వచ్చే ఎన్నికల నాటికి వారసుడిని బరిలో దించాలన్నది ఆ ఎంపీ ఆలోచన. ఇందుకోసం ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. విషయం తెలుసుకున్న అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే బుసలు కొడుతున్నారట. ఇది కాస్తా గుప్పుమనడంతో రెండువర్గాల మధ్య వార్ ఓ రేంజ్లోకి చేరుకుంది. ఆ రగడేంటో ఈ స్టోరీలో చూద్దాం. తనయుడి కోసం ఎంపీ మాగుంట కొత్త ఎత్తుగడ! రాజకీయాల్లో తండ్రి కీలక స్థానంలో ఉంటే.. తనయులు ఆయన్ని అనుసరించడం కామన్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేలా పాలిటిక్స్లో…
పేకాట పేకాటే.. అనుచరులు అనుచరులే. ఇదే ఇప్పుడు గుంటూరు జిల్లా వైసీపీ, పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్. ఇటీవల జరిగిన ఓ ఘటన ఏకంగా ఖాకీలకు చుక్కలు చూపించిందట. నేతల ఒత్తిళ్లు తట్టుకోలేని పోలీసులు పేకాట ఆడుతూ దొరికిన వాళ్లను వేరే జిల్లాలో వదిలేయాల్సి వచ్చింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. రూటు మార్చిన పేకాట మాఫియా! గుంటూరు జిల్లా పేకాటకు హబ్గా మారింది. జిల్లాలో కొంతమంది అధికారపార్టీకి చెందిన నేతలు పేకాట ఆడిస్తున్నారని ఓపెన్గానే చెబుతున్నారు.…
ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోయినా.. ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుందని ఇన్నాళ్లూ ఆశించారు. చివరకు ఆ ముచ్చట కూడా అయిపోయింది. రాష్ట్రస్థాయి పదవి కాదు కదా.. కనీసం జిల్లా స్థాయి పోస్టుల్లోనూ వారికి చోటు దక్కలేదు. ఏదో ఆశిస్తే.. ఇంకేదో అయిందని వాపోతున్నారట సీనియర్లు. మెడలో కండువా ఉన్నా.. చేతిలో పదవి లేక తెగ మథన పడుతున్నారట. ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం. పార్టీ పెద్దల దృష్టిలో ఉన్నారా .. లేరా? వైసీపీ ఆవిర్భావం…
ఎన్నికల్లో గెలిస్తే ఆ లెక్క వేరు. గెలిపించే సత్తా ఉంటే ట్రీట్మెంట్ ఇంకోలా ఉంటుంది. ఆ నాయకుడు ఈ రెండు కేటగిరీల్లోకి రాలేదో ఏమో.. ఆటలో బొప్పాయిలా మారిపోయానని ఆవేదన చెందుతున్నారట. పదవులు లభించినవారు వచ్చి కలుస్తుంటే… అభినందించి పంపుతున్నారు. ఇదే సమయంలో తనకు ఎలాంటి పదవి దక్కలేదని ఎవరికీ చెప్పుకోలేక… నాలుగు గోడల మధ్య కుమిలిపోతున్నారట. ఆయనెవరో ఈ స్టోరీలో చూద్దాం. బొప్పనకు దక్కని నామినేటెడ్ పోస్ట్! బొప్పన భవకుమార్. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున…
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా.. ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వచ్చిన ఇగో క్లాష్.. మరో ఇద్దరు డిప్యూటీ సీఎంలను కంగారెత్తించింది. అధికారులు.. ప్రభుత్వ వర్గాల్లోనూ పెద్దచర్చగా మారింది. సమస్యకు విరుగుడు మంత్రం వేసినా.. తెర వెనక జరిగిన కథ మాత్రం ఏపీ సచివాలయంలో ఆసక్తి రేకెత్తించింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. కీలక విభాగాలను తప్పించడంతో డిప్యూటీ సీఎంలు కలవరం! రెవెన్యూ శాఖలో అంతర్భాగంగా ఉండే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు.. వాణిజ్య పన్నుల విభాగాలను ఆర్థికశాఖకు బదలాయిస్తూ…
విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్స్లర్లే బాస్లు. నిధులు.. నియామకాల విషయంలో వారి నిర్ణయమే ఫైనల్. కానీ.. మారిన పరిణామాలతో తాము ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నామని రగిలిపోతున్నారట వీసీలు. హక్కులను కాపాడుకునే విషయంలో ఇంకేదో చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ తెలంగాణలో వీసీలకు వచ్చిన ఇబ్బందేంటి? కామన్ రిక్రూట్మెంట్పై ఆలోచనలో పడ్డ వీసీలు! చాలాకాలం తర్వాత తెలంగాణలో పది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు వచ్చారు. ఉప కులపతులు రాకతో.. ఆయా వర్సిటీలలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీల నియామకాల ప్రక్రియ మొదలవుతుందని…
ఒక మాజీ మంత్రి చేరిక.. ఇంకో మాజీ మంత్రి అలకకు కారణమైంది. అసంతృప్తితో ఉన్న ఆ నాయకుడిని ఎలా బుజ్జగించాలో పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. అందుబాటులో ఉన్న పెద్దలందరినీ పంపి సముదాయిస్తున్నారట. ఈ సందర్భంగా ఒక ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దానికి ఆయన ఒప్పుకొంటారా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా ఆఫర్? బీజేపీ పెద్దలు ఆఫర్ ఇచ్చారట మాజీ మంత్రి ఇ. పెద్దిరెడ్డి బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన్ని కాషాయ…
పదవులిచ్చారు. కొత్త తంటా తెచ్చారని ఈ ఎమ్మెల్యేలు విసుక్కుంటున్నారట. మాకెందుకు అవకాశం ఇవ్వలేదని సన్నిహితులు అడుగుతుంటే ఏం చెప్పాలో తెలీటం లేదట. చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల చైర్మన్ పదవులు స్థానిక ఎమ్మెల్యేలకు సమస్యగా మారింది. సొంత వారిని కాదని ఇతర ప్రాంతాల వారికి ఎలా ఇస్తారని నిలదీస్తున్నారట. చిత్తూరు జిల్లాలో పదవుల పంపకాలు బాగానే జరిగినా, ఆ రెండు ఆలయాల చైర్మన్ గిరి మాత్రం వివాదంగా మారింది. ఎమ్మెల్యేకి నామినేటెడ్ పదవుల వ్యవహారం పెద్దగా…
రిజిస్ట్రేషన్ల శాఖలో అదో హాట్ సీట్. ప్రస్తుతం ఖాళీగా వుంది. దీంతో అందరి చూపూ ఆ పోస్టింగ్ పైనే పడింది. ఎలాగైనా అక్కడ పాగా వేసేందుకు ఎత్తులు వేస్తున్నారట. పైరవీలు పెరిగిపోవడంతో తాత్కాలికంగా అక్కడ నియమాకాన్ని అధికారులు పక్కన పెట్టేశారట. ఇంతకీ ఆ పోస్ట్ ఎక్కడ వుంది? దానికి ఎందుకంత డిమాండ్…?. స్టీల్ సిటీ విశాఖపట్టణం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని. కాబోయే ఎగ్జిక్యూటివ్ కేపిటల్. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ స్ధిరాస్తుల విలువ ఏటి కేడాది పెరుగుతుంది.…
రాజకీయాల్లో విమర్శలు కామన్. కొందరు శ్రుతిమించి మాటల తూటాలు పేలుస్తారు. ఇంకొందరు హద్దేలేదన్నట్టుగా వాగ్భాణాలు సంధిస్తారు. ఈ విషయంలో ఆ మామా అలుళ్లు ఆరితేరిన వారే. కాకపోతే అల్లుడు దూకుడుగా వెళ్తుంటే.. మామా స్పీడ్ తగ్గించారట. దాంతో మామకు ఏమైంది అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. వారెవరో ఈస్టోరీలో చూద్దాం. 2014 నుంచి ఇద్దరి మధ్యా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం శ్రీకాకుళం జిల్లాలో ఫ్యామిలీ పాలిటిక్స్కు కేరాఫ్ అడ్రసైన ఆమదాలవలసలో.. మామా అల్లుళ్ల మాటల యుద్ధం పీక్స్కు చేరుకున్న…