అతి సర్వత్రా… అన్నది ఆ ఎమ్మెల్సీ విషయంలో ప్రాక్టికల్గా నిరూపితం అవుతోందా? ఓ పద్ధతి ప్రకారం ఉచ్చు బిగించడానికి రంగం సిద్ధం అవుతోందా? తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, పవర్ పోయాక మరో రూపంలో దూకుడు ప్రదర్శించి జనం నోళ్ళలో విపరీతంగా నానుతున్న ఆ లీడర్కు ఇప్పుడు సొంత పార్టీవాళ్ళే సపోర్ట్ చేసే పరిస్థితి లేదా? ఎవరా ఎమ్మెల్సీ? ఏంటాయన జిల్ జిల్ కీ కహానీ? సిక్కోలు పాలిటిక్స్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ది డిఫరెంట్ స్టైల్.…
అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి డ్రైవర్ లేని కారులా మారిందట. కేడర్ ఇప్పటికీ బలంగా ఉంది. ఏ ఎన్నికైనా సై అంటోంది. కానీ… నడిపే నాయకుడు లేక దిక్కులు చూస్తోందట. సరైనోడు ఒక్కడు తగిలితే చాలు… మా సత్తా ఏంటో చూపిస్తామంటూ సైసై అంటున్నా అధిష్టానం మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదట. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీకి నాయకత్వ దిక్కులేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్లీజ్… ప్లీజ్.. మాకో లీడర్….. అంటోంది హుజూర్నగర్…
తెలంగాణలో అమృత్ టెండర్స్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్నాయి బీఆర్ఎస్, బీజేపీ. ముఖ్యమంత్రి తనకు కావాల్సిన వాళ్ళకే కాంట్రాక్టులు కట్టబెట్టారన్నది విపక్షాల ప్రధాన అభియోగం. ఈ క్రమంలోనే.. తానము ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేస్తానంటూ విమానం ఎక్కారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. దాంతో ఢిల్లీలో ఏదో జరగబోతోందంటూ ఓ రేంజ్లో హైప్ వచ్చింది.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ చేతులెత్తేసినట్టేనా? ప్రభుత్వ అణచివేత అన్నది కేవలం సాకు మాత్రమేనా? అసలు సంగతి వేరే ఉందా? వామపక్షాల అభ్యర్థులు సైతం బరిలో ఉన్నా… అంతకు మించి వందల రెట్ల బలం ఉన్న వైసీపీ ఎందుకు తప్పుకుంటున్నట్టు ప్రకటించింది? ఏ విషయంలో గోదావరి జిల్లాల వైసీపీ లీడర్స్ భయపడ్డారు? ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధుల్ని నిలపకూడదని నిర్ణయించింది వైసీపీ. అందుకు…
ఫార్మా సిటీ కేంద్రంగా తెలంగాణలో పొలిటికల్ సెగలు పెరుగుతున్నాయా? రాజకీయంగా వాడుకునేందుకు గులాబీ స్కెచ్ రెడీ అయిందా? ఆ పార్టీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? అరెస్ట్ల వెనకున్న మైలేజ్ లెక్కలేంటి? పార్టీ పెద్దల మధ్య జరుగుతున్న చర్చ ఏంటి? ఒకదాని వెంట ఒకటిగా వివిధ అంశాలను ఎత్తుకుని కాంగ్రెస్ సర్కార్ని ఇరుకున పెడదామనుకుంటున్న బీఆర్ఎస్ని అదే స్థాయిలో అరెస్ట్ల భయం కూడా వెంటాడుతోందట. తాజాగా వికారాబాద్ కలెక్టర్ మీద దాడి కేసులో ఇరుక్కున్నారు ఆ పార్టీ…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి 11 నెలలవుతోంది. ఈ టైంలో రాష్ట్రం కోసం చాలా చేసినా... దాన్ని జనానికి సరిగా చెప్పుకోలేకపోతున్నామన్న అసంతృప్తి, అసహనం పెరుగుతున్నాయట ప్రభుత్వ పెద్దల్లో. దీంతో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపం ఉందా..? ప్రతిపక్ష పార్టీలు ముప్పేట దాడి చేస్తున్నా.. అధికార పక్ష నాయకులు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు?
పంచకర్ల రమేష్ బాబు...! గండి బాబ్జీ...! కూటమి పార్టీల్లో సీనియర్ నేతలు...కేరాఫ్ పెందుర్తి. ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే మరొకరు మాజీ శాసనసభ్యుడు. ఎన్నికల సమయంలో కలిసి వుంటే కలదు సుఖం అని డ్యూయెట్లు పాడుకున్న ఈ నేతల మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ జరుగుతోందని జనసేన, టీడీపీ కేడరే తెగ చెవులు కొరికేసుకుంటోంది.
మాజీ ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు వైసీపీకి గుడ్బై చెప్పబోతున్నారన్న వార్త ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపుతోంది. కేవలం పార్టీ మారడంతోనే సరిపెట్టకుండా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.
మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు అభివృద్ధి వైపు దృష్టి పెడుతుండగా... అనుచరగణం మాత్రం చెలరేగుతోందని, కొంతమంది వ్యవహార శైలి వల్ల జనంలో నెగెటివ్ రిమార్క్స్ పడుతున్నాయని అంటున్నారు. ఇటీవల చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్... తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఓనేతను దూరం పెట్టినట్టు సమాచారం
గెలిచాక ఎమ్మెల్యే ఇంటూరి ఓ గ్రూపును దూరం పెడుతున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తుందట నియోజకవర్గంలో. సొంత పార్టీ క్యాడర్ను పక్కన పెట్టి తన మనుషుల్ని మండలానికో ఇంచార్జ్గా నియమించుకున్నారట. అక్కడ ఎంతటి నాయకులైనా వారు చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనట. ఇంటూరి పెట్టిన మనుషులకు తెలియకుండా... చీమ చిటుక్కుమనడానికి వీల్లేదన్నది లోకల్ టాక్. అదే సమయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరారవును టార్గెట్ చేస్తూ కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో సొంత పార్టీ కార్యకర్తలే పోస్టింగులు పెట్టడం నియోజకవర్గంలో చర్చనీయంశమైంది.