Pakistan Fuel Prices: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల ప్రభావం పాకిస్థాన్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ఆ దేశ ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు తీవ్రమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం దిగొచ్చి దిద్దుబాటు చర్యలు షురూ చేసింది. సామాన్యులను శాంతింపజేసేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అర్ధరాత్రి సంచలన ప్రకటన చేశారు. పెట్రోల్ ధరను ఏకంగా 80 పాకిస్థానీ రూపాయలు తగ్గించారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం ఆ దేశంలో పెట్రోల్ ధర రూ.378కి చేరుకుంది. గురువారం రోజున ప్రభుత్వం పెట్రోల్పై…
Pakistan: ద్రవ్యోల్బణం, ఇరాన్ యుద్ధం పాకిస్తాన్ను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ PKR 458.4 (సుమారు ₹152)కు చేరగా, డీజిల్ ధర లీటరుకు PKR 520.35కు పెరిగింది. ఏకంగా పెట్రోల్, డీజిల్ ధరలు 42.7 శాతం, 54.9 శాతం పెరిగాయి. అయితే,
Pakistan Cancels Republic Day Parade: పాకిస్తాన్ ఈ సంవత్సరం మార్చి 23న జరగాల్సిన గణతంత్ర దినోత్సవ పరేడ్ను రద్దు చేసింది. ప్రధాన కారణాలు దేశంలో ఇంధన కొరత, పెరుగుతున్న చమురు ధరలు మరియు ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించాల్సిన అవసరం అని ప్రభుత్వ ప్రకటనలో పేర్కొనబడింది. సాంప్రదాయంగా, పాకిస్తాన్ దినోత్సవాన్ని ఇస్లామాబాద్లో 31-గన్ సెల్యూట్తో, రాష్ట్ర రాజధానులలో 21-గన్ సెల్యూట్లతో మరియు సాయుధ దళాల ప్రదర్శనతో జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం, పరేడ్ రద్దు చేయబడినప్పటికీ, జెండా…
మిడిల్ ఈస్ట్ లో చోటుచేసుకున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయి. గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్తాన్పై ప్రభావం చూపుతున్నాయి. పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు రాత్రికి రాత్రే గణనీయంగా పెరిగాయి. పెట్రోల్, హై-స్పీడ్ డీజిల్ ధర లీటరుకు 55 పాకిస్తానీ రూపాయలు పెరిగింది. పాకిస్తాన్లో ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలో ఇదే భారీ పెరుగుదల. Also Read:Best Bikes: లీటరుకు…
Pakistan: భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. ప్రస్తుతం ఈ డీల్ పలు దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్లో వణుకు మొదలైంది. అయితే, పాకిస్తాన్లో సొంత ప్రజలే ఆ దేశాన్ని తిట్టిపోస్తున్నారు. ట్రంప్తో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి ఆసిమ్ మునీర్లు అంటకాగిన భారత్ లాంటి డీల్ కుదర్చుకోలేకపోయామని ఆ దేశం వాపోతోంది.
Pakistan: పాకిస్తాన్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయితే, ఇప్పుడు ఆర్థిక సంక్షోభానికి అనుగుణంగా పాక్ ప్రజలు మరో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. పాక్ కుటుంబాలు తమ ఆదాయంలో మూడింట రెండు వంతుల్ని ఆహారం, విద్యుత్ వంటి వాటికే చెల్లించాల్సి వస్తోంది. దీని కారణంగా విద్య, ఆరోగ్యం, దీర్ఘకాలిక అవసరాలకు ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడిందని కొత్త ప్రభుత్వ సర్వే తెలియజేస్తోంది.
Pakistan: పాకిస్థాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం అక్కడి పౌరులలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. టమోటా ధర కిలోగ్రాముకు రూ.600కి చేరింది. ఇది దాదాపు 400% పెరుగుదలను సూచిస్తుంది. ఈ పరిస్థితులు ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. తాజాగా ఈ సమస్య పార్లమెంటులో గందరగోళ పరిస్థితులకు దారితీసింది. టమాటాలు కొనడానికి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎంపీలు వ్యంగ్యంగా స్పందించారు.
Pakistan: పాకిస్తాన్కి చైనా షాక్ ఇచ్చింది. చైనా పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ని, తమ దేశంలోని జిన్జియాంగ్ ప్రావిన్సులను కలుపుతూ రోడ్డు, రైలు నెట్వర్క్ను అభివృద్ధి చేస్తుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)లో భాగంగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(CPEC) చేపట్టింది. ఇప్పటికే బలూచిస్తాన్లోని గ్వాదర్ పోర్టును డెవలప్ చేసింది.
Pakistan: పాకిస్తాన్ ఓ వైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, ఆ దేశం సైన్యానికి మాత్రం బాగా ఖర్చు చేస్తోంది. ప్రజల గురించి ఆలోచించడం మానేసి, భారత వ్యతిరేకతతోనే బతుకుతోంది. దేశాన్ని ఆర్థిక గండం నుంచి బయటపడేసేందుకు ప్రధాని నేతృత్వంలోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకుల ముందు సాగిలపడుతోంది. ఇదే కాకుండా, పాకిస్తాన్ మిత్రదేశాల పర్యటనలకు వెళ్లి ‘‘భిక్షం’’ అడుగుతోంది.
India VS Pakistan: భారత్, పాకిస్తాన్ ఒక రోజు వ్యవధితో 1947 ఆగస్టులో స్వాతంత్య్రాన్ని పొందాయి. ఒకప్పుడు, భారత్తో పోలిస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉండేది. కానీ ఇప్పుడు, భారత్ ప్రపంచంలోనే అమెరికా, చైనా, జర్మనీల తర్వాత నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. మరోవైపు, పాకిస్తాన్ వరుసగా ఐఎంఎఫ్ నుంచి బెయిలౌట్లు, బాంబులు, అప్పుల్లో కూరుకుపోయింది.