India Pakistan: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై దాడి చేసేందుకు భారత్ మాస్టర్ ప్లాన్..
- పాకిస్తాన్పై ఆర్థిక దాడి చేసేందుకు భారత్ ప్లాన్..
- రుణాలు అడ్డుకునేందుకు వరల్డ్ బ్యాంక్ని సంప్రదించనున్న భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ అప్పుల కోసం పలు దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి భిక్షం అడుక్కుంటోంది. రుణాలు, బెయిలౌట్ ప్యాకేజీలపై ఎక్కువగా ఆధారపడుతున్న పాక్ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బ తీసేలా భారత్ ప్లాన్ చేస్తోంది. ప్రపంచ బ్యాంక్, ఉగ్రవాద నిధుల నిఘా సంస్థ అయిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్(FATF)ని భారత్ సంప్రదించనుంది. జూన్లో పాకిస్తాన్కి 20 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ఆమోదించడాన్ని పునఃపరిశీలించాలని భారతదేశం ప్రపంచ బ్యాంకును కోరుతుందని సోర్సెస్ తెలిపాయి.
Read Also: Bandi Sanjay: కవిత రాసిన లేఖ ఒక OTT ఫ్యామిలీ డ్రామా.. టైటిల్ “కాంగ్రెస్ వదిలిన బాణం”
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
పాకిస్తాన్ని తిరిగి గ్రే లిస్ట్ లోకి తీసుకురావడానికి భారతదేశం FATFని సంప్రదిస్తోంది. ఈ సంస్థ పాకిస్తాన్ ఆర్థిక లావాదేవీలపై పరిశీలన పెంచుతుంది, విదేశీ పెట్టుబడులు, మూలధన ప్రవాహాలను పరిమితం చేస్తుంది. జూన్ 2018లో పాకిస్తాన్ను FATF ‘గ్రే లిస్ట్’లో ఉంచారు. అయితే, ప్రభుత్వం ఉగ్రవాద నిధులను అరికట్టడానికి కట్టుబడి ఉండటంతో 2022 అక్టోబర్లో దానిని జాబితా నుండి తొలగించారు. ఉగ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆస్తులను జైలులో పెట్టినట్లు , జప్తు చేసినట్లు పాకిస్తాన్ కూడా పేర్కొంది.
అయితే, పాకిస్తాన్ మాత్రం ఈ నిధులను ఉగ్రవాదానికి వాడుతుందని భారత్ ఆరోపిస్తోంది. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ఐఎంఎఫ్ 1 బిలియన్ డాలర్ల నిధులు ఇవ్వడాన్ని భారత్ అభ్యంతరం తెలిపింది. పాకిస్తాన్ గత రికార్డులను చూసి నిధులను ఇవ్వాలని భారత్ కోరింది. అయినా కూడా ఐఎంఎఫ్ పాకిస్తాన్ని రుణం మంజూరు చేసింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ రుణం ఇవ్వకుండా కట్టడి చేసేందుకు భారత్ ప్రయత్ని్స్తోంది.
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!