Imran Khan: పాక్ ఆర్మీ చీఫ్ పై ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు.. మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్ అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతల మధ్య పాకిస్తాన్ బతుకీడుస్తోంది. అక్కడి జనాలకు తినడానికి తిండి కరువైంది. విదేశీమారక నిల్వలు లేక దిగుమతులు చేసుకోలేని పరిస్థితి. అరబ్ దేశాలు, ఆల్ టైం ఫ్రెండ్ చైనా కూడా పెద్దగా పాకిస్తాన్ ను పట్టించుకోవడం లేదు. దీనికి తోడు ఇటీవల కాలంలో పాక్ ప్రభుత్వం, సుప్రీంకోర్టుల మధ్య ఘర్షణ తీవ్రం అయింది. స్వీడన్ వంటి కొన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసేస్తున్నాయి. మరోవైపు పాక్ ప్రభుత్వం, అక్కడి సైన్యంపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తిరగబడుతున్నారు. అతనికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ కూడా లభిస్తోంది.
Read Also: Tomatoes grown in space: అంతరిక్షంలో పండించిన టొమాటో… భూమికి తీసుకువస్తున్న డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
- Nepal Floods: నేపాల్ వరదల్లో 160 మంది మృతి, 750 మందికి పైగా గల్లంతు
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ఇదిలా ఉంటే తాజాగా ఇమ్రాన్ ఖాన్ అక్కడి ఆర్మీ చీఫ్ ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ రాజకీయాల్లో ఆర్మీ చీఫ్ అత్యంత శక్తివంతమైన వ్యక్తి అని, అతడి నిర్ణయాలను అందరూ పాటిస్తారని అన్నారు. శుక్రవారం అతడి నివాసంలో ఏర్పాటు చేసిన పాకిస్తాన్ తెహ్రీక్- ఇ-ఇన్సాఫ్ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని దించాలని, ప్రజలంతా సుప్రీంకోర్టుకు అండగా నిలబడాలని అన్నారు. పాకిస్తాన్ లో ఆర్మీ చీఫ్ శక్తివంతమైన వ్యక్తి అని.. తాను మళ్లీ అధికారంలోకి రాకూడదని సైనిక వ్యవస్థ అవినీతి షరీఫ్-జర్ధారీల ప్రభుత్వానికి అండగా నిలుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.
ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాలపై అక్కడి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ మీడియా అప్రకటిత నిషేధాన్ని విధించాయి. పాక్ సుప్రీంకోర్టులో విభజనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఇమ్రాన్, ఇది దేశానికి పెను విషాదం అని అన్నారు. ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెడ్దపేరు తెచ్చే పనిచేస్తుందని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యం కోరుకునే వారు సుప్రీంకు అండగా నిలబడాలని అన్నారు. దీనికి నేను ముందుండి నాయకత్వం వహిస్తా అని అన్నారు. తనను చంపడానికి దేశంలో శక్తివంతమైన సర్కిల్ ఏర్పడుతోందని ఆరోపించారు. ఐఎస్ఐ ఉన్నతాధికార మేజర్ ఫైసల్ నసీర్ ను ‘‘డర్టీ హ్యరీ’’గా పిలిచే వాడని, అతడిపై హత్యాయత్నం వెనక ప్రధాని షెహబాజ్ షరీఫ్, హోం మినిస్టర్ రాణా సనావుల్లా ఉన్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్వైడ్గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
-
Dean Elgar Retirement: క్రికెట్కు గుడ్బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్.. విరాట్ కోహ్లీతో వివాదం గుర్తుందా?
-
Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు
ట్రెండింగ్
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!