నచ్చిన నేతకు నీరాజనం పలికే జనాలు.. తేడా వస్తే అదేస్థాయిలో నిలదీస్తారు. ఆ ఎమ్మెల్యే విషయంలోనూ అదే జరిగింది. ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో చర్చల్లోకి వచ్చారు ఆ అధికారపార్టీ శాసనసభ్యుడు. ఎవరా ఎమ్మెల్యే? ప్రజలు ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు? ఎమ్మెల్యేకు షాక్ ఇస్తున్న జనం?టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాజకీయాల్లో రోజుకో రకంగా మారుతుంది. అలాంటి పరిస్థితినే చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్యగౌడ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్నారట. సొంత పార్టీలోనే దీనిపై జోరుగా…
ఆ నియోజకవర్గం టీడీపీలో సీటు కోసం పావులు కదిపేవారు ఎక్కువయ్యారా? నేతల మధ్య పోటీ పెరిగిందా? మాజీ ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం లేదని కొత్త నాయకుడు కావాలంటున్నారట కార్యకర్తలు. దీంతో కొత్తవాళ్లు ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం. ఆ పోటీకాస్తా రసవత్తరంగా మారిపోయింది. సొంత వ్యాపారాలపై మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ఫోకస్నెల్లూరు జిల్లా వెంకటగిరిలో టీడీపీకి బలం ఉన్నప్పటికీ సరైన నేత లేక తీవ్ర అసంతృప్తిలో ఉంది కేడర్. 2004, 2009లో ఎమ్మెల్యేగా పనిచేసిన కురుగొండ్ల రామకృష్ణ 2019లో…
చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నారు అధికారపార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు. అనుచరుడు ఏకు మేకై వ్యవహారాలు నడపటంతో తలపట్టుకున్నారట. తాజా ఘటనలో అధిష్ఠానానికి MLAలు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ పెరుగుతోందట. ఎమ్మెల్యేలకు మింగుడు పడని మేయర్ భర్త తీరునిజామాబాద్ నగరంలోని సాయినగర్లో 300 గజాల స్థలం టీఆర్ఎస్లో చిచ్చు రాజేసింది. విలువైన ఈ స్థలం కోసం అధికారపార్టీ నేతలు వీధిపోరాటానికి దిగడం.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా…
ఇప్పటి వరకు అక్కడ ఆ ఫ్యామిలీ అంతా ఒక్కటే. ఇప్పుడు సీన్ మారినట్టు కనిపిస్తోంది. ప్రత్యర్ధులు చేసే విమర్శలను సొంత ఫ్యామిలీయే చేస్తుండటంతో.. భూమా కుటుంబంలో చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీలో ఉంటున్న ఆ నేత టీడీపీ సీటుకు గురిపెట్టారనే వార్తలు వస్తున్నాయి. అందుకే సొంత ఫ్యామిలీని టార్గెట్ చేసినట్టు టాక్. భూమా అఖిల వర్సెస్ భూమా కిశోర్రెడ్డికర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మొన్నటిదాకా రోడ్ల విస్తరణలో అవినీతి జరిగిందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపణలు చేశారు.…
జిల్లాల విభజన ఆ నియోజకవర్గంలో అధికారపార్టీ నేతల మధ్య విభేదాలు తెచ్చిపెట్టింది. జిల్లా కేంద్రం కోసం జరుగుతున్న ఉద్యమాలు… ఇంకెక్కడో ప్రకంపనలు తీసుకొస్తున్నాయి. సరికొత్త వివాదాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో అంచనా వేయలేకపోతున్నారట స్థానిక నేతలు. జిల్లా కేంద్రం కోసం వైసీపీ నేతలు పోటాపోటీ ఉద్యమాలుజిల్లాల విభజన ప్రక్రియ కడప జిల్లా రాజంపేటలోని రాజకీయపక్షాల మధ్య చిచ్చుపెట్టింది. ఇప్పటి దాకా రెవిన్యూ డివిజన్గా ఉన్న రాజంపేటను జిల్లాగా కాకుండా అన్నమయ్య జిల్లా పేరుతో ఎవరూ ఊహించని విధంగా…
సీతక్క ట్రావెల్స్. సొంత నియోజకవర్గంలో కన్నా మిన్నగా.. మరో సెగ్మెంట్లో ఈ పేరు మార్మోగుతోంది. ములుగులోకంటే అక్కడ ఎక్కువగా పర్యటించడం సర్వత్రా చర్చగా మారింది. రకరకాల ఊహాగానాలు షికారు చేసేస్తున్నాయి. ఇంతకీ సీతక్క ఫోకస్ పెట్టిన కొత్త నియోజకవర్గం ఏంటి? పినపాకలో సీతక్క తరచూ పర్యటనలుములుగు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ అలజడి రేపుతున్నారు. ఈ మధ్య పినపాక నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ కొత్త చర్చకు ఆస్కారం కల్పిస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ములుగు,…
తేనే తుట్టను కదిలించడం.. తేనెటీగలతో కుట్టించుకోవడం TTD పాలకమండలికి రోటీన్గా మారిపోయింది. ఆర్జిత సేవా టికెట్ల రేట్ల పెంపు కూడా ఆ కోవలోకే చేరింది. ఆ అంశంపై ఎందుకు చర్చ ప్రారంభించారు? ఎందుకు వెనక్కి తగ్గారు? అసలేం ఏం జరిగింది? హడావిడి నిర్ణయాలు.. ఆనక వెనక్కి తగ్గడం..! తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి యూటర్న్స్ పాలకమండలిగా మారిపోతోంది. సాధ్యాసాధ్యాలను పరిశిలించకపోవడం.. కంగారుగా నిర్ణయాలు తీసుకోవడం.. ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకురావడం.. చివరికి వెనక్కి తగ్గడం ఒక ప్రహాసనంలా కనిపిస్తోంది.…
నగర అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్కే మాస్టర్ ప్లాన్ వేశారు అక్కడి అవినీతి అధికారులు. చెప్పింది చేస్తే నాకేంటి..? అని సూటిగా సుత్తిలేకుండా అడిగేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడానికి తమలోని మాటకారితనాన్ని బయటకు తీస్తున్నారు మాయగాళ్లు. ‘మాకేంటి..!?’ అని సిగ్గులేకుండా అడిగేస్తున్నారా? చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతికి ఈ సీన్ అతికినట్టు సరిపోతుంది. మున్సిపల్, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోని కొందరు అధికారులకు మాస్టర్ప్లాన్ కాసులు కురిపిస్తోంది. ప్లాన్పై అభ్యంతరాలు చెప్పే ప్రజలకు చుక్కలు…
వాళ్లంతా అధికారపార్టీని కాదని వెళ్లిపోయారు. ఇప్పుడు తిరిగొచ్చేస్తారని ప్రచారం ఊపందుకుంది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఎమ్మెల్యేకు టెన్షన్ పట్టుకుందట. పైకి ధీమాగా కనిపిస్తున్నా.. వారొస్తే తన పరిస్థితి ఏంటనే లెక్కల్లో ఉన్నారట ఎమ్మెల్యే. అది ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఎమ్మెల్యే సురేందర్లో గుబులు?ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అదిగో తోక అంటే.. ఇదిగో పులి అన్నట్టుగా రకరకాల ప్రచారాలు షికారు చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ను వీడి వెళ్లిన పలువురు…
వాళ్లిద్దరి మాట వేరు.. బాట వేరు. మొన్నటి వరకు ఒకేపార్టీలో ఉన్నా.. ఎన్నికలకు ముందు వేర్వేరు పార్టీల్లో ఉండిపోయారు. ఇప్పుడు సడెన్గా వారిద్దరి మాట-బాట కలిసింది. అది అంతవరకే పరిమితం అవుతుందా? అంతకుమించి ఇంకేమైనా ఉంటుందా అనే ఆసక్తి మొదలైంది. ఇంతకీ ఎవరా నేతలు..? కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కలిపిందా? టీడీపీలో కీలక నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి…