IT and ED Raids in Telangana: తెలంగాణపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్.. ఈడీ తదుపరి టార్గెట్ ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ వైరం.. తెలంగాణలో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై సీబీఐ దృష్టి పెట్టగా.. తాజాగా గ్రానైట్ వ్యాపారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED విచారణ మొదలుపెట్టింది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ దాడులు సరేసరి. మునుగోడు ఉపఎన్నిక ముగియగానే ఈడీ విసిరిన పంజా రాష్ట్రంలో వేడి పుట్టిస్తోంది. అది పొలిటికల్గానూ అలజడికి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఐటీ, ఈడీ రైడ్స్ రాడార్ పరిధిలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు.. నాయకులు ఉండటంతో మరింత సెగలు రేపుతోంది. మంత్రి గంగుల కమాలకర్, రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి ఆఫీసులు, నివాసాలు.. వ్యాపార సంస్థల్లో ED సోదాలు తీవ్ర చర్చగా మారాయి.
Read Also: Pawan Kalyan: పవన్ కల్యాణ్ను అడ్డుకుంటోంది ఎవరు?
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
మంత్రి గంగుల, ఎంపీ రవి తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థల నజర్లో ఉన్నది ఎవరు? అనేది గులాబీ శిబిరంలో ప్రశ్న. టీఆర్ఎస్లో కీలకంగా ఉంటూ.. వ్యాపారాలు.. కాంట్రాక్టులు చేస్తున్న నాయకులపై కేంద్ర విచారణ సంస్థలు ఫోకస్ పెడతాయా? అయితే ఎవరు? ఏ అంశాలపై కూపీ లాగుతారు? ఏం చేస్తారు? ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై కొందరు ప్రజాప్రతినిధులు మల్లగుల్లాలు పడుతున్నారట. తాజా ఈడీ దాడులపై టీఆర్ఎస్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. బీసీ నేతలను లక్ష్యంగా చేసుకున్నారనే కోణంలో బీజేపీపై విమర్శలు గుప్పించారు అధికార పార్టీ నేతలు. ఇప్పటికే మహారాష్ట్ర, బెంగాల్లో జరిగిన, జరుగుతున్న ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు.. అక్కడ రాజకీయ పరిస్థితులను గమనిస్తున్న టీఆర్ఎస్ నేతలు భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం అవుతున్నారట. ఆయా రాష్ట్రాల్లో ఏం జరిగిందో అని ఆరా తీస్తున్నారట.
టీఆర్ఎస్లో ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు.. సీనియర్ నాయకులు దశాబ్దాలుగా వ్యాపారాల్లోనూ.. కాంట్రాక్ట్ పనుల్లో ఉన్నారు. ఇలాంటి వాళ్లంతా జరుగుతున్న పరిణామాలపై నిశితంగా గమనిస్తున్నారట. పైకి చెప్పకపోయినా.. ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్లో మరికొందరు ఉన్నట్టు సమాచారం. నేతలు ఒకరినొకరు కలిసినప్పుడు నెక్స్ట్ మీరే అంటే మీరే అని ఇంకొందరు జోకులు పేలుస్తున్నారట. ఈడీ కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. మరి.. కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు… చర్చకు ఆస్కారం కల్పిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!