జీహెచ్ఎంసీ పరిధిలోని తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫోకస్ మారుతోందా? అంటే...వాతావరణం అలాగే కనిపిస్తోందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. పాలిటిక్స్ ఒక ఎత్తయితే... పోలీస్ బాసులు, వాళ్ళ పనుల మీదికి దృష్టి మళ్ళుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. మొన్న ఎమ్మెల్యే,ఇప్పుడు పార్టీ సీనియర్ లీడర్. వరుసగా చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఈ స్టేట్మెంట్స్ని విశ్లేషిస్తుంటే...
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పాలక సంస్థలో వైసీపీ కార్పొరేటర్ల మధ్య వార్ కొత్త టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు అందరూ వైసిపి కార్పొరేటర్లే అయినప్పటికీ ఎన్నికల అనంతర పరిణామాలతో మేయర్ సహా కొందరు కార్పొరేటర్లు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో పసుపు కండువాలు వేసుకున్నారు. తదనంతర పరిణామాలతో వైసీపీ కీలక నేతగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు.
ఆస్తులు కోసం కాదు, ఆత్మగౌరవం కోసమేనంటూ.. మంచు మనోజ్ చేస్తున్న హడావిడి అటు సినీ పరిశ్రమ, ఇటు సొంత జిల్లా చిత్తూరులో హాట్ హాట్గా మారిపోతోంది. మొదట్లో ఇదేదో... వాళ్ళ ఇంటి వ్యవహారం, తండ్రీ కొడుకులు, అన్నదమ్ముల రచ్చేలే అనుకున్నారు అంతా. కానీ... రాను రాను ఇదేదో అతిలా మారుతోందని, ఇరు వర్గాలు తెగేదాకా లాగుతుండటం, రచ్చ చేసుకుంటూ...మీడియా అటెన్షన్ కోసం పాకులాడుతుండటం లాంటివి ఎబ్బెట్టుగా మారుతున్నాయన్న టాక్ మొదలైంది.
శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మీదికి మరో అస్త్రం సంధించారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. వైసీపీలో ఉన్న శిల్పా.. జనసేనలో చేరేందుకు లోలోపల ప్రయత్నాలు చేసుకుంటున్నారంటూ పెద్ద బాంబే పేల్చారు. టీడీపీతోనూ మంతనాలు జరుపుతున్నారని, ఆయన మీద కేసులు పడకుండా కొందరు తెలుగుదేశం నాయకులు రక్షిస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం అయింది
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముక్కు సూటి. మోనార్క్ ఎవరంటే...టక్కును గుర్తొచ్చే పేరు బొల్లా బ్రహ్మనాయుడు. ఆ మాజీ ఎమ్మెల్యేపై వైసీపీ నాయకులు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. వినుకొండ ఎమ్మెల్యేగా పని చేసిన బ్రహ్మనాయుడు...అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీ నాయకులనే కాదు...సొంత పార్టీ నాయకులను ఓ రేంజ్లో ఆడుకున్నారు.
అల్లోల ఇంద్రకరణ్రెడ్డి.. బీఆర్ఎస్ పాలనలో రెండుసార్లు మంత్రిగా పని చేశారు. దేవాదాయ, ఉమ్మడి జిల్లాలోనే ఆయన కీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ పాలనలో ఆయన చెప్పిందే వేదం అన్నట్టు సాగింది. మంత్రి పదవే కాదు...ఏ ఎన్నికలు వచ్చినా...పార్టీ ఏది చెప్పినా ఆయనే ముందు వరుసలో ఉండేవారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత మహేశ్వర్రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పార్టీ మారేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు...ఇంద్రకరణ్ రెడ్డి…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కోనేరు కోనప్ప స్టైలే వేరు. పార్టీ ఏదైనా డోంట్ కేర్... జనంలో పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడమే మన స్టైల్ అన్నట్టుగా ఉంటారట ఆయన. 2004లో మొదటిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారాయన. 2014లో బీఎస్పీ తరపున గెలిచి ఆ తర్వాత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పంచన చేరారు. అదే పార్టీ నుంచి 2018 ఎన్నికల్లో విజయం సాధించారు కోనప్ప.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో హీట్ పుట్టిస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరింది. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి సాధారణ ఎన్నికలను తలపించేలా నడుస్తోంది వ్యవహారం. కూటమి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందట. అలాగే ప్రధాన పోటీదారుగా భావిస్తున్న.. పిడిఎఫ్తోపాటు ఇతర ఉద్యోగ సంఘాలుకూడా తమ అభ్యర్థులను బరిలో నిలిపి.. సవాల్ విసురుతున్నారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు దూకుడుగా వ్యవహరించారని, కొన్ని సందర్భాల్లో తమ విషయంలో పరిధి దాటి కూడా ప్రవర్తించారన్నది టీడీపీ నేతల అభిప్రాయం. కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్ అప్పట్లో మంత్రులుగా పనిచేశారు. వీరిలో కొడాలి, జోగి, వల్లభనేని వంశీ ఇద్దరూ చంద్రబాబు, లోకేష్లపై మాటల దాడి చేస్తే... పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఎక్కువ…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జులు మారుతూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో నాయకులని సమన్వయ పరుస్తూ నడిపించిన థాక్రే ను ఫలితాలు రాగానే పంపించేశారు. అప్పటివరకు తెలంగాణ ఎన్నికల పరిశీలకురాలిగా ఉన్న దీపా దాస్ మున్షీ ఆ తర్వాత ఇన్చార్జిగా అదనపు బాధ్యతలతో నిన్నటి వరకు వ్యవహరించారు. అయితే.. దీపాదాస్కు అధిష్టానం మంచి అవకాశాన్ని ఇచ్చినా... పూర్తి స్థాయిలో పార్టీని, నాయకత్వాన్ని సమన్వయ పరచలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి.