Pakistan: హఫీస్ సయీద్, జేడీయూ ఉగ్రసంస్థ సభ్యుల హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీస్ సయీద్ కు చెందిన ఉగ్రసంస్థ జామాత్- ఉద్- దావా ( జేడీయూ)కు చెందిన ఇద్దరు సభ్యులను ప్రత్యర్థి గ్రూప్ కాల్చి చంపింది. ఈ ఘటన పాకిస్తాన్ లో కలకలం రేపింది. లాహోర్ కు 130 కిలోమీటర్ల దూరంలోని ఫైసలాబాద్ జరన్ వాలా చక్ 97 జిల్లాలో ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది.
జేడీయూకు చెందిన రషీద్ అలీ, షాహిద్ ఫరూఖ్ ఇద్దరు ఈద్ అల్ అదా ప్రార్థనలు ముగించుకుని వస్తుండగా.. అష్రాఫ్ ఖాశీ, జమీల్ మరో ఇద్దరు వ్యక్తులు వారిని అడ్డగించి సమీపం నుంచి కాల్చి చంపారు. దీంతో వారు అక్కడిక్కడే మరణించారు. మరణించిన తర్వాత వారి డెడ్ బాడీలను తన్నుతూ మతపరమైన నినాదాలు చేశారు. నిందితులు అహ్లే సున్నత్ అనే సంస్థకు చెందిన వారు. ఓ మసీదు నిర్మాణ విషయంలో రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగుతోంది. నిందితులను ఇంకా పట్టుకోలేదని పాకిస్తాన్ పోలీస్ అధికారులు వెల్లడించారు.
Also Read
- Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
Read Also: Microsoft: మైక్రోసాఫ్ట్ షాకింగ్ నిర్ణయం.. 1800 మంది ఉద్యోగులపై వేటు
హఫీస్ సయీద్ జేడీయూ ఉగ్రసంస్థతో పాటు లష్కర్ ఏ తోయిబా ఉగ్రసంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు. 2008 ముంబై ఉగ్ర ఘటనలో కీలకం వ్యవహరించిన ఉగ్రవాదుల్లో ఒకరిగా ఉన్నారు. అన్ని ఆధారాలు ఉన్నా కూడా పాక్ ప్రభుత్వం అతని పట్ల మెతక వైఖరి అవలంభిస్తోంది. పాక్ లో ఉంటూ కాశ్మీర్ తో పాటు ఇండియా వ్యాప్తంగా ఉగ్రవాద ఘటనలకు హఫీస్ సయీద్ కారణం. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ యువకులను తన ప్రసంగాలతో రెచ్చగొడుతుంటాడు.
తాజావార్తలు
-
West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
-
Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది చూసేయండి!
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..