Wasim Akram: ‘‘కోతులు కూడా అంత తినవు’’.. పాక్ ప్లేయర్లపై వసీం అక్రమ్ ఫైర్..
- ‘‘కోతులు కూడా అంత తినవు’’..
- పాక్ ఆటగాళ్లపై వసీం అక్రమ్ తీవ్ర విమర్శలు..
- భారత్ చేతిలో ఓటమిపై రగిలిపోతున్న పాక్ మాజీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wasim Akram: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ చేతిలో పాకిస్తాన్ జట్టు ఘోరంగా ఓడిపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ఈ మెగా ఐసీసీ ఈవెంట్కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో గెలవలేదు. ఆతిథ్య జట్టు సెమీస్కి చేరకుండానే ఇంటి దారి పట్టడంపై పాక్ మాజీ ప్లేయర్లు, జట్టు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో కనీస పోరాటం లేకుండా ఓడిపోవడంపై ఫైర్ అవుతున్నారు.
Read Also: Ponnam Prabhakar: 20 ఏళ్లుగా దర్శించుకుంటున్నా.. ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం!
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- PBSK Vs MI: ఐపీఎల్లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
- Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ..
తాజాగా, మాజీ పాక్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్, పాక్ ప్లేయర్లను దారుణంగా విమర్శించారు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో ఓడించడం తర్వాత పాక్ భారత్తో అన్ని వన్డేల్లో ఓడిపోయింది. భారత్లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాక్ ప్లేయర్ల ‘‘ఆహారం’’ విషయంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అది ఫస్ట్ లేదా సెకండ్ డ్రింక్స్ బ్రేక్ అనుకుంటా. ఆటగాళ్ల కోసం ఒక ప్లేట్ నిండా అరటిపండ్లు ఉన్నాయి. అది వారి ఆహారం. కోతులు కూడా అంతగా అరటిపండ్లు తినవు. ఒక వేళ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అయి ఉంటే, అతను నన్ను కొట్టే వాడే’’ అని వసీం అక్రమ్ మ్యాచ్ అనంతర కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఆ రోజు మ్యాచ్ సమయంలో బౌలర్ల కోసం రెండు ట్రేలలో అరటి పండ్లు వచ్చాయి, కోతులు కూడా ఇన్ని అరటి పండ్లు తినవని చెప్పాను అని ఆయన అన్నారు.
మానవ పరిణామం కోతుల నుంచి వచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ ఆ దిశగా మాత్రమే వెళ్తోందని ఎద్దేవా చేశారు. ఆట వేగం అనేక రెట్లు పెరిగినప్పటికీ, పాకిస్తాన్ ఇంకా ప్రాచీన కాలం నాటి క్రికెట్ మాత్రమే ఆడుతోందని విమర్శించారు. పాక్ క్రికెట్ మారాలంటే భయం లేని క్రికెటర్లను, యంగ్ ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలని చెప్పారు. మీరు రాబోయే ఆరు నెలలు ఓడిపోతూనే ఉంటారు, కానీ 2026 టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును తయారు చేయడం ప్రారంభించాలని పాక్ బోర్డుకు హితవు పలికారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!