తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభకు కొందరు తమ్ముళ్లు సరిగా పనిచేయలేదా? అలాంటి నాయకులపై చంద్రబాబుకు నివేదిక చేరిందా? ఎవరి పనితీరుపై కేడర్ అసంతృప్తి వ్యక్తం చేసింది? పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమానికి నాయకులు ఎందుకు టచ్ మీ నాట్గా ఉండిపోయారు? రైతుల సభను పట్టించుకోని టీడీపీ నేతలపై కేడర్ గుర్రు..! తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభను చాలా గ్రాండ్గా నిర్వహించాలని చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు చేసిన కసరత్తు అంతా ఇంతాకాదు. ఇటీవల…
కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు.. ఉద్యోగుల బదిలీలు ఉన్నాయా? తెలంగాణ సాధించుకున్నామన్న సంతోషం ఆవిరై.. కొత్త సమస్యను తలెకెక్కించుకున్నామనే భావనలో ఉద్యోగులు ఉన్నారా? ఇంతకీ కొత్త జోనల్ విధానం ఉద్యోగులకు వరమా.. శాపమా..? ఉద్యోగులకు అన్యాయం జరగకూడదన్న ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోవడం లేదా? తెలంగాణలో కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది. ఇదే అదునుగా కొందరు అధికారులు పారదర్శకతకు పాతరేస్తూ అయిన వారిని అందలం ఎక్కిస్తున్నారనే ఆరోపణలు…
30 లక్షలు టార్గెట్. ఆ అంకె వినగానే గుండె గుభేల్ మన్నా.. సవాల్గా తీసుకుని టార్గెట్ చేరుకోవాలని అనుకున్నారు నాయకులు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి రివర్స్. చీమ కుట్టినట్టు అయినా లేదట. పార్టీ చేపట్టిన కార్యక్రమానికి ఊ అంటారో.. ఊహూ అంటారో కూడా తెలియని పరిస్థితి ఉందట. సభ్యత్వం నమోదు కోసమే 30 మందికి శిక్షణ..! కొత్త నాయకత్వం రాగానే సభలు.. సమావేశాలు అని ఊదరగొట్టిన తెలంగాణ పీసీసీకి 30 లక్షల సభ్యత్వం నమోదును లక్ష్యంగా పెట్టింది…
ఆ జిల్లాలో ఆయన కాకలు తీరిన రాజకీయ నేత. కానీ.. సార్కు మైనస్ మేడమే అని చర్చ ఉంది. తూకానికి సరితూగే వాళ్లకు మేడమ్ టిక్ పెడితే.. సార్ ఓకే చెప్పాలట. కుమారుడి తీరు కూడా ఆయనకు సన్స్ట్రోక్గా మారిందట. గతంలోనూ ఇలాంటి అనుభవాలతో పొలిటికల్గా దెబ్బతిన్నా.. ఆయన వైఖరిలో ఎందుకు మార్పు రాలేదు? ఎవరా నాయకుడు ? ఇంట్లో భార్యాబిడ్డల మాట కాదనలేకపోతున్న ప్రజాప్రతినిధి..! అద్భుతమైన వాక్ చాతుర్యం.. ఎవరినైనా కలుపుకొని వెళ్లే మనస్తత్వం సిక్కోలు…
అధికారం కోల్పోయిన రెండున్నరేళ్ల తర్వాత ఆ నియోజకవర్గంలో ఓ ప్రయోగం చేసింది టీడీపీ. మాజీ ఎమ్మెల్యేను తప్పించి నియోజకవర్గ బాధ్యతలను మరోనేత చేతుల్లో పెట్టింది. గ్రౌండ్లో మాత్రం సీన్ మరోలా ఉందట. ఓ మాజీ మంత్రి కుమారుడు అక్కడ కన్నేయడంతో రాజకీయం రసకందాయంలో పడిందట. టీడీపీ అంతర్గత రాజకీయాలు గవిరెడ్డిని ఓడించాయా? విశాఖజిల్లా మాడుగుల. ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం తర్వాత ఆరుసార్లు ఇక్కడ పసుపు జెండానే ఎగిరింది. 2009లో రాష్ట్రంలో అధికారాన్ని…
ప్రకాశం జిల్లా టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైందా..? సర్వే పేరు చెబితేనే ఉలిక్కి పడుతున్నారా? తమ పదవులు ఉంటాయో లేదోనని ఆందోళన చెందుతున్న నాయకులు ఎవరు? ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను కలవరపెట్టేలా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఏంటి? రాబిన్శర్మ బృందంతో టీడీపీ పరిస్థితిపై సర్వే..! గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో నాలుగుచోట్ల టీడీపీ గెలిచింది. ఈ నలుగురిలో ఒకరు జారుకున్నా.. మిగిలిన వాళ్లంతా కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా టీడీపీలో ఆశించిన స్థాయిలో జోష్…
ఖమ్మంజిల్లా టీఆర్ఎస్లో క్రాస్ ఓటింగ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయా? ఈ ఎపిసోడ్ వెనక ఉన్నదెవరు? వారిని పార్టీ గుర్తించిందా? చర్యలు తీసుకుంటుందా? ఇంతలోనే జిల్లా నాయకులు ఒకరిపై ఒకరు ఎందుకు బురద జల్లుకుంటున్నారు? ఖమ్మంలో క్రాస్ ఓటింగ్ను ప్రోత్సహించిందెవరు? పోలింగ్ జరిగిన ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినా.. చర్చ మాత్రం క్రాస్ ఓటింగ్పైనే కొనసాగుతోంది. పోలింగ్ జరిగిన జిల్లా రాజకీయాల్లో ఈ అంశంపైనే చర్చ ఆసక్తిగా సాగుతోంది. ఖమ్మం జిల్లా ఫలితాలు అధికారపార్టీలో అలజడి…
మంత్రి పదవిపై వాళ్లిద్దరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అనేక లెక్కలు.. కూడికలు వేసుకున్నారు కూడా. చట్టసభలకు వెళ్లినా.. కేబినెట్లో బెర్త్ వాళ్లకు అందని ద్రాక్షాయేనా? సమీకరణాలు ఎక్కడ తేడా కొడుతున్నాయి? కొత్త ఎమ్మెల్సీలు చాలా ఆశలే పెట్టుకున్నారా? పాత కొత్త కలిపి.. తెలంగాణ శాసనమండలికి ఇటీవల 19 మంది ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో 12 మంది.. ఎమ్మెల్యేల కోటాలో ఆరుగురు.. గవర్నర్ కోటాలో ఒకరు ఈ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం మండలిలో ఛైర్మన్, డిప్యూటీ…
వాళ్లంతా ఏపీలోని కీలక ఆలయానికి చెందిన పాలకవర్గ సభ్యులు. పైగా అధికారపార్టీ నేతలు. సమావేశాల్లో దున్నేయొచ్చని.. కనుసైగలతో శాసించొచ్చని ఎన్నో లెక్కలు వేసుకున్నారట. కానీ.. టీ.. కాఫీలకే పరిమితమై ఉస్సూరుమంటున్నారు. ఇంతకీ ఏంటా ఆలయం.. ఎవరా పాలకవర్గ సభ్యులు? పాలకవర్గ సభ్యులను పట్టించుకోవడం లేదట..! బెజవాడ ఇంద్రకీలాద్రి. ఏపీలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే కనకదుర్గమ్మ గుడిలో.. గతంలో వివాదాలు అదేస్థాయిలో ఉండేవి. ఈ ఆలయానికి 15 మంది పాలకవర్గ సభ్యులు ఉన్నారు.…
హుజురాబాద్ ఉపఎన్నికలో ఓటమికి కారణాలు అన్వేషిస్తూ కాంగ్రెస్ వేసిన కమిటీ ఏమైంది..? ఆ నియోజకవర్గంలో కమిటీ పర్యటన లేనట్టేనా..? నాయకులతో మాట్లాడి తూతూ మంత్రంగానే ముగించేయాలని నిర్ణయించారా..? హుజురాబాద్ ఓటమిపై కమిటీ వేసి 3 వారాలైంది..! హుజురాబాద్ ఉపఎన్నికలో తమ అభ్యర్థికి 3 వేల ఓట్లే రావడంపై తెలంగాణ కాంగ్రెస్లో పెద్ద దుమారమే లేపింది. పార్టీలో సీనియర్ నాయకులు.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి లక్ష్యంగా ఆరోపణలు చేశారు. ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్.. పూర్తిగా ఈటలకు…