Gautam Gambhir: డారిల్ మిచెల్కు అర్ష్దీప్ సారీ చెప్పనక్కర్లేదు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- డారిల్ మిచెల్, అర్ష్దీప్ సింగ్ మధ్య చిన్నపాటి ఉద్రిక్తత
- మిచెల్ వైపు అర్ష్దీప్ బంతిని విసరడంతో టెన్షన్ వాతావరణం
- మిచెల్కు అర్ష్దీప్ క్షమాపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ మధ్య చోటుచేసుకున్న చిన్నపాటి ఉద్రిక్తత మ్యాచ్ సమయంలో చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా స్ట్రైక్లో ఉన్న మిచెల్ వైపు అర్ష్దీప్ బంతిని విసరడంతో మైదానంలో కాస్త టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనతో రెండు జట్ల ఆటగాళ్ల మధ్య చిన్నపాటి వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. అయితే పరిస్థితిని అంపైర్లు నియంత్రించారు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మిచెల్తో మాట్లాడగా, అర్ష్దీప్తో అంపైర్ చర్చించడంతో పరిస్థితి త్వరగా సాధారణ స్థితికి వచ్చింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత డారిల్ మిచెల్ను అర్ష్దీప్ సింగ్ కలిసి మాట్లాడాడు. ఈ సందర్భంగా మిచెల్కు అర్ష్దీప్ క్షమాపణలు చెప్పడంతో వివాదానికి తెరపడింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ఐసీసీ కూడా ఈ సంఘటనపై చర్యలు తీసుకుంది. అర్ష్దీప్ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. ఈ ఘటనపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అది పెద్ద సమస్య కాదని, మిచెల్కు అర్ష్దీప్ సారీ చెప్పనక్కర్లేదన్నాడు.
Also Read
- Rohit Sharma Future: గిల్ చేతుల్లో రోహిత్ భవితవ్యం.. సెలెక్టర్లు కూడా సైడ్ అవ్వాల్సిందే!
- Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జోరు.. శ్రీశంకర్కు రజతం, దిలీప్ గావిత్కు స్వర్ణం..
- Vaibhav Sooryavanshi: అప్పుడే వైభవ్ సూర్యవంశీకి ప్రమోషన్.. వైస్ కెప్టెన్గా ఎంపిక..
- Mohammed Shami: రంజీల్లో రికార్డులు కొట్టినా లభించని చోటు.. షమీకి భారీ ఎదురుదెబ్బ..
ఓ జాతీయ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ‘అది పెద్ద సమస్య కాదు. దేశం తరఫున ఆడేటప్పుడు ఆటగాళ్లలో దూకుడు ఉండాలి. ఒక బౌలర్ వరుసగా రెండు సిక్స్లు ఇవ్వాలని అనుకోడు. ఆ పరిస్థితిలో అర్ష్దీప్ బంతిని విసరడం సహజమే. నా ఆటగాళ్ల నుంచి కూడా నేను ఇలాంటిదే ఆశిస్తాను. అందులో తప్పు ఏమీలేదు. మైదానంలోకి దిగిన తర్వాత ఎవరూ స్నేహితులు కాదు, శత్రువులు కూడా కాదు. దేశం కోసం ఆడేటప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. కానీ సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని పెద్ద వివాదంగా చూపిస్తున్నారు. అది అవసరం లేదు’ అని స్పష్టం చేశాడు.
తాజావార్తలు
-
MLA Jagan: ‘బెంగళూరును ఏలుతున్నాం’ వ్యాఖ్యలపై దుమారం.. ఎమ్మెల్యే జగన్పై కన్నడ సంఘాల ఆగ్రహం
-
Sai Pallavi: సహజ నటన, అభినయం.. సీతమ్మ పాత్రలో ఒదిగిపోయిన సాయిపల్లవి!
-
Colorful RimBook L1 Plus: AMD రైజెన్ 7 7735HS ప్రాసెసర్తో.. కలర్ ఫుల్ రిమ్బుక్ L1 ప్లస్ ల్యాప్టాప్ విడుదల
-
Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
-
AP Building Rules: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. బిల్డింగ్ రూల్స్లో భారీ మార్పులు.. అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!