Champions Trophy 2025: ఇమ్రాన్ ఖాన్ వల్లే ఈ పరిస్థితి.. పీసీబీ మాజీ ఛైర్మన్ ఆగ్రహం!
- పాకిస్థాన్ వరుస పరాజయాలు
- పీసీబీ మాజీ ఛైర్మన్ ఆగ్రహం
- ఇమ్రాన్ ఖాన్ వల్లే పాక్ క్రికెట్ పతనమైందన్న సేథి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్థాన్ వరుస పరాజయాలను ఎదుర్కొంది. వరుసగా రెండు మ్యాచుల్లో న్యూజీలాండ్, భారత్ చేతుల్లో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. సొంత మైదానాల్లో ఘోర పరాభవాలను ఎదుర్కొన్న పాకిస్థాన్పై విమర్శల వర్షం కురుస్తోంది. పాక్ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ఛైర్మన్ నజామ్ సేథి ఫైర్ అయ్యారు. మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ వల్లే పాక్ క్రికెట్ పతనమైందని మండిపడ్డారు. ఇమ్రాన్ ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలే ఈ పరిస్థితి కారణం అని పేర్కొన్నారు.
‘పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై దేశంలోని అభిమానుల ఆగ్రహం సరైందే. పాక్ ప్రదర్శన అట్టడుగు స్థాయికి చేరుకుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. 1990, 1996లో వన్డేల్లో.. 2016లో టెస్టుల్లో, 2018లో టీ20ల్లో అగ్రస్థానం సాధించిన జట్టు. 1992లో ప్రపంచకప్, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమ్.. ఈ రోజు జింబాబ్వేతో సమానవుంతుందా?. 2019లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో కొత్త మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణం. దేశవాళీ క్రికెట్ను పూర్తిగా మార్చేశారు. దశాబ్దాలుగా అత్యుత్తమ క్రికెటర్లను అందిస్తోన్న దేశవాళీ క్రికెట్ను నిర్లక్ష్యం చేశారు. పాకిస్థాన్కు సరిపోని ఆస్ట్రేలియన్ హైబ్రిడ్ మోడల్తో పతనం ప్రారంభమైంది’ అని నజామ్ సేథి పేర్కొన్నారు.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
‘పీసీబీలో రాజకీయాలు ఎక్కువైపోయాయి. పీసీబీ విధానాలు పూర్తిగా దారితప్పాయి. విదేశీ కోచ్లను నియమించారు, ఇష్టమైన వారిని సెలక్టర్లుగా ఎంపిక చేశారు, మేనేజ్మెంట్లో పాతవారిని తీసుకున్నారు.. ఇలా ఎన్నో జరిగాయి. చివరగా జట్టులోని సహచరులతో కెప్టెన్కు పడకపోవడం, టీమ్ గ్రూప్లు విడిపోవడంను మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. అన్ని కలిపి ఇప్పుడు దారుణమైన ఫలితాలను చూడాల్సి వస్తోంది. సమస్యలను పరిష్కరించి.. నైపుణ్యాన్ని ఎంకరేజ్ చేస్తే జట్టు గాడిన పడుతుంది’ అని నజామ్ సేథి ఎక్స్లో రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!