Pakistan: పాకిస్తాన్లోని ఈ నగరంలో 80 శాతానికి పైగా హిందువులు.. గోవధపై నిషేధం, ప్రతీ వీధిలో ఆలయం..
- పాకిస్తాన్లోని మిఠిలో 80 శాతానికి పైగా హిందువులు..
- మిఠి నగరంలో హిందువులదే ఆధిపత్యం..
- గోవధపై పూర్తిగా నిషేధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ మతం ఆధారంగా భారత్ నుంచి విడిపోయి ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది. ఆ దేశంలో 96 శాతం మంది ముస్లింలే, కేవలం 1-2శాతం మంది హిందువులు ఉన్నారు. పాకిస్తాన్ విభజన సమయంలో 20 శాతం వరకు ఉన్న హిందువులు, అణిచివేత కారణంగా కేవలం సింగిల్ డిజిట్కి పరిమితమయ్యారు. హిందువులపై అఘాయిత్యాలు, కిడ్నాప్లు పాకిస్తాన్ వ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి. బాలికలు, మహిళల్ని బలవంతంగా అపహరించి, మతం మార్చి, పెళ్లి చేసుకుంటున్న ఘటనలు చాలానే ఉన్నాయి. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ యొక్క 2023 జనాభా లెక్కల ప్రకారం, 2023 సంవత్సరంలో పాకిస్తాన్ మొత్తం జనాభా దాదాపు 24 కోట్ల 04 లక్షల 58 వేల 089. ఈ మొత్తం జనాభాలో ముస్లింల వాటా దాదాపు 96.35 శాతం. అయితే 2023 జనాభా లెక్కల ప్రకారం, పాకిస్తాన్ మొత్తంలో హిందువుల జనాభా కేవలం 1.61 శాతం మాత్రమే.
80 శాతం హిందూ జనాభా..
Also Read
- E20 Petrol: ఈ20 పెట్రోల్పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
అయితే, ఇలాంటి పాకిస్తాన్లో ఒక్క నగరంలో మాత్రం హిందువుల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఈ నగరంలోనే 80 శాతం హిందూ జనాభా ఉంది. ఆ నగరం పేరు ‘‘మిఠీ’’. పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్సులోని థార్పార్కర్ జిల్లాలో ఉంది. ఇది జిల్లా హెడ్క్వార్టర్. పూర్తిగా ఎడారి ప్రాంతంలోని మట్టిదిబ్బల మధ్య నగరం నెలకొని ఉంది. కరాచీ నుంచి దాదాపుగా 5-6 గంటల దూరంలో ఈ మిథి నగరం ఉంది. భారత్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది.
మిఠిలో హిందువుల ఆధిపత్యం..
పాకిస్తాన్ లోని అన్ని ప్రాంతాల్లో ముస్లింల ఆధిపత్యం ఉంటే, మిఠిలో మాత్రం హిందువుల రాజ్యమే నడుస్తుంది. దీనిని మిని హిందూస్తాన్గా వ్యవహరిస్తుంటారు. ఈ నగరంలో ప్రతీ వీధిలో ఆలయం ఉంటుంది. ప్రతీ ఇంటిపై ఓం, స్వస్తిక్ చిహ్నాలతో పాటు జైశ్రీరాం వంటి నినాదాలు కనిపిస్తుంటాయి. దీపావళి, హోళీ లాంటి పండగలు ఘనంగా జరుపుకుంటారు. జగదీష్ కాలనీ అంటూ ప్రతీ వీధి కూడా హిందూ మతాన్ని సూచిస్తుంది. ఈ మిథిలోని చాలా వరకు వ్యాపారం, దుకాణాలు హిందువుల చేతుల్లోనే ఉంటాయి.
గోవధపై నిషేధం:
పాక్లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈ ఒక్క ప్రాంతంలోనే పశువధపై నిషేధం ఉంది. ప్రతీ హిందూ కుటుంబం కూడా ఆవుల్ని పెంచుకుంటుంది. వీధుల్లో ఆవులు, పశువులు స్వేచ్ఛగా తిరుగుతుండటం చూడొచ్చు. ఇక్కడ నివసించే ముస్లింలు కూడా గోమాంసం తినరు. ఇరువర్గాలు కూడా కలిసి మెలిసి ఉంటాయి. ఒకరి పండగల్లో ఒకరు భాగమవుతారు.
తాజావార్తలు
-
Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
-
Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
-
WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
-
Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!