Pakistan: పాకిస్తాన్ను కుదిపేస్తున్న కొత్త సంక్షోభం..
- పాకిస్తాన్లో కొత్త సంక్షోభం..
- తిండి, విద్యుత్కే ఎక్కువ ఖర్చు చేస్తున్న పాక్ ప్రజలు..
- విద్య, ఆరోగ్యంపై అంతంతమాత్రమే ఖర్చు..
- సరిపోని ఆదాయంతో సతమతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయితే, ఇప్పుడు ఆర్థిక సంక్షోభానికి అనుగుణంగా పాక్ ప్రజలు మరో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. పాక్ కుటుంబాలు తమ ఆదాయంలో మూడింట రెండు వంతుల్ని ఆహారం, విద్యుత్ వంటి వాటికే చెల్లించాల్సి వస్తోంది. దీని కారణంగా విద్య, ఆరోగ్యం, దీర్ఘకాలిక అవసరాలకు ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడిందని కొత్త ప్రభుత్వ సర్వే తెలియజేస్తోంది.
Read Also: Nandyal: చాగలమర్రి మండలం మద్దూరులోని.. వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీలో వీడిన మిస్టరీ..
Also Read
- Indonesia Earthquake: ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
- August 15 Independence Day: భారత్తో పాటు, ఆగస్టు 15న ఈ నాలుగు దేశాలకు స్వాతంత్య్రం..
- Modi-Rahman: బ్రిక్స్కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
హౌస్హోల్డ్ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ సర్వే 2024–25 ప్రకారం.. ద్రవ్యోల్బణం, ఆర్థిక నిర్వహణ లోపాలు గృహ ప్రాధాన్యతల్ని తగ్గిస్తున్నాయి. స్థిరమైన ధరల ఒత్తిళ్లు, విద్యుత్, గ్యాస్ ఛార్జీల పెరుగుదల, జీవన వ్యయం భారీగా పెరగడం మొత్తంగా పాక్ ప్రజల్ని జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆదాయం పెరిగినప్పటికీ, ఆదాయాన్ని మించిన వేగంతో ఖర్చులు కూడా పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది.
ఆదాయంలో 63 శాతం కేవలం రెండు అవసరాలకు మాత్రమే అక్కడి ప్రజలు వినియోగిస్తున్నారు. 37 శాతాన్ని ఆహారం, 26 శాతాన్ని విద్యుత్ , గ్యాస్లకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యపై 2.5 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. విద్యా, ఆరోగ్యం, వినోదంపై అంతా కలిపి 7 శాతం వద్దనే నిలిచిపోయింది. ఇది మానవ అభివృద్ధిపై తీవ్రమైన ఆందోళనను లేవనెత్తుతోంది. గత 6 ఏళ్లలో పాకిస్తాన్లో నెలవారీ జీతాలు సగటున 41,500 పాక్ రూపాయల నుంచి 82,000 వరకు పెరిగినప్పటికీ, ఖర్చులు ఏకంగా 19 శాతానికి పెరిగాయి. ఇది ప్రజల కొనుగోలు శక్తిని క్షీణించేలా చేసింది. వీటన్నింటికి తోడు మధ్య, ఆధాయ అసమానతలు కూడా తీవ్రంగా పెరిగాయి. ధనవంతులు, అత్యంత పేదల కన్నా మూడు రెట్లుకు పైగా ఎక్కువ సంపాదిస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: ఎర్రకోట వేదికగా యూత్కు ప్రధాని మోడీ గుడ్న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
-
Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
-
PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. ‘అర్బన్ నక్సల్స్’ను సమాజం దూరం పెట్టాలి..
-
Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
-
IND vs SL: మరోమారు సర్ఫరాజ్ ఖాన్కు మొండిచేయి.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..!
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!