ఎమ్మెల్యే రోజాకు సొంతపార్టీలో అసమ్మతి సెగ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే రోజాకు సొంతపార్టీలో అసమ్మతి సెగ ఇప్పట్లో తగ్గేలా లేదా? నిండ్ర ఎంపీపీ ఎంపిక నిద్ర లేకుండా చేస్తోందా? రోజాతోపాటు ఆమె వ్యతిరేకవర్గం ఈ పంచాయితీని తాడేపల్లికి తీసుకెళ్లాయా? ఆధిపత్యపోరులో పైచెయ్యి సాధించేది ఎవరు?
నగరిలో రోజాకు వైసీపీ అసమ్మతి నేతల నుంచి సెగలు..!
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాను వైసీపీలో వరస కష్టాలు వెంటాడుతున్నాయి. సొంతపార్టీ నుంచే ఎదురవుతున్న అసమ్మతితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. వర్గపోరు ఆమెను ఉపిరి సలపకుండా చేస్తోంది. పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత సొంత పార్టీ నేతలతోనే రోజా పోరాడాల్సిన పరిస్థితి. నగరి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే నిండ్ర MPP ఎన్నిక ఎమ్మెల్యేకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ ఎపిసోడ్లో దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని వైసీపీ నేత, శ్రీశైలం ఆలయ బోర్డు ఛైర్మన్గా నియమితులైన రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఎమ్మెల్యేకు సవాల్ చేయడం హాట్ టాపిక్.
నిండ్ర ఎంపీపీ ఎంపికపై రోజా వర్సెస్ చక్రపాణిరెడ్డి..!
నిండ్ర మండలంలో 8 MPTCలకు గాను.. ఏడు చోట్ల వైసీపీ, ఒక చోట టీడీపీ గెలిచాయి. వైసీపీ ఎంపీటీసీలలో రోజా బలపర్చిన ఎంపీటీసీ ఒక్కరే ఉన్నారట. మిగిలిన ఆరుగురికి రెడ్డివారి చక్రపాణిరెడ్డి మద్దతిచ్చారట. దాంతో ఎంపీపీగా తన సోదరుడు రెడ్డివారి భాస్కర్రెడ్డిని ఎంపిక చేయాలని చక్రపాణిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యే రోజా తిరస్కరించడంతో సమస్య ముదురుపాకాన పడింది. తన వర్గానికి చెందిన దీపను MPPని చేయాలన్నది రోజా డిమాండ్.
తాడేపల్లికి చేరిన నిండ్ర ఎంపీపీ ఎంపిక రగడ..!
ప్రస్తుతం ఎంపీటీసీలలోనూ చీలక వచ్చేసింది. చక్రపాణిరెడ్డి దగ్గర ఐదుగురు వైసీపీ ఎంపీటీసీలతోపాటు టీడీపీ ఎంపీటీసీ కూడా మద్దతిచ్చారట. మిగిలిన ముగ్గురు వైసీపీ ఎంపీటీసీలు రోజా శిబిరంలో ఉన్నారట. దీంతో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. రోజా.. చక్రపాణిరెడ్డిలు ఉడుం పట్టు పట్టడంతో సమస్య తేలలేదు. ఈ రగడ కాస్తా తాడేపల్లికి చేరింది. రెండు వర్గాలు పోటాపోటీగా ఫిర్యాదు చేసుకున్నాయట. మంత్రి పెద్దిరెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు రోజా. చక్రపాణిరెడ్డి కూడా పెద్దిరెడ్డితోపాటు తాడేపల్లిలోని పార్టీ పెద్దల దగ్గరకు వెళ్లారట.
8న నిండ్ర సమస్య కొలిక్కి వస్తుందా?
మొన్న ఆగిపోయిన ఎంపీపీ ఎన్నికలను తాజాగా చేపట్టేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. 8వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉంది. ఆ రోజున నిండ్ర పంచాయితీ కొలిక్కి వస్తుందా? మళ్లీ వాయిదా పడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
iBomma : ఐబొమ్మ మళ్లీ యాక్టివ్.. కొత్త సినిమాలతో సడెన్ ఎంట్రీ!
-
Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
-
Jailer 2: ‘జైలర్ 2’ ఇప్పట్లో రానట్టేనా?
-
RCB vs KKR: మాపై కోహ్లీ దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నా.. కేకేఆర్ కోచ్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!