Off The Record: పోగొట్టుకున్న చోటే సాధించే పనిలో గులాబీ దళం
- తప్పులు దిద్దుకునే ప్రోగ్రామ్లో గులాబీ అధిష్టానం
- దూరమైన వర్గాలను దరి చేర్చుకునే కార్యక్రమం
- తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల మీదికి మళ్ళిన దృష్టి
- ఉద్యోగులకు సర్కార్ న్యాయం చేయడం లేదంటూ కొత్త స్వరం
- మాజీ ఉద్యోగుల ద్వారా తిరిగి దగ్గరయ్యే ప్లాన్
- ఏడాదిన్నరగా సమయం, సందర్భం కోసం ఎదురు చూపులు
- గతంలో ఎలాంటి మేలు చేశామో చెప్పే ప్రయత్నం
- 73 శాతం ఫిట్మెంట్, హోం గార్డుల జీతాల పెంపు, హెల్త్ కార్డులు
- కాంగ్రెస్ హామీలపై నిలదీసే ప్రయత్నం
- ఉద్యమ సమయంలో కీలకంగా ఉన్నవాళ్ళే వాళ్ళే దూతలా?
- బీఆర్ఎస్కు ఓ సవాల్ ఎదురయ్యే అవకాశం
- డిమాండ్స్ అన్నీ బీఆర్ఎస్ హామీ ఇచ్చి నెరవేర్చనివే
- మళ్ళీ నమ్మి దగ్గరవుతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: బీఆర్ఎస్ పోగొట్టుకున్న చోటే వెదుక్కునే పని మొదలుపెట్టిందా? ఆ దిశగా ఆల్రెడీ స్కెచ్ రెడీ అవుతోందా? క్రమంగా ఒక్కో వర్గంలోకి ఒక్కో రకంగా వెళ్తున్న గులాబీ పార్టీ… తాజాగా అత్యంత కీలకమైన వర్గం మీద కన్నేసిందా? దాదాపుగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకునే ఆ వర్గం గత ఎన్నికల్లో దూరమై గట్టి దెబ్బే కొట్టిందని తెలిసొచ్చిందా? ఇంతకీ… ఏదా వర్గం? ఏ రూపంలో వాళ్ళకి దగ్గరవ్వాలనుకుంటోంది గులాబీ దళం?
Read Also: War-2 : తెలుగు రైట్స్ కు భారీ డిమాండ్.. బడా నిర్మాతల పోటీ..?
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్లో ఏం జరిగింది?
- OTR : Congress లిస్ట్లో ఆ రెండు జిల్లాలదే సస్పెన్స్.. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ రేసు..!
తెలంగాణలో పదేళ్ళు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్… ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చింది. అందుకు కారణాలపై ఇప్పటికే పోస్ట్మార్టం పూర్తి చేసిన గులాబీ అధిష్టానం… జరిగిన తప్పుల్ని సరిదిద్దుకునే కార్యక్రమం మొదలుపెట్టిందట. గత ఎన్నికల్లో ఏయే వర్గాలు తమకు దూరమయ్యాయో విశ్లేషించుకుంటూ…. వాళ్ళని తిరిగి దరి చేర్చుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే… అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే… పార్టీ పెద్దల దృష్టి తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల మీదికి మళ్ళిందట. వివిధ కారణాలతో గత ఎన్నికల్లో ఆ వర్గం తమకు దాదాపుగా దూరమైందని, అందుకే దెబ్బ కూడా గట్టిగా పడిందని భావిస్తున్నట్టు సమాచారం. తిరిగి వాళ్ళకు దగ్గరయ్యే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలతోనే మొదలుపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ న్యాయం చేయడం లేదంటూ… ఈ మధ్య గట్టిగా స్వరం వినిపిస్తున్నారు బీఆర్ఎస్ లీడర్స్.
Read Also: PM Modi: ఇది “యుద్ధాల యుగం” కాదు, అలాగే “ఉగ్రవాద యుగం” కూడా కాదు..
కాగా, ఈ క్రమంలోనే ఆ మధ్య సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. అలాగే మాజీ ప్రభుత్వ ఉద్యోగులను కూడా రంగంలోకి దించబోతోందట. తమ పార్టీకి అనుబంధంగా ఉన్న మాజీ ఉద్యోగులతో భేటీలు వేయించి వాళ్ళ ద్వారా తిరిగి ప్రభుత్వ ఉద్యోగులకు దగ్గరవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. తమ ఓటమికి కారణాల్లో…ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు దూరం కావడం కూడా ఒక కారణమని తెలిసినప్పటికీ… వాళ్ళకు దగ్గరగా వెళ్ళడానికి గడిచిన ఏడాదిన్నర నుంచి సరైన సమయం, సందర్భం దొరకలేదు గులాబీ పార్టీకి. అయితే… ఇప్పుడిప్పుడే ఉద్యోగ సంఘాల స్వరం మారుతున్న సంగతి పసిగట్టిన బీఆర్ఎస్ పెద్దలు చొచ్చుకుపోవడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారట. ఇక ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి గతంలో తాము ఏం చేశామో… మళ్ళీ అధికారంలోకి వస్తే…. ఏం చేస్తామో గట్టిగా చెప్పాలనుకుంటున్నట్టు సమాచారం. ఆ పదేళ్ళలో ఎంప్లాయిస్కు చెడు జరిగిందా లేదా అన్న చర్చను పక్కనపెడితే… చేసిన మంచి పనులపై మాత్రం గట్టిగా ఆ వర్గాలు మరోసారి గట్టిగా మాట్లాడుకునేలా చేయాలన్నది బీఆర్ఎస్ వ్యూహంలో భాగమట. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పీఆర్సీ, డీఏలను ఎలా ఇచ్చామో చెప్పాలనుకుంటున్నారట. అలాగే….. 73శాతం ఫిట్మెంట్, హోంగార్డుల జీతాలు భారీగా పెంచడం, హెల్త్ కార్డులు ఇప్పించడం లాంటివన్నీ తామే చేశామని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తుచేసే కార్యక్రమం మొదలుపెట్టిందట గులాబీ నాయకత్వం. ఉద్యోగులు, ప్రజలు వేరువేరు కాదు అందరం ఒకే కుటుంబం అన్న నినాదంతో దగ్గరయ్యే ప్రయత్నంలో ఉందట.
Read Also: PM Modi: పాక్తో చర్చలు జరిగితే ఇకపై ఉగ్రవాదం.. పీవోకేపైనే
అయితే, కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన వాటినే… తాము అడుగుతున్నామని, వంద రోజుల్లో ఇస్తామని చెప్పిన పీఆర్సీని ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తూ…. ఆ పాయింట్తోనే ఉద్యోగులకు తిరిగి దగ్గరయ్యే కార్యక్రమం మొదలు పెట్టబోతున్నట్టు తెలిసింది. అందుకు వారధులుగా తమ పార్టీలో ఉన్న, అనుబంధంగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగులనే వాడుకోబోతున్నట్టు చెబుతున్నాయి గులాబీ వర్గాలు. వాళ్ళలో కూడా ప్రధానంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా ఉన్న వారినే దూతలుగా పంపబోతున్నట్టు సమాచారం. ఉద్యోగుల కోసం అవసరమైతే ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని ఎంతవరకైనా వెళ్లి కొట్లాడుతామని అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. అయితే… ఇక్కడే అసలు చిక్కు ఉందంటున్నారు కొందరు. ఇప్పుడు ఉద్యోగులు చెబుతున్న సమస్యల్లో చాలా వరకు బీఆర్ఎస్ హయాంలో నెరవేర్చకుండా పెండింగ్లో పెట్టినవేనట. వాటికి సంబంధించి అప్పట్లో హామీలు ఇచ్చారేగానీ…. అమలు చేయకపోవడంవల్లే….. ఆ పార్టీకి దూరమయ్యారు ప్రభుత్వ ఉద్యోగులు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మళ్లీ ఉద్యమం అంటే… నమ్ముతారా? కలిసి వస్తారా? అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.
- Tags
- BRS
- kcr
- ktr
- off the record
- OTR
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?