Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Why Modi Silent On Jagans Destruction Of Amaravati

Off The Record: జగన్ విషయంలో సైలెంట్ ఎందుకు..?

Published Date :May 6, 2025 , 9:32 pm
By Chandra Shekhar Pamena
  • ప్రధాని ముందే గత ప్రభుత్వ తీరును ఎండగట్టిన బాబు, పవన్‌, లోకేష్‌
  • అమరావతి టూర్‌లో జగన్‌ను పల్లెత్తు మాట అనని ప్రధాని
  • జగన్‌ పేరు కూడా ప్రస్తావించకపోవడంపై చర్చ
  • నాలుగు రోజులు గడిచినా ట్రెండింగ్‌లోనే ప్రధాని ప్రసంగం
  • టీడీపీ లీడర్స్‌ కుతకుతలాడుతున్నారా?
  • సోషల్ మీడియాలో హాట్‌ హాట్‌ చర్చలు
  • ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఎన్డీయేతర పక్షాల్ని టార్గెట్‌ చేసే ప్రధాని
  • జగన్‌ విషయంలో ఎందుకు సైసెంట్‌గా ఉన్నారన్న చర్చ
  • వైసీపీతో పాత బంధాన్ని వదులుకోలేదా అన్న టాక్‌
  • వక్ఫ్‌ చట్టం విషయంలో వైసీపీ అంతలా విభేదించలేదన్న అభిప్రాయం
  • జగన్‌ను బీజేపీ మిత్రుడిగానే భావిస్తోందా?
  • అంత విలువ ఇవ్వాలనుకోలేదు కాబట్టే ఆ పేరెత్తలేదా?
  • జోరుగా సోషల్‌ మీడియా యుద్ధం
Off The Record: జగన్ విషయంలో సైలెంట్ ఎందుకు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: ఏపీలో బీజేపీ అధికార, ప్రతిపక్ష పార్టీలు రెంటినీ రెండు కళ్ళతో కనిపెట్టి ఉంటోందా? అమరావతి రీ లాంఛ్‌ ప్రోగ్రామ్‌లో ప్రధాని మోడీ విపక్ష నేత జగన్‌ని పల్లెత్తు మాట అనకపోవడానికి కారణం ఏంటి? సాధారణంగా ఎక్కడ మీటింగ్‌ జరిగినా… ఎన్డీయేతర పార్టీల మీద విరుచుకుపడే ప్రధాని ఏపీ మాత్రం… విమర్శల సంగతి తర్వాత కనీసం ప్రతిపక్ష నేత పేరు కూడా ఎందుకు ఎత్తలేదు? ఆ విషయమై రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంటి?..

Read Also: Glowing Skin: ఈ చిన్న పని చేయండి.. ముఖంపై ఉండే మొటిమలను తగ్గించుకోండి!

Also Read

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
  • Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
  • Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
  • Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?

అట్టహాసంగా జరిగిన అమరావతి రీ లాంఛ్‌ ప్రోగ్రామ్‌కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే… ఇప్పటివరకు ఇచ్చిన, ఇస్తున్న నిధులు కాకుండా ప్రధాని నోటి నుంచి ప్రత్యేక నిధుల ప్రస్తావన వస్తుందని రాష్ట్రం వైపు నుంచి ఆశించినా… అ మాట మాత్రం చెప్పలేదాయన. అది వేరే సంగతి. ఆ సందర్భంగా జరిగిన సభలో ప్రధాని ప్రసంగం తీరుపై రకరకాల విశ్లేషణలు పెరుగుతున్నాయి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. సిఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌ అదే వేదిక మీది నుంచి గత ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వైసీపీ సర్కార్‌ రాజధానిని ధ్వంసం చేసిందంటూ ప్రధాని మోదీ ముందే మాట్లాడారు. గత ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదన కూడా మోదీకి తెలుసు కాబట్టి దాన్ని, దీన్ని పోల్చుకుంటూ విశ్లేషిస్తున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. సాధారణంగా… ఇలాంటి టూర్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడి ఎన్డీయే యేతర పార్టీలను టార్గెట్‌ చేస్తుంటారు ప్రధాని. కానీ, అమరావతికి వచ్చేసరికి ఇక్కడ ఆ పొజిషన్‌లో ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను పల్లెత్తు మాట అనలేదాయన. విమర్శల సంగతి తర్వాత.. కనీసం ఆ పేరు కూడా ఎత్తకపోవడంపైనే చర్చ జరుగుతోంది ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో.

Read Also: Off The Record: మాజీ మంత్రి అనిత్ కుమార్ యాదవ్ వంతు వచ్చిందా..?

అయితే, రీ స్టార్ట్ మీటింగ్ జరిగి నాలుగు రోజులు గడిచినా.. ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఇదే ట్రెండింగ్ సబ్జెక్ట్‌గా ఉండటాన్ని బట్టే ఈ విషయంలో ఏ స్థాయి చర్చ జరుగుతోందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు. ఇంకా చెప్పాలంటే… ప్రధాని జగన్‌ను ఏమీ అనకపోవడంపై టీడీపీ లీడర్స్‌ కొందరు కుతకుతలాడిపోతున్నారట. అమరావతి రీ స్టార్ట్ కార్యక్రమానికి జగన్‌ను ఆహ్వానించినా.. ఆయన రాలేదన్నది టీడీపీ వాదన అయితే… అందుకు మా కారణాలు మాకున్నాయి టైం వచ్చినప్పుడు చెబుతామంటున్నారు వైసీపీ లీడర్స్‌. అయితే… ముఖ్య నాయకులంతా… అమరావతిలో గత ప్రభుత్వ విధ్వంసం, వందల కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేశారన్న అర్ధం వచ్చేలా మాట్లాడినా…. ప్రధాని నోటి వెంట ఒక్క ముక్క కూడా రాకపోవడం ఏంటి? దాని వెనకున్న సంగతేంటంటూ సోషల్‌ మీడియా పోస్ట్‌లు కూడా తెగ పెరిగిపోతున్నాయట. బీహార్, తమిళనాడు, తెలంగాణ, కేరళ… ఇలా ఎక్కడ.. ఏ పర్యటకు వెళ్లినా.. ప్రతిచోట తమ ప్రత్యర్థి పార్టీల నేతలను ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడే మోదీ జగన్ విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉన్నారన్నది ఆసక్తికరమైన అంశమేనని అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. నేరుగా ఎన్డీఏ కూటమిలో చేరకున్నా… 2019లో అధికారంలోకి వచ్చాక జగన్ ప్రధానికి బాగా దగ్గరయ్యారన్న ప్రచారం ఉంది.

Read Also: YS Jagan: రేపు పార్లమెంటరీ పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ..

కాగా, ఆ ఐదేళ్ళు బీజేపీకి రాజకీయంగా అవసరమైన ప్రతి సందర్భంలోనూ గట్టిగానే సపోర్ట్‌ చేసింది వైసీపీ. ఇక ఎన్నికలకు ముందు కుదిరిన పొత్తుతో ఇటు కూటమిలో టీడీపీతో భాగస్వామ్యం కలిశాక పరిస్థితిలో మార్పు వస్తుందని భావించారట ఎక్కువ మంది. కానీ… అమరావతిలో ప్రధాని ప్రసంగం చూస్తే మాత్రం… పాత బంధాన్ని పెద్దగా వదులుకున్నట్టు కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు. ఇందుకు తాజా ఉదాహరణను కూడా చెబుతున్నారు. వక్ఫ్ చట్టం విషయంలో వైసీపీ ఏదో… పైకి మాట్లాడినా, బీజేపీని అంత తీవ్రంగా విభేదించింది లేదని, పాత బంధం కొనసాగుతోందనడానికి అది కూడా ఒక ఎగ్జాంపుల్‌ అంటున్నారు. ఇక సోషల్‌ మీడియాలో అయితే మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా… జగన్ ను ఇప్పటికీ తమ మిత్రుడిగానే భావిస్తున్నారు కాబట్టే మోదీ ఆయన్ని విమర్శించకుండా తన ప్రసంగాన్ని ముగించి వెళ్లిపోయారన్నది కొందరి వాదన. మరి కొందరైతే… జగన్‌కు అంత విలువ ఇవ్వాలనుకోలేదు కాబట్టే… ఉద్దేశ్యపూర్వకంగా ఆయన్ని వదిలేసి ఉండవచ్చంటూ విశ్లేషిస్తున్నారు. ఆ మీటింగ్‌ జరిగిన మరుక్షణం నుంచి ఇలా రకరకాల వాదనలు తెర మీదికి వస్తూ…. ఎవరికి తోచింది వాళ్ళు సోషల్‌ మీడియా పోస్టింగ్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇటు టీడీపీలో మాత్రం ఈ విషయమై అంతర్గత చర్చ గట్టిగానే జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati
  • Andhra Pradesh
  • bjp
  • off the record
  • PM Modi

తాజావార్తలు

  • SRH vs KKR: సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా హెడ్ టు హెడ్ రికార్డ్స్.. ఇప్పటివరకు కేకేఆర్‌దే పైచేయి

  • Vijay TVK Plan B: రేపు ఫలితాలు.. విజయ్ ‘ప్లాన్-బి’ రెడీ.. అభ్యర్థులకు దళపతి సీరియస్ వార్నింగ్!

  • NBK112 : CM రేసులో నందమూరి బాలకృష్ణ

  • Census 2026 Scam Alert: జాగ్రత్త! జనాభా లెక్కల పేరుతో మోసం.. ఈ వివరాలను పంచుకోవద్దు.. ఏం చేయాలో తెలుసుకోండి

  • Raashii Khanna: పోలీస్ ఆఫీసర్‌గా రాశీ ఖన్నా.. ‘లుఖ్కే’ వెబ్ సిరీస్ క్రేజీ అప్‌డేట్!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions