్నద్ధమవుతోంది. అత్యాధునిక 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ J-35Aలను చైనా నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. చైనా నుంచి 40 అధునాతన స్టెల్త్ ఫైటర్లను కొనుగోలు చేయడానికి ఇస్లామాబాద్, చైనాతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సల్మాన్ ఖాన్ నుంచి షారుక్ ఖాన్ వరకు అందరి గురించి మాట్లాడారు. దీంతో పాటు మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ కంటే సంగీత స్వరకర్త ఆర్డి బర్మన్ గొప్పవాడని అన్నారు.