Pakistan: దైవదూషణలో చైనీయుడి అరెస్ట్.. మిత్రదేశం విషయంలో పాక్ ఏం చేస్తుందో చూడాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ తో పాటు ఇతర ఇస్లామిక్ దేశాల్లో ‘‘దైవదూషణ’’కు తీవ్రమైన శిక్షలు ఉంటాయి. మరణశిక్షలు విధించిన సందర్భాలు ఎక్కువ. పాకిస్తాన్ వంటి దేశాల్లో అయితే ఎలాంటి అనుమానం ఉన్నా కూడా దైవదూషణ వంటి కేసుల్లో మతోన్మాదులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో జరిగాయి. 2021లో ఓ శ్రీలంక జాతీయుడిని దైవదూషణ పేరుతో ప్రజలే నిప్పంటించి కాల్చి చంపారు. దీని తర్వాత ఓ వ్యక్తిపై దాడి చేసేందుకు ఏకంగా పోలీస్ స్టేషన్ నే అటాక్ చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా ఓ చైనా జాతీయుడిని దైవదుషణ ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో డ్యామ్ ప్రాజెక్టులో ఇతడు పనిచేస్తున్నాడు. చైనా గెజౌబా గ్రూప్ కంపెనీలో ఇంజనీర్గా ఉన్న వ్యక్తి.. రంజాన్ ప్రార్థనల కోసం చాలా బ్రేకులు తీసుకోవడంపై కార్మికులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. దైవదూషణ చేశాడనే ఆరోపణలపై అతడిపై దాడి చేసేందుకు సిబ్బంది గుమిగూడిన సమయంలో పోలీసులకు ఫోన్ చేశారు. అయితే మిత్రదేశం చైనాకు చెందిన వ్యక్తి కావడం, పాకిస్తాన్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో చైనీయులు పనిచేస్తుండటంతో ఈ సంఘటనపై పాకిస్తాన్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
Also Read
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Nepal Floods: నేపాల్లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
Read Also: Golden Temple: అమ్మాయి ముఖంపై భారత జెండా..స్వర్ణదేవాలయంలోకి అనుమతి నిరాకరణ..
ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని మారుమూల కోహిస్తాన్ ప్రాంతంలోని పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. జూలై 2021 ఆత్మాహుతి బాంబు దాడిలో తొమ్మిది మంది చైనా జాతీయులు మరణించిన తర్వాత దాసు జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న చైనా జాతీయులకు భారీ భద్రతను కట్టుదిట్టం చేసింది. పాకిస్తాన్ లో ఓ విదేశీయుడిపై దైవదూషణ ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు విదేశీయులపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.
డిసెంబర్ 2021లో, సియాల్కోట్లోని ఫ్యాక్టరీ మేనేజర్గా పని చేస్తున్న శ్రీలంక జాతీయుడు ప్రియంత దియవదనాగే (48)ను దైవదూషణ ఆరోపణలపై కొట్టి చంపి, అతని శరీరానికి నిప్పంటించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చైనా వ్యక్తిపై దైవదూషణ ఫిర్యాదును నమోదు చేయాలా వద్దా..? అనే దానిపై నిర్ణయించడానికి సోమవారం గిరిజన కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ వివాదం పాక్, చైనాల మధ్య దౌత్యపరమైన సంఘటనగా మారే అవకాశం ఉండటంతో పాకిస్తాన్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
Protests continued in Kohistan of Khyber Pakhtunkhwa,blocking KKH against Chinese citizen, who is working at Dassu dam project,for allegedly committing blasphemy during his argument with local labourers.
Police arrested the Chinese citizen. pic.twitter.com/JH6IVN6QxT— Jamil Nagri (@jamilnagri) April 16, 2023
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!