మాజీల మనుగడ కోసం పోరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీలో మాజీ ఎమ్మెల్యేలు.. పాత నాయకులు మనుగడ కోసం పోరాటం చేస్తున్నారా? అసమ్మతి గళం వినిపిస్తున్నారా? కావాలనే పక్కన పెడుతున్నట్టు అనుమానాలు ఉన్నాయా? పాత నేతల రహస్య భేటీలు ఎందుకుగుబులు రేపుతున్నాయి?
మనుగడ కోసం మాజీలు రోడ్డెక్కుతున్నారా?
గతంలో ఎన్నడు లేని కొత్త సంప్రదాయానికి తెలంగాణ బీజేపీ లో తెరలేచింది. ఒకప్పుడు పార్టీలో కీలకంగా ఉన్న నేతలు ప్రస్తుతం సోదిలో లేకుండా పోయారు. తమను పట్టించుకోవడం లేదని వారంతా ఒక్కటవుతున్నారు. ఈ సమయంలో నోరు విప్పకపోతే భవిష్యత్ ఉండబోదని భావిస్తున్నారో ఏమో.. మనుగడ కోసం రోడ్డెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Off The Record: మీనాక్షి నటరాజన్ అవకాశానికి గండి కొట్టింది ఎవరు? రాష్ట్ర నేతలు ఎవరైనా లీకులు ఇచ్చారా?
- Off The Record: దువ్వాడకు వైసీపీలోకి నో రీ ఎంట్రీ?.. రీల్స్ రాజా పొలిటికల్ కెరీర్ ఖతం అయినట్టేనా..?
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
జిల్లాల వారీగా రహస్య సమావేశాలు
అసమ్మతి గళం అందుకున్న బీజేపీ వెటరన్ జాబితాలో మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, ధర్మారావు, సీనియర్ నేతలు రాజేశ్వరరావు, నామోజీ, వెంకటరమణి, సుగుణాకర్రావు, చింతా సాంబమూర్తి తదితరులు ఉన్నట్టు పార్టీ వర్గాల టాక్. బీజేపీ తమను పట్టించుకోవడం లేదని… కావాలనే పక్కన పెడుతున్నారని భావిస్తున్న వీళ్లంతా ఇప్పటికే రహస్యంగా మూడుసార్లు భేటీ అయినట్టు తెలుస్తోంది. జిల్లాల్లో అసంతృప్తితో ఉన్న నేతలతో జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకున్నట్టు సమాచారం. అసమ్మతి నేతల ప్రయత్నాల వెనక బీజేపీ ఒకరిద్దరు ముఖ్య నాయకులు ఉన్నట్టు కాషాయ శిబిరంలో చెవులు కొరుక్కుంటున్నారు.
కావాలనే బీజేపీ నుంచి దూరం పెడుతున్నారని అనుమానం
కొత్త నీరు వచ్చాక పాత నీరు కొట్టుకుపోతుందన్న చందగా.. బీజేపీలోకి కొత్త నాయకులు వచ్చాక.. పాత నేతలను పట్టించుకునేవాళ్లు లేరు. వారికి ప్రాధాన్యం కూడా తగ్గింది. ఒకప్పుడు బీజేపీ అంటే ఒకరో ఇద్దరో నాయకులు గుర్తొచ్చేవారు. వాళ్లే కమిటీలలో ఉండేవారు. ఇప్పుడు పార్టీలో వారి ఊసు లేదు.. వారికి ప్లేసూ లేదు. బీజేపీ రాష్ట్ర కమిటీలో చోటు ఇవ్వకపోవడంతో.. కేంద్ర కమిటీలోకి తీసుకుంటారని చాలా మంది లెక్కలు వేసుకున్నారు. ఇటీవల ప్రకటించిన జాతీయ కార్యవర్గంలోనూ వెటరన్ కమలనాథులకు మొండిచెయ్యి తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నా.. ఆ మేరకు హామీ ఇచ్చే నాయకులే కరువయ్యారట. దీంతో తమను కావాలనే పార్టీకి దూరం పెడుతున్నారని అనుమానిస్తున్నారట.
రహస్య భేటీలపై ఢిల్లీ పెద్దలు సీరియస్..!
రహస్య భేటీల తర్వాత అసంతృప్త నాయకులంతా కేంద్రమంత్రి కిషన్రెడ్డితో సమావేశమైనట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు వాళ్లు నిర్వహించిన పార్టీ బాధ్యతలు.. చేపట్టిన నామినేటెడ్ పోస్టులు చాలు. కొత్తవాళ్లు వచ్చాక వారికి ఛాన్స్ ఇస్తనే పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీలోని మరో వర్గం వాదన. అసమ్మతి నేతల రహస్య సమావేశాల సంగతి.. బీజేపీ జాతీయ నాయకత్వం వరకు వెళ్లినట్టు సమాచారం. ఢిల్లీ పెద్దలు సీరియస్గా ఉన్నట్టు చెబుతున్నారు. బీజేపీ సిద్ధాంతాలు గురించి తెలిసి.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే.. వెంటనే వేటు పడుతుందని సంకేతాలు పంపుతున్నారట. దీంతో సీక్రెట్ మీటింగ్రెస్ పెట్టుకున్నవాళ్లు ఎక్కడా బయట పడకుండా .. తెరవెనక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట. మరి.. పాత.. కొత్త రగడను కమలనాథులు ఎలా సెట్ చేసుకుంటారో చూడాలి.
.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!