తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చిన వెంటనే పాక్ అక్కడ కొత్తగా ఏర్పాటు చేసే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఒకవైపు కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెబుతూనే, ఆఫ్ఘనిస్తాన్-పాక్ సరిహద్దుల్లో 2600 కిలోమీటర్ల మేర అత్యంత వేగంగా ఇనుప కంచెను నిర్మించింది. 2 మీటర్ల వెడల్పు, 3.6 మీటర్ల ఎత్తులో కంచెను నిర్మించింది. అంతేకాదు, ఈ సరిహద్దు వెంట 1000 చెక్ పోస్టులు, ఇన్ఫ్రారెడ్ కెమెరాలను ఏర్పాటు చేసింది. కేవలం 16 ప్రాంతాల నుంచి మాత్రమే…
మహారాజా రంజిత్ సింగ్ 180 వ జన్మదినం సందర్భంగా లాహోర్ పోర్టులో పాక్ ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. 18వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్ ప్రావిన్స్ను పరిపాలించారు. లాహోర్ రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఆయన పరిపాలన కాలంలో లాహోర్ అభివృద్ది జరిగింది. అయితే, మంగళవారం రోజున పాక్ అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు పోర్టులో ఏర్పాటు చేసిన మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వెంటనే అలర్ట్ అయిన…
ఆగస్టు 14 వ తేదీన పాక్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటే, ఆగస్ట్ 15 వ తేదీన ఇండియా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నది. ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అసేతు హిమాచలం మొత్తం ఈ వేడుకల్లో పాల్గొన్నది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో ఇండియా పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. నిఘాను, భద్రతను కట్టుదిట్టం చేస్తారు. ఆదివారం సాయంత్రం రోజున పంజాబ్లోని రూప్నగర్ జిల్లా సనోడా గ్రామంలో పంటపొలాల్లో పాక్ బెలూన్లు కనిపించాయి.…
దేశ చరిత్రలో ఆగస్టు 14 వ తేదీని ఎప్పటికీ మర్చిపోలేరు. అఖండ భారతం ఇండియా-పాకిస్తాన్గా విడిపోయిన రోజు. భారత్, పాక్ విడిపోయిన సమయంలో ప్రజలు పడిన బాధలను ఎన్నటికీ మర్చిపోలేమని, ప్రజల కష్టాలు, త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఆగస్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్ గా జరుపుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇండియా పాక్ విభజన సమయంలో రెండు దేశాల్లో ఉన్న లక్షలాది మంది ప్రజలు వారి ప్రాంతాలను నుంచి వేరు కావాల్సి వచ్చింది. ఆ సమయంలో…
అమెరికా-పాక్ దేశాల మధ్య మంచి మైత్రి ఉన్నది. అయితే, ఈ మైత్రి గత కొంతకాలంగా సజావుగా ఉండటంలేదు. పాక్లో ఉగ్రవాదం పెరిగిపోవడంతో పాటుగా, ఆ దేశం చైనాతో బలమైన సంబందాలు కలిగి ఉండటం వలన అమెరికా పాక్ కు దూరమైందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రెండు దశాబ్దాల కాలం క్రితం అమెరికా దళాలు అఫ్ఘనిస్తాన్లో అడుగుపెట్టి తాలిబన్, ఆల్ఖైదా వంటి తీవ్రవాద సంస్థలపై విరుచుకుపడ్డాయి. ఆ సమయంలో పాక్ సహకారంలో అమెరికా తాలిబన్ల ఆటకట్టించింది. ప్రస్తుతం అమెరికా-పాక్…
మాస్క్ లేకుండా బయటకు వస్తే భారీ జరిమానాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మాస్క్ పెట్టుకున్నప్పటికీ ఓ వ్యక్తికి జరిమానా విధించడంతో పాటుగా జైల్లో పెట్టారు. అదేంటి మాస్క్ ధరిస్తే జరిమానా వేయడం ఏంటి అనుకుంటున్నారా… అక్కడే ఉంది ట్విస్ట్. మామూలు మాస్క్ ధరిస్తే ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ, ఆ వ్యక్తి భయపెట్టే విధంగా కాస్ట్యూమ్ మాస్క్ ధరించాడు. భయపెట్టే విధంగా ఉన్న మాస్క్ ధరించి దారినపోయే వారిని భయపెడుతుండటంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని…
కరోనా హమ్మారి సమయంలో విదేశీ ప్రయాణికుల రాకపై చాలా దేశాలు నిషేధం విధించాయి.. మా దేశానికి రావొద్దు అంటూ రెడ్ లిస్ట్లో పెట్టేశాయి… దీంతో… చాలా దేశాలకు రాకపోకలు నిలిచిపోయాయి… అంతే కాదు.. కొన్న విదేశాల వాళ్లు.. ఇతర దేశాల్లోనూ చిక్కుకుపోయిన పరిస్థితి. క్రమంగా సెకండ్ వేవ్ కేసులు తగ్గిపోతుండడంతో.. కొన్ని సడలింపులు, వెసులుబాట్లు కల్పిస్తున్నారు.. భారత్లో కోవిడ్ విజృంభణ నేపథ్యంలో యూకే భారత్ను రెడ్లిస్ట్లో పెట్టింది.. అయితే, పరిస్థితులు ప్రస్తుతం మెరుగుపడడంతో రెడ్లాస్ట్ నుంచి తొలగించిన…
పాక్లో మరో హిందూ ఆలయంపై దాడులు జరిగాయి. పాక్లోని రహీమ్ యార్ ఖాన్ జిల్లాలోని భాంగ్ నగరంలోని సిద్ధి వినాయక దేవాలయంపై కొంతమంది అల్లరిమూక దాడులు చేసి ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో అలయం పూర్తిగా ధ్వంసం అయింది. పాక్లో హిందువులు, సిక్కులు మైనర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. మైనర్లపై అక్కడ తరచుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రసిద్ది చెందిన ఎన్నో దేవాలయాలను అక్కడి మెజారిటీలు ధ్వంసం చేశారు. సిద్ధివినాయక దేవాలయంపై బుధవారం రోజున కొంతమంది మూక…
ఇండియా పాక్ దేశాల మధ్య ఎలాంటి పోటీ జరిగినా అది ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక క్రికెట్ మ్యాచ్ జరిగితే దాని కథ వేరుగా ఉంటుంది. అక్టోబర్ నెలలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్లు ఒమన్, యూఏఈలో జరగనున్నాయి. మార్చి 20 నాటికి టీ 20 ర్యాంకింగ్స్ ఆధారంగా రెండు 12 టీమ్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్లో…
పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో చెప్పాల్సిన అవసరం లేదు. పక్కనున్న గల్ఫ్ దేశాలు ఆయిల్, పర్యాటక రంగం పేరుతో సంపాదన పెంచుకుంటుంటే, పాక్ మాత్రం ఉగ్రవాదులకు అండగా ఉంటూ, చైనాకు వత్తాసు పలుకుతూ, ఇండియాని చూసి ఏడుస్తూ పరిస్థితిని దిగజార్చుకుంటోంది. ఇప్పటికే ఆ దేశం పీకలలోతు అప్పుల్లో కూరుకుపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముంటుంది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ సర్కార్ పరిస్థితి కూడా అలానే ఉన్నది. Read: వైరల్: పెళ్లికొడుకు చేతిలో…