Wasim Akram: ‘‘కోతులు కూడా అంత తినవు’’.. పాక్ ప్లేయర్లపై వసీం అక్రమ్ ఫైర్..
- ‘‘కోతులు కూడా అంత తినవు’’..
- పాక్ ఆటగాళ్లపై వసీం అక్రమ్ తీవ్ర విమర్శలు..
- భారత్ చేతిలో ఓటమిపై రగిలిపోతున్న పాక్ మాజీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wasim Akram: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ చేతిలో పాకిస్తాన్ జట్టు ఘోరంగా ఓడిపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ఈ మెగా ఐసీసీ ఈవెంట్కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో గెలవలేదు. ఆతిథ్య జట్టు సెమీస్కి చేరకుండానే ఇంటి దారి పట్టడంపై పాక్ మాజీ ప్లేయర్లు, జట్టు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో కనీస పోరాటం లేకుండా ఓడిపోవడంపై ఫైర్ అవుతున్నారు.
Read Also: Ponnam Prabhakar: 20 ఏళ్లుగా దర్శించుకుంటున్నా.. ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం!
Also Read
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
- Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
తాజాగా, మాజీ పాక్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్, పాక్ ప్లేయర్లను దారుణంగా విమర్శించారు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో ఓడించడం తర్వాత పాక్ భారత్తో అన్ని వన్డేల్లో ఓడిపోయింది. భారత్లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాక్ ప్లేయర్ల ‘‘ఆహారం’’ విషయంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అది ఫస్ట్ లేదా సెకండ్ డ్రింక్స్ బ్రేక్ అనుకుంటా. ఆటగాళ్ల కోసం ఒక ప్లేట్ నిండా అరటిపండ్లు ఉన్నాయి. అది వారి ఆహారం. కోతులు కూడా అంతగా అరటిపండ్లు తినవు. ఒక వేళ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అయి ఉంటే, అతను నన్ను కొట్టే వాడే’’ అని వసీం అక్రమ్ మ్యాచ్ అనంతర కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఆ రోజు మ్యాచ్ సమయంలో బౌలర్ల కోసం రెండు ట్రేలలో అరటి పండ్లు వచ్చాయి, కోతులు కూడా ఇన్ని అరటి పండ్లు తినవని చెప్పాను అని ఆయన అన్నారు.
మానవ పరిణామం కోతుల నుంచి వచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ ఆ దిశగా మాత్రమే వెళ్తోందని ఎద్దేవా చేశారు. ఆట వేగం అనేక రెట్లు పెరిగినప్పటికీ, పాకిస్తాన్ ఇంకా ప్రాచీన కాలం నాటి క్రికెట్ మాత్రమే ఆడుతోందని విమర్శించారు. పాక్ క్రికెట్ మారాలంటే భయం లేని క్రికెటర్లను, యంగ్ ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలని చెప్పారు. మీరు రాబోయే ఆరు నెలలు ఓడిపోతూనే ఉంటారు, కానీ 2026 టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును తయారు చేయడం ప్రారంభించాలని పాక్ బోర్డుకు హితవు పలికారు.
తాజావార్తలు
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..