India Pakistan: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై దాడి చేసేందుకు భారత్ మాస్టర్ ప్లాన్..
- పాకిస్తాన్పై ఆర్థిక దాడి చేసేందుకు భారత్ ప్లాన్..
- రుణాలు అడ్డుకునేందుకు వరల్డ్ బ్యాంక్ని సంప్రదించనున్న భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ అప్పుల కోసం పలు దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి భిక్షం అడుక్కుంటోంది. రుణాలు, బెయిలౌట్ ప్యాకేజీలపై ఎక్కువగా ఆధారపడుతున్న పాక్ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బ తీసేలా భారత్ ప్లాన్ చేస్తోంది. ప్రపంచ బ్యాంక్, ఉగ్రవాద నిధుల నిఘా సంస్థ అయిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్(FATF)ని భారత్ సంప్రదించనుంది. జూన్లో పాకిస్తాన్కి 20 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ఆమోదించడాన్ని పునఃపరిశీలించాలని భారతదేశం ప్రపంచ బ్యాంకును కోరుతుందని సోర్సెస్ తెలిపాయి.
Read Also: Bandi Sanjay: కవిత రాసిన లేఖ ఒక OTT ఫ్యామిలీ డ్రామా.. టైటిల్ “కాంగ్రెస్ వదిలిన బాణం”
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
పాకిస్తాన్ని తిరిగి గ్రే లిస్ట్ లోకి తీసుకురావడానికి భారతదేశం FATFని సంప్రదిస్తోంది. ఈ సంస్థ పాకిస్తాన్ ఆర్థిక లావాదేవీలపై పరిశీలన పెంచుతుంది, విదేశీ పెట్టుబడులు, మూలధన ప్రవాహాలను పరిమితం చేస్తుంది. జూన్ 2018లో పాకిస్తాన్ను FATF ‘గ్రే లిస్ట్’లో ఉంచారు. అయితే, ప్రభుత్వం ఉగ్రవాద నిధులను అరికట్టడానికి కట్టుబడి ఉండటంతో 2022 అక్టోబర్లో దానిని జాబితా నుండి తొలగించారు. ఉగ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆస్తులను జైలులో పెట్టినట్లు , జప్తు చేసినట్లు పాకిస్తాన్ కూడా పేర్కొంది.
అయితే, పాకిస్తాన్ మాత్రం ఈ నిధులను ఉగ్రవాదానికి వాడుతుందని భారత్ ఆరోపిస్తోంది. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ఐఎంఎఫ్ 1 బిలియన్ డాలర్ల నిధులు ఇవ్వడాన్ని భారత్ అభ్యంతరం తెలిపింది. పాకిస్తాన్ గత రికార్డులను చూసి నిధులను ఇవ్వాలని భారత్ కోరింది. అయినా కూడా ఐఎంఎఫ్ పాకిస్తాన్ని రుణం మంజూరు చేసింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ రుణం ఇవ్వకుండా కట్టడి చేసేందుకు భారత్ ప్రయత్ని్స్తోంది.
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?