ఆదిత్యనాథ్ దాస్ వీడ్కోలు సభలోనూ ఆర్థిక కష్టాలపైనే చర్చ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీడ్కోలు సభలో ఏం మాట్లాడతారు..? రిటైరయ్యే అధికారిని పొగడ్తల్లో ముంచెత్తుతారు. వచ్చే అధికారి నైపుణ్యాన్ని ప్రస్తావిస్తారు. కానీ.. ఆ వీడ్కోలు సభలో రాష్ట్రంలోని బర్నింగ్ టాపిక్కే చర్చకు వచ్చింది. రామేశ్వరం వెళ్లినా.. తప్పలేదన్నట్టుగా ఆ అంశంపై మాట్లాడేశారు. ఇదే ఇప్పుడు ఏపీ సచివాలయవర్గాల్లో చర్చగా మారింది. ఇంతకీ ఏంటా టాపిక్కు..?
ఆదిత్యనాథ్ దాస్ వీడ్కోలు సభలోనూ ఆర్థిక కష్టాలపైనే చర్చ..!
Also Read
కొంతకాలంగా ఏపీ అనే మాట వినపడితే చాలు.. రాజకీయ, అధికార వర్గాల్లో ఆర్థిక కష్టాల గురించే ప్రధానంగా చర్చకు వస్తోంది. విషయం ఏదైనా.. ఇదో రెగ్యులర్ టాపిక్గా మారిపోయింది. చివరికి అధికారుల వీడ్కోలు సభల్లో రాష్ట్ర ఆర్థిక కష్టాలే ప్రస్తావనకు వస్తున్నాయి. సీఎస్గా పదవి విరమణ చేసిన ఆదిత్యనాథ్ దాస్కు వీడ్కోలు పలికేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు.. సచివాలయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిత్యనాధ్ దాస్ చేసిన సేవలను.. ఆయనతో కలిసి పనిచేసినప్పటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు కొందరు. కానీ.. వీడ్కోలు సభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా ఆసక్తికరమైన ప్రస్తావన వచ్చింది.
పనులు జరక్కపోవడానికి ఆర్థికశాఖే కారణమని ఓ ఐఏఎస్ సెటైర్..!
నిధుల సమీకరణే కొత్త సీఎస్కు సవాల్..!?
ఆదిత్యనాధ్ దాస్ సేవలను గుర్తు చేసుకుంటూనే.. ఓ ఐఏఎస్ అధికారి చేసిన కామెంట్ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టేలా ఉందనే చర్చ జరుగుతోంది. వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న ఆ సీనియర్ ఐఏఎస్.. సచివాలయంలో పరిస్థితులను వివరించారు. చిన్న చిన్న ఇబ్బందులను కూడా సీఎస్ పరిగణనలోకి తీసుకుని.. పరిష్కరించేవారని చెప్పారు. ఇటీవల సచివాలయంలోని చాలా మంది మంత్రులు.. ఉన్నతాధికారుల ఛాంబర్లలో ఏసీలు పనిచేయలేదని చెబుతూనే.. అక్కడితో ఆగకుండా దీనికి కారణం ఆర్థికశాఖే అని చిన్నపాటి సెటైర్ వేశారు. ఆ ఐఏఎస్ ఏదో అలా చెప్పారులే అని అంతా అనుకుంటున్న తరుణంలోనే.. ఆదిత్యనాధ్ దాస్ మరో బాణం విసిరారు. కొత్త సీఎస్ సమీర్ శర్మకు ఆర్థిక వనరుల సమీకరణే ప్రధాన సవాల్గా కుండబద్దలు కొట్టేశారు. మీకు సాయం చేయడానికి ఆర్థికశాఖ ఉన్నతాధికారి SS రావత్ ఉన్నారని కొంత ధైర్యం చెప్పారు. ఈ రెండు అంశాలూ సాధారణ ప్రస్తావనల్లా అనిపిస్తోన్నప్పటికీ ప్రస్తుతం సచివాలయవర్గాల్లో పెద్దగా చర్చగా మారిపోయాయి.
ఆర్థికశాఖ అధికారులు రావత్, సత్యనారాయణలపై గుర్రు..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో.. ఇద్దరూ చక్కగా చెప్పేశారని చెవులు కొరుక్కుంటున్నారు. పైగా ఆదిత్యనాధ్ దాస్ .. సీనియర్ అధికారి రావత్ పేరును ప్రస్తావించడంపై చర్చ మరింత వేడెక్కుతోంది. వివిధ శాఖలకు చెందిన చాలామంది ఉన్నతాధికారులతోపాటు ఆర్థికశాఖ అధికారులు.. రావత్, మరో ఆఫీసర్ సత్యనారాయణల మీద గుర్రుగా ఉన్నారు. తాము పంపిన ఎన్నో ప్రతిపాదనలను తొక్కి పెట్టేస్తున్నారని.. చిన్న పనులు కూడా జరగ్గకుండా అడ్డుపడుతున్నారని అసహనంతో ఉన్నారట. ఇప్పుడు వీడ్కోలు సభే సరైన సమయం అనుకున్నారో ఏమో.. ఓ ఐఏఎస్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాజీ సీఎస్ ఏకంగా రావత్ పేరు ప్రస్తావించారు. దీంతో అసలు కార్యక్రమంపై చర్చ పక్కకుపోయింది. ఏపీ డబ్బుల కష్టాలే సచివాలయాల వర్గాల్లో బర్నింగ్ టాపిక్గా మారిపోయింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!