Off The Record: జగన్ విషయంలో సైలెంట్ ఎందుకు..?
- ప్రధాని ముందే గత ప్రభుత్వ తీరును ఎండగట్టిన బాబు, పవన్, లోకేష్
- అమరావతి టూర్లో జగన్ను పల్లెత్తు మాట అనని ప్రధాని
- జగన్ పేరు కూడా ప్రస్తావించకపోవడంపై చర్చ
- నాలుగు రోజులు గడిచినా ట్రెండింగ్లోనే ప్రధాని ప్రసంగం
- టీడీపీ లీడర్స్ కుతకుతలాడుతున్నారా?
- సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చలు
- ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఎన్డీయేతర పక్షాల్ని టార్గెట్ చేసే ప్రధాని
- జగన్ విషయంలో ఎందుకు సైసెంట్గా ఉన్నారన్న చర్చ
- వైసీపీతో పాత బంధాన్ని వదులుకోలేదా అన్న టాక్
- వక్ఫ్ చట్టం విషయంలో వైసీపీ అంతలా విభేదించలేదన్న అభిప్రాయం
- జగన్ను బీజేపీ మిత్రుడిగానే భావిస్తోందా?
- అంత విలువ ఇవ్వాలనుకోలేదు కాబట్టే ఆ పేరెత్తలేదా?
- జోరుగా సోషల్ మీడియా యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఏపీలో బీజేపీ అధికార, ప్రతిపక్ష పార్టీలు రెంటినీ రెండు కళ్ళతో కనిపెట్టి ఉంటోందా? అమరావతి రీ లాంఛ్ ప్రోగ్రామ్లో ప్రధాని మోడీ విపక్ష నేత జగన్ని పల్లెత్తు మాట అనకపోవడానికి కారణం ఏంటి? సాధారణంగా ఎక్కడ మీటింగ్ జరిగినా… ఎన్డీయేతర పార్టీల మీద విరుచుకుపడే ప్రధాని ఏపీ మాత్రం… విమర్శల సంగతి తర్వాత కనీసం ప్రతిపక్ష నేత పేరు కూడా ఎందుకు ఎత్తలేదు? ఆ విషయమై రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంటి?..
Read Also: Glowing Skin: ఈ చిన్న పని చేయండి.. ముఖంపై ఉండే మొటిమలను తగ్గించుకోండి!
Also Read
అట్టహాసంగా జరిగిన అమరావతి రీ లాంఛ్ ప్రోగ్రామ్కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే… ఇప్పటివరకు ఇచ్చిన, ఇస్తున్న నిధులు కాకుండా ప్రధాని నోటి నుంచి ప్రత్యేక నిధుల ప్రస్తావన వస్తుందని రాష్ట్రం వైపు నుంచి ఆశించినా… అ మాట మాత్రం చెప్పలేదాయన. అది వేరే సంగతి. ఆ సందర్భంగా జరిగిన సభలో ప్రధాని ప్రసంగం తీరుపై రకరకాల విశ్లేషణలు పెరుగుతున్నాయి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. సిఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ అదే వేదిక మీది నుంచి గత ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వైసీపీ సర్కార్ రాజధానిని ధ్వంసం చేసిందంటూ ప్రధాని మోదీ ముందే మాట్లాడారు. గత ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదన కూడా మోదీకి తెలుసు కాబట్టి దాన్ని, దీన్ని పోల్చుకుంటూ విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. సాధారణంగా… ఇలాంటి టూర్స్కి వెళ్ళినప్పుడు అక్కడి ఎన్డీయే యేతర పార్టీలను టార్గెట్ చేస్తుంటారు ప్రధాని. కానీ, అమరావతికి వచ్చేసరికి ఇక్కడ ఆ పొజిషన్లో ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ను పల్లెత్తు మాట అనలేదాయన. విమర్శల సంగతి తర్వాత.. కనీసం ఆ పేరు కూడా ఎత్తకపోవడంపైనే చర్చ జరుగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో.
Read Also: Off The Record: మాజీ మంత్రి అనిత్ కుమార్ యాదవ్ వంతు వచ్చిందా..?
అయితే, రీ స్టార్ట్ మీటింగ్ జరిగి నాలుగు రోజులు గడిచినా.. ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు ఇదే ట్రెండింగ్ సబ్జెక్ట్గా ఉండటాన్ని బట్టే ఈ విషయంలో ఏ స్థాయి చర్చ జరుగుతోందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు. ఇంకా చెప్పాలంటే… ప్రధాని జగన్ను ఏమీ అనకపోవడంపై టీడీపీ లీడర్స్ కొందరు కుతకుతలాడిపోతున్నారట. అమరావతి రీ స్టార్ట్ కార్యక్రమానికి జగన్ను ఆహ్వానించినా.. ఆయన రాలేదన్నది టీడీపీ వాదన అయితే… అందుకు మా కారణాలు మాకున్నాయి టైం వచ్చినప్పుడు చెబుతామంటున్నారు వైసీపీ లీడర్స్. అయితే… ముఖ్య నాయకులంతా… అమరావతిలో గత ప్రభుత్వ విధ్వంసం, వందల కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేశారన్న అర్ధం వచ్చేలా మాట్లాడినా…. ప్రధాని నోటి వెంట ఒక్క ముక్క కూడా రాకపోవడం ఏంటి? దాని వెనకున్న సంగతేంటంటూ సోషల్ మీడియా పోస్ట్లు కూడా తెగ పెరిగిపోతున్నాయట. బీహార్, తమిళనాడు, తెలంగాణ, కేరళ… ఇలా ఎక్కడ.. ఏ పర్యటకు వెళ్లినా.. ప్రతిచోట తమ ప్రత్యర్థి పార్టీల నేతలను ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడే మోదీ జగన్ విషయంలో ఎందుకు సైలెంట్గా ఉన్నారన్నది ఆసక్తికరమైన అంశమేనని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. నేరుగా ఎన్డీఏ కూటమిలో చేరకున్నా… 2019లో అధికారంలోకి వచ్చాక జగన్ ప్రధానికి బాగా దగ్గరయ్యారన్న ప్రచారం ఉంది.
Read Also: YS Jagan: రేపు పార్లమెంటరీ పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ..
కాగా, ఆ ఐదేళ్ళు బీజేపీకి రాజకీయంగా అవసరమైన ప్రతి సందర్భంలోనూ గట్టిగానే సపోర్ట్ చేసింది వైసీపీ. ఇక ఎన్నికలకు ముందు కుదిరిన పొత్తుతో ఇటు కూటమిలో టీడీపీతో భాగస్వామ్యం కలిశాక పరిస్థితిలో మార్పు వస్తుందని భావించారట ఎక్కువ మంది. కానీ… అమరావతిలో ప్రధాని ప్రసంగం చూస్తే మాత్రం… పాత బంధాన్ని పెద్దగా వదులుకున్నట్టు కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు. ఇందుకు తాజా ఉదాహరణను కూడా చెబుతున్నారు. వక్ఫ్ చట్టం విషయంలో వైసీపీ ఏదో… పైకి మాట్లాడినా, బీజేపీని అంత తీవ్రంగా విభేదించింది లేదని, పాత బంధం కొనసాగుతోందనడానికి అది కూడా ఒక ఎగ్జాంపుల్ అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా… జగన్ ను ఇప్పటికీ తమ మిత్రుడిగానే భావిస్తున్నారు కాబట్టే మోదీ ఆయన్ని విమర్శించకుండా తన ప్రసంగాన్ని ముగించి వెళ్లిపోయారన్నది కొందరి వాదన. మరి కొందరైతే… జగన్కు అంత విలువ ఇవ్వాలనుకోలేదు కాబట్టే… ఉద్దేశ్యపూర్వకంగా ఆయన్ని వదిలేసి ఉండవచ్చంటూ విశ్లేషిస్తున్నారు. ఆ మీటింగ్ జరిగిన మరుక్షణం నుంచి ఇలా రకరకాల వాదనలు తెర మీదికి వస్తూ…. ఎవరికి తోచింది వాళ్ళు సోషల్ మీడియా పోస్టింగ్స్తో హోరెత్తిస్తున్నారు. ఇటు టీడీపీలో మాత్రం ఈ విషయమై అంతర్గత చర్చ గట్టిగానే జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక.
తాజావార్తలు
-
Homemade Collagen Drink: యవ్వనమైన చర్మానికి సహజ రహస్యం.. ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ నేచురల్ డ్రింక్!
-
ENG W vs SL W: శతకంతో ‘డ్యానీ వ్యాట్’ వీరవిహారం.. మహిళల టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ బోణి.!
-
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో కలకలం.. 22 మంది అధికారుల సస్పెన్షన్
-
Astrology: జూన్ 13 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!