క్రాస్ రోడ్స్ లో కొండా.. దారెటు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయనో మాజీ ఎంపీ. ఎక్కడ ఎన్నికలు జరిగినా జోస్యం చెప్పేస్తారు. ఎవరి బలం ఏంటో ముందే ప్రకటించే ఆయన.. తాను ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని పార్టీలు అప్రమత్తం అవుతుంటే.. ఆ మాజీ ఎంపీ మాత్రం సైలెంట్. ఎందుకలా? ఎవరా మాజీ ఎంపీ?
కొండాతో కలిసి సాగడానికి సాహసించడం లేదా?
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకసారి కాంగ్రెస్ అధినాయకత్వంపై విమర్శలు చేస్తారు. మరోసారి బీజేపీ పథకాలు, కార్యక్రమాలపై సానుకూలంగా స్పందిస్తారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా అనే అనుమానాలు మాజీ ఎంపీ అనుచరుల్లోనే ఉంది. ఉత్తమ్ వర్గం, రేవంత్ వర్గం కాకుండా కొండా వర్గం ఒకటి తయారు చేసుకున్నా.. ఆయనతో కలిసి సాగడానికి ఎవరు సాహసించడం లేదట.
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
ఉపఎన్నికలో ఈటలకు మద్దతు.. జీవో 317పై కాంగ్రెస్ నిరసనకు హాజరు
కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏ పార్టీలో చేరతారనే దానిపై స్పష్టత లేదు. అనుచరగణం డైలమాలో ఉంది. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారాయన. రాజకీయ పునరాగమనంపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఇటీవల పండగలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలకు పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను సొంత ట్రస్టు సభ్యులే ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు మద్దతు ప్రకటించారు విశ్వేశ్వర్రెడ్డి. తాజాగా పరిగిలో డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి 317 జీవోకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో తళుక్కుమన్నారు.
మళ్లీ చేతిని అందుకుంటారో లేదో క్లారిటీ లేదు
కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన సమయంలో మూడు నెలల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు. రోజులు.. నెలలు గడిచిపోతున్నా తాను ఎటువైపు చూస్తున్నదీ చెప్పడం లేదు. మీడియా ముందుకు వస్తున్నా.. ఆ ముక్క తప్ప అన్నీ మాట్లాడేస్తున్నారు విశ్వేశ్వర్రెడ్డి. ఒకప్పుడు ఆయన ప్రెస్మీట్ పెడితే.. రాజకీయంగా ఎలాంటి దుమారం రేపుతారా అనే చర్చ జరిగేది. రాజకీయాల్లో తటస్థ వ్యక్తులతో కలిసి నడుస్తారా..? వేరే పార్టీలో చేరతారా..? కొత్తగా పార్టీ పెడతారా..? మళ్లీ చేతిని అందుకుంటారా.. అనేది క్లారిటీ ఇవ్వడం లేదు.
పొలిటికల్గా ఎటూ తేల్చుకోలేకపోతున్నారా?
జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఇన్నాళ్లు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన కొండా విశ్వశ్వర్రెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేయగానే బీజేపీలో చేరుతారనే చర్చ జరిగింది. అయితే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీ గట్టిగా పోరాడుతుందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్లో కొందరు అమ్ముడుపోయారంటూనే .. పీసీసీ నాయకత్వం మారి.. కేసీఆర్తో గట్టిగా పోరాడే నాయకుడొస్తే తిరిగి కాంగ్రెస్లో చేరాలో వద్దో ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి వచ్చినా.. కొండా నుంచి స్పష్టత లేదు. పొలిటికల్గా ఎటు వెళ్లాలో తేల్చుకోలేక క్రాస్రోడ్స్లో ఉండిపోయారు. అసలే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో వైఖరి స్పష్టం చేయకపోతే రాజకీయంగా కొండా విశ్వేశ్వర్రెడ్డి నిలబడతారా లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి.. మాజీ ఎంపీ ఏం చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
ట్రెండింగ్
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!