Off The Record: గద్వాల టీఆర్ఎస్లో కొత్త రగడ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గద్వాల.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నడిగడ్డగా పిలిచే ప్రాంతం. ఇక్కడి రాజకీయం ఓ పట్టాన అంతుబట్టదు. రాష్ట్ర రాజకీయం అంతా ఒకలా ఉంటే గద్వాల రాజకీయం మరోలా ఉంటుంది. గతంలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలేవి. తాజాగా స్వపక్షంలోనే విపక్షం పుట్టుకొచ్చింది. అదను చూసి అప్పర్ హ్యండ్ కోసం ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్న పరిస్థితి అధికారపార్టీలో కనిపిస్తోంది. అయితే నేతల మధ్య ఆధిపత్యపోరులో నియోజకవర్గంలోని అధికారులు నలిగిపోతున్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ సరితా తిరుపతయ్యల మధ్య విభేదాలు ఓ రేంజ్లో ఉన్నాయి. అలంపూర్ నియోజకవర్గం మానవపాడు జడ్పీటీసీగా గెలిచిన సరితను టీఆర్ఎస్ జడ్పీ ఛైర్పర్సన్ చేసింది. ఆ తర్వాత గద్వాలలో పట్టు పెంచుకునేందుకు సరిత ఆమె భర్త తిరుపతయ్య ప్రయత్నించడం వర్గపోరు బీజం వేసింది.
ఎమ్మెల్యేకు వారి మధ్య గ్యాప్ తీసుకొచ్చింది. సొంత నియోజకవర్గం అలంపూర్ ఎస్సీ రిజ్వర్డ్ కావడంతో.. వచ్చే ఎన్నికల్లో గద్వాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని జడ్పీ ఛైర్పర్సన్ దంపతులు చూస్తున్నారట. వీళ్లకు జిల్లా మంత్రి నిరంజన్రెడ్డి అండగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్పర్సన్ వర్గాల మధ్య ఉప్పు నిప్పులా మారింది రాజకీయం. గద్వాలలో తమ వర్గాన్ని పెంచుకునేందుకు సరితా తిరుపతయ్యలు విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పనిలో పనిగా తమకే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారట. తమ సామాజికవర్గాన్ని ఓన్ చేసుకోవడం.. ఎమ్మెల్యేతో విభేదించే వారిని చేరదీయడం.. స్థానిక అధికారులపై పెత్తనం ఇలా చాలా ఎత్తుగడలు వేస్తున్నారు. ఇది ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డికి మింగుడు పడటం లేదు. అటు ఎమ్మెల్యే.. ఇటు జడ్పీ ఛైర్సన్ ఆదేశాల మధ్య గద్వాలలోని యంత్రాంగం నలిగిపోతోంది. తరచూ ప్రోటోకాల్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యే కంటే జడ్పీ ఛైర్పర్సన్కే ప్రొటోకాల్ ఎక్కువ. అది కూడా రెండువర్గాల మధ్య మరింత నిప్పు రాజేస్తున్నట్టు సమాచారం.
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
తాజాగా గురుకుల పాఠశాల భవనం ఓపెనింగ్ రగడ ఆ కోవలోనిదేనని చెబుతున్నారు. జడ్పీ ఛైర్పర్సన్ ముందుగా వచ్చి భవనం ప్రారంభించేశారు. తర్వాత వచ్చిన ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి.. ప్రభుత్వ అధికారి గల్లా పట్టుకున్నారు. దాంతో ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి చర్చల్లోకి వచ్చాయి. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో సిట్టింగ్లకే టికెట్ ఇస్తామని గులాబీ దళపతి కేసీఆర్ చెప్పారు. ఆ మాట తర్వాత ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ధీమాగా ఉన్నారు. కానీ.. సరితాతిరుపతయ్యలు చేస్తున్న హడావిడే కొత్త చర్చకు ఆస్కారం ఇస్తోంది. మరి… ఎన్నికల నాటికి ఈ వర్గపోరు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
https://www.youtube.com/watch?v=CNToLalBqVo
తాజావార్తలు
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
-
Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!