Earthquake: నేపాల్, పాకిస్థాన్.. ఉత్తర భారత్లో భూప్రకంపనలు
- నేపాల్, పాకిస్థాన్.. ఉత్తర భారత్లో భూప్రకంపనలు
- నేపాల్లో 6.1 తీవ్రతతో భూకంపం
- పాకిస్థాన్లో 4.5 తీవ్రత భూకంపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్, పాకిస్థాన్, ఉత్తర భారత్లో భూప్రకంపనలు హడలెత్తించాయి. నేపాల్లోని సింధుపాల్చోక్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే బీహార్లోని పాట్నాలో కూడా భూప్రకంపనలు సంభవించాయి. అయితే ఇప్పటివరకు ఎటువంటి నష్టం లేదా ప్రాణనష్టం సంభవించలేదు. సింధుపాల్చోక్లో భూకంప కేంద్రం ఏర్పడింది. తెల్లవారుజామున 2.35 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. హిమాలయ ప్రాంతం అంతటా ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. బీహార్లోని పాట్నా, ముజఫర్పూర్ సమీప ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. అలాగే పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్లో కూడా భూప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: National Science Day 2025: నేడే ‘నేషనల్ సైన్స్ డే’.. ఎందుకు జరుపుకుంటారంటే!
Also Read
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకారం.. భూకంప తీవ్రత 5.6 గా గుర్తించారు. భారతదేశ జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం దీనిని 5.5 గా అంచనా వేసింది. అయితే బహుళ భూకంపాలు సంభవిస్తాయా? లేదా అనేది స్పష్టంగా తెలియచేయలేదు. అయితే భూప్రకంపనలకు ప్రజలు భయాందోళన చెందారు. ఇళ్లల్లోంచి జనాలు బయటకు పరుగులు తీశారు. అయితే ఎవరికీ గాయాలు కాలేదని నేపాలీ సీనియర్ అధికారి గణేష్ నేపాలీ మీడియాతో తెలిపారు.
ఇక పాట్నాలో భూకంపం కారణంగా సీలింగ్ ఫ్యాన్లు ఊగుతున్నట్లుగా కనిపించాయి. దాదాపు 35 సెకన్ల పాటు ఫ్యాన్ ఊగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అలాగే శుక్రవారం తెల్లవారుజామున పాకిస్తాన్లో కూడా భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 5.14 గంటలకు భూకంపం సంభవించింది. 10 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా గుర్తించారు
ఈ ఏడాది జనవరిలో టిబెట్లోని హిమాలయ ప్రాంతంలో ఆరు భూకంపాలు సంభవించాయి. అత్యంత శక్తివంతమైన 7.1 తీవ్రతతో ప్రకంపనలు రావడంతో 125 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మధ్య కాలంలో వరుస ప్రకంపనలు రావడంతో ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.
ఇది కూడా చదవండి: AP Budget 2025-26: నేడు ఏపీ బడ్జెట్.. రూ.3.20 లక్షల కోట్ల అంచనాలతో..
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!