Off The Record: రాహుల్ను, పార్టీని ఏకిపారేసినా మర్రి.. సీనియర్లు సైలెంట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనదాకా వస్తే తెలియదన్నట్టుంది కాంగ్రెస్ నేతల పరిస్థితి. ఎఐసీసీ నాయకత్వాన్ని తిట్టినా పట్టించుకునే తీరిక.. ఆలోచన లేదు. ఎవరికి వారు నాకెందుకులే అని వదిలేస్తున్నారట. తిట్టింది నన్ను కాదు కదా అనే భావన మరికొందరిది. తిట్టేవాళ్లు తిట్టని.. పడేవాళ్లు పడని అనుకుంటున్నారో ఏమో.. చివరకు రాహుల్గాంధీ మొదలుకొని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వరకు అందరినీ దూషించినా ఒక్కరిలోనూ చలనం లేదు. కాంగ్రెస్కు లాయలిస్ట్గా కొనసాగిన మర్రి శశిధర్రెడ్డి పార్టీ నుంచి వెళ్తూ వెళ్తూ రాహుల్గాంధీని, కెసి వేణుగోపాల్ను.. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డిని.. పీసీసీ చీఫ్ రేవంత్ను ఓ రేంజ్లో కడిగిపారేశారు. కాంగ్రెస్ నుంచి అదే తరహాలో మర్రిపై కౌంటర్ అటాక్ ఉంటుందని భావించారు. కానీ కాంగ్రెస్ నేతలు పిన్డ్రాప్ సైలెన్స్ పాటిస్తున్నారు. అదే పార్టీ వర్గాలకు అంతుచిక్కడం లేదట.
Read Also: Off The Record: గద్వాల టీఆర్ఎస్లో కొత్త రగడ..
Also Read
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Off The Record: మీనాక్షి నటరాజన్ అవకాశానికి గండి కొట్టింది ఎవరు? రాష్ట్ర నేతలు ఎవరైనా లీకులు ఇచ్చారా?
- Off The Record: దువ్వాడకు వైసీపీలోకి నో రీ ఎంట్రీ?.. రీల్స్ రాజా పొలిటికల్ కెరీర్ ఖతం అయినట్టేనా..?
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
తెలంగాణలో కాంగ్రెస్ని ప్రజలు నమ్మబోరని బాహటంగానే చెప్పారు మర్రి. ఉత్తమ్ హయం నుంచి కాంగ్రెస్ దెబ్బతిందన్నారు. రేవంత్ బ్లాక్మెయిల్ చేస్తారని ఆరోపించారు. అయితే ఉత్తమ్ను తిట్టారు కదా అని రేవంత్ వర్గం.. రేవంత్ను దూషించారు కదా అని ఉత్తమ్ వర్గం.. ఎవరికి వారు సర్ది చెప్పుకొంటున్నారట. రాష్ట్ర నాయకుల సంగతి ఎలా ఉన్నా.. మర్రి ఏకంగా AICC నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని విమర్శిస్తే ఎందుకు రియాక్ట్ కాలేదన్నదే ప్రశ్న. కాంగ్రెస్లో కీలక పదవుల్లో ఉన్న వారు సైతం మౌనమే. చివరకు రేవంత్, ఉత్తమ్లు సైతం పెదవి విప్పలేదు. మర్రి శశిధర్రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయారు కదా.. ఆయన విమర్శలపై స్పందించడం ఎందుకు అనుకున్నారో ఏమో.. మిగతా నాయకులు అదే ఫాలో అయినట్టు ఉన్నారు.
టీ పీసీసీకి చెప్పుకోవడానికి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు.. 13 మంది అధికార ప్రతినిధులు.. డజన్లు కొద్దీ సీనియర్లు ఉన్నారు. వాళ్లంతా కోల్డ్స్టోరేజీలోకి వెళ్లిపోయారనే కామెంట్స్ గాంధీభవన్ వర్గాల్లోనే ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ నాయకులకు పార్టీ అజెండా కంటే.. సొంత అజెండాలే ఎక్కువ. ఉన్నది పది మంది కీలక నాయకులైతే.. అందులోనూ ఐదు గ్రూపులుగా టీ కాంగ్రెస్ చీలిపోయింది. అదీ కూడా ఒక కారణమై ఉంటుందని వాదన. కీలక నాయకులు సైతం స్పందించకపోవడం వెనుక ఆంతర్యం ఏంటో శ్రేణులకు అంతుచిక్కడం లేదట. రాహుల్ను తిట్టినా స్పందించ లేనంత మొద్దుబారి పోయారని సొంత నాయకులపైనే కేడర్ సెటైర్లు వేసుకునే పరిస్థితి నెలకొంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!