Off The Record: వరంగల్ పశ్చిమలో రాజుకుంటున్న వేడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో నియోజకవర్గాల్లో పొలిటికల్ సెగలు రాజుకుంటున్నాయి. పగలు.. సెగలు పెరుగుతున్నాయి. అంశం చిన్నదైనా.. పెద్దదైనా ప్రత్యర్థిని ఇరుకున పెట్టడానికి చూస్తున్నారు నేతలు. పోలీస్ కేసులు పెట్టుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. వరంగల్ పశ్చిమలోనూ ఇదే జరగడంతో ఓరుగల్లు రాజకీయం కాక రేపుతోంది.
ఇద్దరి మధ్య రాజకీయ రచ్చ.. పోలీసులకు ఫిర్యాదు
ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్రెడ్డి మధ్య కొంతకాలంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉప్పు నిప్పుగా ఉంది రాజకీయం. వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ ప్రత్యర్థులుగా తలపడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పైగా ఇద్దరిలోనూ కొన్ని సారూప్యతలు ఉండటంతో మరింత వేడెక్కుతోంది నియోజకవర్గం. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు. నాయిని సైతం కాంగ్రెస్పార్టీ జిల్లా ప్రెసిడెంట్. ఇటీవల ప్రజా సమస్యల పేరుతో కాంగ్రెస్ చేపట్టిన నిరసనతో అగ్గి రాజుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యను టేకప్ చేశారు నాయిని. అర్హులైన లబ్ధిదారులకు వాటిని కేటాయించడం లేదనేది ఆయన ఆరోపణ. ఆ రగడ చినికి చినికి గాలివానిగా మారి.. పోస్టర్ల యుద్ధంగా తెరపైకి వచ్చింది. అక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో.. పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
Also Read
పశ్చిమలో కాంగ్రెస్ బలపడిందనే అంచనాల్లో నాయిని
వరంగల్ వెస్ట్ నుంచి గత నాలుగు పర్యాయాలుగా వినయ్భాస్కర్ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి అవుతాననే ఆశ పెట్టుకున్నారు. అందుకే నియోజకవర్గంలో పట్టు సడలకుండా పావులు కదుపుతున్నారు. జనాలను కలవడం.. వారి సమస్యలు వినడం.. అక్కడిక్కడే పరిష్కారాలు వెతకడం చేస్తున్నారు ఎమ్మెల్యే. అయితే వినయ్ భాస్కర్ వరుసగా గెలుస్తుండటంతో ఆయనపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందనేది కాంగ్రెస్ వర్గాల భావన. దానిని క్యాష్ చేసుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. వచ్చే ఎన్నికల్లో తానే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని గట్టి ధీమాతో ఉన్న నాయిని రాజేందర్రెడ్డి ఎమ్మెల్యేపై నేరుగా బాణాలు ఎక్కు పెడుతున్నారు. గతంలో రాహుల్ గాంధీ సభను ఇదే నియోజకవర్గంలో నిర్వహించడంతో.. అప్పటి నుంచి పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడిందనే లెక్కలు వేస్తున్నారు నాయిని. గత ఎన్నికల్లో పోటీ చేద్దామని అనుకున్నా.. పొత్తుల్లో భాగంగా సీటు వదులుకోవాల్సి వచ్చింది. ఈ దఫా మాత్రం అలాంటి పొత్తు సంకేతాలు లేకపోవడం.. ఎలాగైనా పోటీ చేయాలనే పట్టుదలతో వ్యూహాలకు పదును పెడుతున్నారు.
కోవర్టుల పనిగా నాయిని అనుమానం
ఈ రాజకీయ పోరులో రెండు వర్గాల మధ్య కౌంటర్లు పేలుతున్నాయి. ఇంతలో నాయినిని లక్ష్యంగా చేసుకుని కొందరు వాల్ పోస్టర్లు వేశారు. వాటిల్లో నాయినిపై పలు ఆరోపణలు చేయడంతో పరిస్థితి వేడెక్కింది. ఈ పోస్టర్ల వెనుక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హస్తం ఉందని అనుమానించిన ఆయన.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీలోని కొందరు కోవర్టులుగా మారి.. బీఆర్ఎస్కు సహకరిస్తున్నారని సందేహిస్తున్నారు. పనిలో పనిగా ఎమ్మెల్యేకు ఆయన సవాళ్లు విసిరారు. వాటిని వినయ్ భాస్కర్ లైట్గా తీసుకోవడంతో.. పశ్చిమలో ఇద్దరి మధ్య రగడ ఇప్పట్లో ఆగబోదని.. ఎన్నికల వరకు కొనసాగుతుందని అనుకుంటున్నారట.
తాజావార్తలు
-
IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
-
Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
-
Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!