అధికార పార్టీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారా?సొంత పార్టీకి చెందిన నాయకుడే…ఆ ఎమ్మెల్యే ఇమేజ్ను డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేశారా?ఈ వ్యవహారం పార్టీ పెద్దలు దృష్టికి చేరిన తరువాత…ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి?పార్టీ ఆ ఎమ్మెల్యేకు భరోసా ఇచ్చిందా? ఉమ్మడి మెదక్ జిల్లా టిఆర్ఎస్కు రాజకీయంగా కీలకమైంది. టిఆర్ఎస్లో ప్రారంభం నుంచి ఉన్న నేత పద్మా దేవేందర్ రెడ్డి. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత…
నోటి దురుసు ఆ ఎమ్మెల్యేకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. కాంట్రవర్శీ కామెంట్స్ ఆయనకు శాపమై.. చిరాకు పెడుతున్నాయి. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నట్లు.. హుజురాబాద్లో బీజేపీ గెలుపుతో.. పాలమూరు జిల్లా ఎమ్మెల్యేను రాజీనామా చేయాలంటూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారట. దీంతో ఆ ఎమ్మెల్యే ప్రస్టేషన్.. పీక్ కు వెళ్లినట్లు తెలుస్తోంది . ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ? ఆయన తిప్పలేంటో చూద్దాం… అచ్చంపేట ఎమ్మెల్యే , విప్ గువ్వల బాలరాజు వ్యవహార శైలి…
ఒకప్పుడు చక్రం తిప్పిన ఆ మాజీ మంత్రికి ఓ జూనియర్ ఎమ్మెల్యే వర్గం చెక్ పెడుతోంది. 30 ఏళ్ల అనుభవంలో ఎన్నడూ చూడని పరిణామాలు సీనియర్ నేతలో అసంతృప్తి జ్వాలలు రగిలించాయ్. వర్గ రాజకీయాలతో విసిగెత్తిపోయిన ఆయన ఎక్కువ కాలం భరించడం కష్టం అనుకున్నారో ఏమో కానీ…కుండబద్దలు కొట్టేశారు. నాకు సీఎం తప్ప బాస్లు ఎవరూ లేరని బహిరంగంగానే ప్రకటించి సరికొత్త చర్చకు తెరతీశారు. విశాఖ జిల్లా అనకాపల్లి వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ మాజీ…
మీరు మారిపోయార్సార్ అంటున్నారు తమ్ముళ్లు..అయితే ఈ మార్పు ఫుల్ టైమా లేక, టెంపరరీనా అని అనుమాన పడుతున్నారట.అధికారానికి దూరమైన సమయంలో వచ్చిన మార్పు నమ్మశక్యంగా లేదనుకుంటున్నారట.ఇదే తీరు గతంలో కూడా ఉండి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా అనుకుంటున్నారని టాక్. ప్రతిపక్షంలోకి వచ్చాక చంద్రబాబు స్టైల్ మారిందా? అధికారంలో ఉండగా దర్శన భాగ్యమే గగనంగాడే పరిస్థితి. అలాంటిది ప్రతిపక్షంలోకి వచ్చాక నేరుగా కార్యకర్తలతో ఫోన్-ఇన్ కార్యక్రమాలు నడిపించేస్తున్నారట. ప్రతి రెండు రోజులకోసారి క్షేత్ర స్థాయిలో…
తెలంగాణలో ఒకేసారి ఏడుగురు పెద్దల సభకు వెళ్లనున్నారు. ఎవరా ఏడుగురనేదే ఇప్పుడు నడుస్తున్న చర్చ. అయితే, హుజురాబాద్ ఫలితం తర్వాత టియ్యారెస్ ఎమ్మెల్సీ లెక్కలు మారుతున్నాయనే టాక్ ఉంది. దీంతో, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యేదెవరు ? సిట్టింగ్ల్లో మళ్లీ ఎవరు? కారు పార్టీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఒకేసారి ఖాళీ అయ్యాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి , కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, ఫరీదుద్దీన్, బోడకుంటి…
ఎన్నికలు డబ్బుమయంగా మారాయనేది పాత మాటే.పంచాయతీ ఎన్నికలకే కోట్లు పెట్టే చోట, అసెంబ్లీకి ఎంత ఖర్చవుతుందో ఊహకు కూడా అందని పరిస్థితి. అయితే భారీ హైప్ వచ్చిన హుజూరాబాద్ ప్రచారం జరిగిన తీరు…. బిజెపి నేతల్ని కంగారు పెడుతుందట. ఈ స్థాయిలో ఖర్చు చేయాలంటే కష్టమే అనుకుంటున్నారట. హుజూరాబాద్ ఎన్నికల ల్లో డబ్బుల ప్రవాహాన్ని చూసిన బీజేపీ నేతలు ఖంగుతింటున్నారు… ఇదేం ఖర్చు , ఇన్ని పైసలు ఎక్కడి నుండి తేవాలి.. రేపు పోటీ చేసే అవకాశం…
తిరుమల వేంకటేశ్వరుని క్షణకాల దర్శనమే అమోఘం.. అద్భుతం. అలాంటిది స్వామి వారికి సేవ చేసుకోవడానికి ఎంపిక అయితే మహాద్భుతమే…! కానీ, TTDలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన 52 మందిని దురదృష్టం వెంటాడుతూనే ఉందా? వారి ఆశలు అడియాశలేనా? హైకోర్టు కామెంట్స్తో ఆర్డినెన్స్కు బ్రేక్ పడిందా లేక పూర్తిగా ఆగిపోయిందా? అసలేం జరిగింది? లెట్స్ వాచ్..! టీటీడీ బోర్డుపై ధర్మాసనం కీలక కామెంట్స్..! తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం తర్వాత ఎదురైన సమస్యలు ఇప్పట్లో కొలిక్కివచ్చేలా లేవు.…
నాకు పదవి రావాలని కోరుకోవడంలో అస్సలు తప్పులేదు. కానీ.. నాకు రాకుంటే మాత్రం పక్కనేతకు రావొద్దని కోరుకుంటున్నారు ఆ జిల్లా నేతలు. తన సంగతి అటుంచి ప్రత్యర్థికి ప్లస్ అయ్యే అంశాల టార్గెట్గా పావులు కదుపుతున్నారట. పైకి ఇకఇకలు.. పకపకలు.. వెనక మాత్రం వెన్నుపోట్లతో గట్టిగానే చెక్ రాజకీయం నడుపుతున్న ఆ నేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం. అవంతిని మారిస్తే.. ఆయన స్థానంలో కేబినెట్లో ఎవరికి ఛాన్స్? విశాఖ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలలో అమాత్య పీఠం కోసం…
దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టండి.. మీ పెతాపమో.. మా పెతాపమో తేల్చుకుందాం అని సవాళ్లు విసిరిన టీడీపీకి..ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడిందా? స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పార్టీకి అగ్నిపరీక్షగా మారబోతున్నాయా? తెలుగు తమ్ముళ్లు ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డారా? మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శక్తిని చాటుకోక తప్పదా? ఏపీలో వివిధ కారణాలతో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడత ఎలక్షన్స్ జరిగినప్పుడు నామినేషన్ల దాఖలు, ఏకగ్రీవాల విషయంలో అధికారపార్టీ…
హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు చేరికలు టిఆర్ఎస్ కు ఎంత వరకు కలసి వచ్చాయి ? ఆ నలుగురు నేతల చేరికతో ప్లస్ అవుతుంది అనుకుంటే…అలాంటిదేమీ జరగలేదా? గులాబి పార్టీలో హుజూరాబాద్ ఫలితం తర్వాత జరుగుతున్న చర్చలేంటి? హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది.టిఆర్ఎస్ పార్టీ ఆశించిన ఫలితం రాబట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.దీంతో హుజురాబాద్ ఫలితంపై టిఆర్ఎస్ లో అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. ఓటమికి కారణాలపై ఎవరికి వారు విశ్లేషణలు చేస్తున్నారు. ఉపఎన్నికలో గెలుపు కోసం…