భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగినవి పద్మ అవార్డులు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్ర విజ్ఞానం, వాణిజ్యం, విద్య, వైద్యం, సాహిత్యం , క్రీడలు వంటి వివిధ రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తుంది. 1954లో ప్రారంభమైన ఈ పురస్కారాలు, దేశాభివృద్ధిలో భాగస్వాములైన నిస్వార్థ వ్యక్తులకు గుర్తింపునిస్తాయి. Pakistan T20 World Cup: దాయాదుల మధ్య పోరుకు ఈ…
Padma Awards 2026: భారతదేశంలో అత్యున్నత పౌర గౌరవాలుగా గుర్తింపు పొందిన పద్మ అవార్డులు (Padma Awards) 2026 సంవత్సరానికి గానూ కేంద్రం ప్రకటించింది. కళలు, క్రీడలు, సాహిత్యం, విద్య, వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజిక సేవ, ప్రజాపాలన వంటి అనేక రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేయబడతాయి. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతల జాబితాను ప్రకటిస్తారు. అనంతరం అవార్డ్స్ ను రాష్ట్రపతి…
తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా, మాజీ బీజేపీ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన శ్రీ కోట శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన మరణం తెలుగు సినీ రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన పార్థివ దేహం ఫిల్మ్నగర్ నుంచి జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానం వరకు అంతిమ యాత్రగా కొనసాగింది. ఈ యాత్రలో వందలాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ…
తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు (83) అంత్యక్రియలు ఆదివారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జులై 13 తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం తెలుగు సినీ రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కోట శ్రీనివాసరావు పార్థివ దేహం ఫిల్మ్నగర్లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్రగా కొనసాగింది. ఈ యాత్రలో వందలాది…
Chandrababu : సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కోట మృతదేహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కోట శ్రీనివాస్ మరణం చాలా బాధాకరం. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరు. ఇండస్ట్రీకి నటన అంటే ఏంటో చూపించారు. 40 సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు కోట శ్రీనివాస్. నేను సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన…
Kota Srinivasa Rao : సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారు జామున మృతి చెందారు. దీంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. నలభై ఏళ్లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన కోట.. కామెడీ విలనిజానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. సెంటిమెంటల్, యాక్షన్, కామెడీ, విలనిజం.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయి నటించడం ఆయన స్పెషాలిటీ. దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు.. అంతకు ముందు బ్యాంక్…
Padma Shri Garikapati Narasimha Rao: మహా సహస్రావధాని, ఆధ్యాత్మిక వేత్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా.. ఆయన అవధానాలు వినే ఉంటారు. వ్యక్తిత్వ వికాసంపై ఆయన ఇచ్చే సందేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా యువత గరికపాటి సందేశాలను బాగా ఇష్టపడతారు. ప్రస్తుత సమాజానికి తగ్గట్టు మాట్లాడటం, ఏదేని విషయాన్ని కుండ బద్ధుల గొట్టినట్లు వివరించడం యువతను కట్టి పడేస్తుంది.
Subbanna Ayyappan: ప్రముఖ వ్యవసాయ జలవనరుల శాస్త్రవేత్త, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ మృతదేహం కర్ణాటకలోని శ్రీరంగపట్న సమీపంలోని కావేరీ నదిలో లభ్యమైంది. ఈ విషాదకర సంఘటన తాజాగా వెలుగుచూసింది. పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. స్థానికులు నదిలో తేలియాడుతున్న శరీరాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించగా, అధికారులు దానిని వెలికితీసారు. మృతుడి ద్విచక్రవాహనం కావేరీ నది తీరాన నిలబెట్టిన స్థితిలో కనిపించడంతో..…
Baba Shivanand Saraswati: ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద సరస్వతి (128) ఆదివారం వారణాసిలో కన్నుమూశారు. ఈయమ మూర్తికి సంతాపంగా అనేకమంది సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేస్తూ.. స్వామి శివానంద జీవితం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని అభివర్ణించారు. తన అధికారిక ‘X’ హ్యాండిల్లో పోస్ట్ చేసిన పోస్ట్లో ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేస్తూ.. యోగా సాధకుడు, కాశీ…
Prakash Reddy: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా పద్మ అవార్డులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయని ఆయన ఆరోపించారు. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పూర్తిగా పారదర్శకంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. పద్మ అవార్డుల ప్రకటన ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని ప్రకాష్ రెడ్డి తప్పుపట్టారు. ముఖ్యమంత్రి పద్మ అవార్డులకు…