Pakistan: మేము బిచ్చగాళ్లమే.. ఒప్పుకున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..
- ‘‘ మిత్రదేశాలు కూడా పాకిస్తాన్ భిక్షాటన గిన్నెతో రావాలనుకోవడం లేదు’’..
- ఇలా చేసే చివరి వ్యక్తులం నేను, ఆసిమ్ మునీర్ అవుతాము..
- పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఓ వైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, ఆ దేశం సైన్యానికి మాత్రం బాగా ఖర్చు చేస్తోంది. ప్రజల గురించి ఆలోచించడం మానేసి, భారత వ్యతిరేకతతోనే బతుకుతోంది. దేశాన్ని ఆర్థిక గండం నుంచి బయటపడేసేందుకు ప్రధాని నేతృత్వంలోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకుల ముందు సాగిలపడుతోంది. ఇదే కాకుండా, పాకిస్తాన్ మిత్రదేశాల పర్యటనలకు వెళ్లి ‘‘భిక్షం’’ అడుగుతోంది.
పాకిస్తాన్ ప్రధాని పర్యటనకు వస్తున్నారంటే దాని మిత్రదేశాలు భయపడుతున్నాయి. తమను ఎక్కడ అప్పులు అడుగుతారో అని సందేహపడుతున్నాయి. ఇప్పటికే, పాకిస్తాన్ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగింది. నిత్యావసరాలు అందుబాటు ధరల్లో లేవు. ఇక గోధుమ పిండి కోసం పెద్ద యుద్ధాలే చేయాల్సి వస్తోంది. రాజకీయ తిరుగుబాటు, సైన్యం ఒత్తిళ్లు, బలూచ్ తిరుగుబాటు, పాక్ తాలిబాన్ల దాడులతో ఆ దేశం అతలాకుతలం అవుతోంది.
Also Read
- Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Strait of Hormuz: హోర్ముజ్పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
Read Also: Sree Leela : ఎంగేజ్ మెంట్ ఫొటోలపై స్పందించిన శ్రీలీల..
ఇదిలా ఉంటే, తమ పరిస్థితి ఏంటనేది స్వయంగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అందరి ముందు ఒప్పుకున్నాడు. ‘‘తాము భిక్షగాళ్లమే’’ అని పరోక్షంగా చెప్పాడు. శనివారం జరిగిన ఒక సైనిక కార్యక్రమంలో షరీఫ్ మాట్లాడుతూ.. ఇప్పుడు మన మిత్రదేశాలు కూడా పాకిస్తాన్ ‘‘భిక్షాటన గిన్నె’’తో రావాలని కోరుకోవడం లేదని అన్నారు. చైనా, సౌదీ అరేబియా, టర్కీ, ఖతార్, యూఏఈ తమ అత్యంత విశ్వసనీయ మిత్రదేశాలని చెప్పారు. ఇప్పుడు వారు వాణిజ్యం నుంచి విద్య వరకు అన్ని రంగాల్లో పాకిస్తాన్ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నారని, మేము భిక్షాటన గిన్నెతో వారి వద్దకు వెళ్లాలని కోరుకోవడం లేదని షరీఫ్ చెప్పారు.
నేను, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇలా చేసే చివరి వ్యక్తులం అవుతామని ప్రధాని షరీఫ్ చెప్పారు. చైనా, అమెరికా, టర్కీ, ఖతార్తో పాటు IMF మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలు వివిధ సందర్భాలలో పాకిస్తాన్కు భారీ ఆర్థిక సహాయం అందించాయి. అయినా కూడా ఆ దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేదు.
WATCH 😂 pic.twitter.com/Lph1XrM1w1
— Times Algebra (@TimesAlgebraIND) June 1, 2025
తాజావార్తలు
-
SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
-
Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
The Paradise : అనిరుధ్ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
-
Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..