కుప్పం మున్సిపాలిటీ పోరు సెగలు రేపుతోంది. వైసీపీ జెండా ఎగరేయటానికి మంత్రి పెద్దిరెడ్డి అన్ని రకాల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పుడు కొత్త అస్త్రం ప్రయోగించి చర్చకు దారితీశారు. కుప్పంలోనే టీడీపీ సీనియర్లు..! చిత్తూరు జిల్లాలోని కుప్పం.. కావటానికి మున్సిపాలిటీనే ..! ఇక్కడ పురపోరు మాత్రం హై ఓల్టేజ్ తో సాగుతోంది. గెలుపు కోసం వైసీపీ, టీడీపీ గట్టి వ్యూహాలే రచిస్తున్నాయి. అక్రమాలు జరుగుతున్నాయని వరస పెట్టి రాష్ట్ర ఎన్నికల సంఘానికి, డీజీపీకి లేఖలు రాస్తున్నారు చంద్రబాబు.…
జనంతో బాగా గ్యాప్ వచ్చిందని ఆ జిల్లాలోని ఎమ్మెల్యే, ఎంపీలు ఆందోళన చెందుతున్నారా? మళ్లీ ప్రజలకు దగ్గర య్యేందుకు డివోషనల్ బాట పట్టారా? సడెన్గా ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఇంతకీ ఎవరా నాయకులు? ప్రజాప్రతినిధుల భక్తి లెక్కలు వేరా? గుస్సాడీ నృత్యాలు.. కార్తీక దీపోత్సవాలు..! ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఇవన్నీ ఏ ధార్మిక సంస్థలో నిర్వహిస్తున్నాయంటే పొరపాటు. ఫౌండేషన్ ద్వారా కొందరు.. సొంతంగా మారికొందరు తమలోని భక్తిని భారీగానే బయటపెడుతున్నారు.…
గెలిచే అవకాశం లేకపోయినా.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ ఎందుకు దిగుతోంది? అన్ని చోట్లా పోటీ చేస్తుందా.. కేవలం కొన్ని స్థానాలకే పరిమితం అవుతుందా? ఈ విషయంలో కమలనాథుల లెక్కలేంటి? బలం లేని చోట బరిలో బీజేపీ..! తెలంగాణలో మళ్లీ ఎన్నికల వేడి నెలకొన్నా.. వార్ ఏకపక్షం కావడంతో పెద్దగా చర్చ లేదు. ఎన్నికలు జరిగే 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం టీఆర్ఎస్వే. ఈ ఎన్నికల్లో ఓటేసే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల…
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అంతా జట్టు కట్టారా? రేవంత్ మీద నుంచి టార్గెట్ మళ్లించారా.. లేక వ్యూహాత్మక ఎత్తుగడ ఎంచుకున్నారా? వరస భేటీల వెనక వ్యూహం ఏంటి? వారి తాజా లక్ష్యం ఎవరు? ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్పై సీనియర్ల గురి..! ఒకరికొకరు చెక్ పెట్టుకోవడంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారే దిట్ట. ఏదైనా తమ దారిలోకి రావాలని అనుకుంటారు తప్పితే.. అంతా ఒకేదారిలో నడిచే ప్రసక్తే లేదన్నట్టుగా ఉంటుంది నేతల వ్యవహార శైలి. ఒకరు యస్…
మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుందని చెబుతారు. అక్కడ మాత్రం మంది ఎక్కువై.. ప్రొటోకాల్ సమస్యలు వస్తున్నాయి. ముందొచ్చిన చెవులు కంటే.. వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా మారింది సీన్. ఇంకేముంది.. ముందు నుంచీ జెండాలు మోసిన పాతకాపులు కుతకుతలాడుతున్నారట. పాత నేతలు వెనక బెంచీలకే పరిమితం..! తెలంగాణ బీజేపీలో ఒకప్పుడు చెప్పుకోదగ్గ నాయకులు నలుగురో.. ఐదుగురో ఉండేవారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక.. కాషాయ శిబిరంలో నేతల జాబితా పెరిగింది. వలస నాయకుల సంఖ్య ఎక్కువైంది.…
ఏపీ టీడీపీ నేతలు ఉన్నట్టుండి నా గుణింతాన్ని వల్లె వేస్తున్నారా? బోస్డీకే అంటూ.. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన పట్టాభి రీఎంట్రీ తర్వాత ఇది మరీ ఎక్కువైందా? కొత్త పల్లవిపై టీడీపీ వర్గాల స్పందనేంటి? నా గుణింతం వల్లె వేసిన పట్టాభి..! పార్టీ గొప్పదా.. వ్యక్తులు గొప్పా? ప్రస్తుతం టీడీపీలో ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. బోస్డీకే అని విమర్శించి.. రాజకీయ వేడి రగిలించి.. జైలుకెళ్లొచ్చాక.. ఫ్యామిలీతోపాటు విదేశాల్లో రిలాక్స్ అయిన టీడీపీ నేత…
సత్యం చెప్పే హరిచ్ఛంద్రులం.. అవసరానికో అబద్ధం అన్నట్టు.. రాజకీయ నాయకుల నిర్ణయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. వచ్చిన అవకాశాలను అనుకూలంగా మలుచుకోవడంలో పొలిటీషియన్స్ను మించివాళ్లు ఉండరు. గుంటూరు పాలిటిక్స్లో ఇప్పుడదే జరుగుతోంది. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర మాజీ మంత్రి రావెల కిషోర్బాబుకు బాగా కలిసొచ్చిందనే చర్చ మొదలైంది. రెండేళ్ల క్రితం రావెల బీజేపీలో చేరారు. కాషాయం కండువా కప్పుకొని కనిపిస్తున్నా.. ఆయన మనసంతా టీడీపీలో ఉన్నట్టు, సైకిల్ను బాగా మిస్సవుతున్నట్టు అతని సన్నిహితులు చెబుతున్నారు. తప్పనిసరి…
జిల్లా అధ్యక్ష పదవులపై టీఆర్ఎస్ నేతల్లో ఎన్నో ఆశలు మొలకెత్తాయి. అధిష్టానాన్ని చేరుకుని.. జిల్లా కుర్చీని సంపాదించడానికి ప్రయత్నాలూ స్టార్ట్ అయ్యాయి. రేపో, మాపో జిల్లా అధ్యక్షుల పేర్లు కూడా డిక్లేర్ అవుతాయని ఆశిసంచారు. కానీ! లాస్ట్ మినట్లో గులాబీ బాస్ వ్యూహం మారినట్టు తెలుస్తోంది. పార్టీకి జిల్లా స్థాయిలో అధ్యక్షుడు అవసరమా? అని లోచిస్తున్నట్టు తెలుస్తోంది. అధ్యక్షుడి స్థానంలో మరో పదవిని తీసుకురావాలని ఆలోచిస్తోంది. ఇంతకీ టీఆర్ఎస్ కొత్త వ్యూహం ఏంటి? జెండా పండుగతో పార్టీ…
అధికార పార్టీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారా?సొంత పార్టీకి చెందిన నాయకుడే…ఆ ఎమ్మెల్యే ఇమేజ్ను డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేశారా?ఈ వ్యవహారం పార్టీ పెద్దలు దృష్టికి చేరిన తరువాత…ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి?పార్టీ ఆ ఎమ్మెల్యేకు భరోసా ఇచ్చిందా? ఉమ్మడి మెదక్ జిల్లా టిఆర్ఎస్కు రాజకీయంగా కీలకమైంది. టిఆర్ఎస్లో ప్రారంభం నుంచి ఉన్న నేత పద్మా దేవేందర్ రెడ్డి. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత…
నోటి దురుసు ఆ ఎమ్మెల్యేకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. కాంట్రవర్శీ కామెంట్స్ ఆయనకు శాపమై.. చిరాకు పెడుతున్నాయి. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నట్లు.. హుజురాబాద్లో బీజేపీ గెలుపుతో.. పాలమూరు జిల్లా ఎమ్మెల్యేను రాజీనామా చేయాలంటూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారట. దీంతో ఆ ఎమ్మెల్యే ప్రస్టేషన్.. పీక్ కు వెళ్లినట్లు తెలుస్తోంది . ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ? ఆయన తిప్పలేంటో చూద్దాం… అచ్చంపేట ఎమ్మెల్యే , విప్ గువ్వల బాలరాజు వ్యవహార శైలి…