రాజకీయాల్లో 40ఏళ్లకు పైగా ఉన్న సీనియర్ నేత. ఆయనతో రాజకీయ ప్రస్ధానం మొదలు పెట్టిన నాయకులు సీఎంలై.. మంత్రులై చక్రం తిప్పారు. ఆయనకు మాత్రం మంత్రి పదవి అందని ద్రాక్షగా మారింది. ఆయన గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదు.. పార్టీ అధికారంలోకి వస్తే ఆయన గెలవరు. ప్రస్తుతం పార్టీ మారి అధికారపార్టీ పంచన చేరారు. ఈసారైనా మంత్రి పదవి వరిస్తుందా? అసలు ఆయన అలాంటి ఆశలు పెట్టుకున్నారా? ఇంత వరకు మంత్రి కాని కరణం బలరాంకరణం బలరాం.…
ఆ నియోజకవర్గంలో ఏ నాయకుడికి జెండా పట్టాలో.. ఎవరి సైకిల్ ఎక్కాలో కేడర్కు అర్థం కాని పరిస్థితి. పోటీకి సిద్ధమైన అభ్యర్థులు మాత్రం బస్తీమే సవాల్ అని గ్రూపులు కట్టి కొట్టుకుంటున్నారు. అధిష్ఠానం మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా.. అక్కడి లెక్కలు తేల్చకుండా కాలక్షేపం చేస్తున్నట్టు తమ్ముళ్ల అనుమానం. అసలు ఆ నియోజకవర్గంలో ఎందుకు అంత గందరగోళం? హైకమాండ్ లెక్కలేంటి? వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరో తేల్చలేని పరిస్థితి గుంటూరు జిల్లాలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన…
ఆ ఇద్దరు నేతలు జిల్లాలో టీడీపీకి కీలకం. కానీ.. ఒకరంటే ఒకరికి గిట్టదు. పార్టీ కష్టకాలంలో ఉన్న టైమ్లోనూ ఆధిపత్య పోరాటమే. బడానేతలు తెరవెనక చేస్తున్న కుట్రలతో 3 నియోజకవర్గాల్లో గ్రూపుల గోడవలు తారాస్థాయికి చేరాయి. ఆ నాయకలు ఎవరో.. ఆ నియోజకవర్గాలేంటో..ఈ స్టోరీలో చూద్దాం. మూడు నియోజకవర్గాల్లో కోల్డ్వార్శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ కంచుకోటలు గత ఎన్నికల్లో మంచులా కరిగిపోయాయి. పది నియోజకవర్గాల్లో సైకిల్కు దక్కింది రెండే. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధికార వైసీపీదే హవా. అయినప్పటికీ…
త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అని ముఖ్యమంత్రి స్పష్టంగా తేల్చి చెప్పేయటంతో బెర్త్ కోసం కొందరు, ఎర్త్ పడకుండా మరి కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ కోర్ట్ టీమ్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కేబినెట్లో కొందరు ఇళ్లకువైసీపీలో మంత్రి పోస్ట్ కోసం లాబీయింగ్ పతాకస్థాయికి చేరింది. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడే పదవీకాలం రెండున్నర ఏళ్లు అని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు స్పష్టంగా చేప్పేశారు. మంత్రివర్గాన్ని దాదాపుగా పునర్వ్యస్థీకరించి కొత్తవారికి అవకాశం కల్పిస్తామన్నారు. అధినేత చెప్పిన సమయం రానే…
ఎమ్మెల్యే రోజాకు భక్తి ఎక్కువే. తీరిక దొరికితే ఆలయాలు సందర్శిస్తారు. ఈ మధ్య ఆ దైవభక్తి మరీ ఎక్కువైందని టాక్. ప్రముఖ దేవస్థానాలే కాదు.. మారుమూల ప్రాంతాల్లో అమ్మవారు ఆవహిస్తారని.. అక్కడ ప్రశ్నకు తిరుగులేదని తెలిస్తే చాలు వెంటనే వాలిపోతున్నారు. ఇదంతా అంబను పలికించి.. అధిష్ఠానం ఆశీసులు పొందేందుకేనా? కేబినెట్లో చోటు కోసం రోజా ఆశలు రెట్టింపుఅధికారపార్టీ వైసీపీలో ఫైర్బ్రాండ్ ఎమ్మెల్యే రోజా. చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. శాసనసభ్యురాలిగా మొదటి టర్మ్…
సర్వేలలో కొందరు ఎమ్మెల్యేలు వెనకపడ్డారనే ప్రచారం ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్లో కాక రేపుతోంది. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్లను మార్చేస్తారనే ఆలోచనలతో.. కొందరు పార్టీ నేతలు కర్చీఫ్లు వేసుకునే పనిలో పడ్డారు. కార్యక్రమాల స్పీడ్ పెంచి.. అధిష్ఠానం దృష్టిలో పడేందుకు నానాపాట్లూ పడతున్నారట. పోటీకి సిద్ధమని సంకేతాలు పంపుతున్నారట. ఐదు చోట్ల సిట్టింగ్లపై వ్యతిరేకత ఉందని ప్రచారంవచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ క్రమంగా స్పీడ్ పెంచుతోంది. ఆశావహుల జాబితా కూడా ఎక్కువగానే ఉంది. ఇంతలో…
ఖాళీ జాగా కనిపిస్తే హాంఫట్..! కబ్జాల యవ్వారం పార్టీ పెద్దల వరకు వెళ్లిందట. సమస్య శ్రుతిమించడంతో హైకమాండ్ క్లాస్ తీసుకుంది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి అక్కడి టీఆర్ఎస్ రాజకీయం వేడెక్కిందట. ఆదిలాబాద్లో స్థానిక ప్రజాప్రతినిధుల కబ్జాలుఇటీవల నిర్మల్ మున్సిపల్ వైస్చైర్మన్ ఓ బాలికపై అత్యాచారం కేసులో అరెస్ట్ కావడం చర్చగా మారింది. అప్పటి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కౌన్సిలర్ల పనితీరుపై పార్టీ అధిష్ఠానం ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోందట. ఆ క్రమంలోనే ఆదిలాబాద్…
నిధులు లేకున్నా పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారట ఆ ఎమ్మెల్యే. వాటికి భారీగా ప్రచారాలు చేసుకోవడం ఇప్పుడు చిక్కొచ్చి పడింది. స్వపక్షానికి.. విపక్షాలకు ఆ ఎమ్మెల్యే టార్గెట్ అయ్యారు. కాసులు లేకుండా కితకితలెందుకని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట. ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. నిధులు లేకుండా అభివృద్ధి పనులకు భూమి పూజలుయాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ప్రస్తుతం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారారు. ఈ మధ్య ఆలేరులో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.…
ఆ జిల్లాలోని అధికార వైసీపీలో గ్రూపుల గోల పెరిగిపోతోంది. ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి అసంతృప్తి గళాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఆ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో తారాస్థాయిలో విభేదాలు ఉన్నాయి. అధినాయకత్వంపై విధేయత ప్రకటిస్తూనే.. ఎమ్మెల్యేలపై మండిపడుతున్నారు అసమ్మతి వాదులు. ఎచ్చెర్లలో ఎమ్మెల్యే కిరణ్పై కేడర్ రుసరుసలుశ్రీకాకుళం జిల్లా వైసీపీలో అంతర్గత కలహాలు భగ్గుమంటున్నాయి. రహస్య సమావేశాలు కాస్త బహిరంగ మీటింగ్స్గా మారుతున్నాయి. ఎమ్మెల్యేలతోపాటు, నియెజకవర్గ ఇంఛార్జ్లపై అసమ్మతి రాగం వినిపిస్తోంది కేడర్. పార్టీ కోసం…
అక్కడ టీడీపీ లీడర్లకు కొదవ లేదు. కానీ.. వారిపై కేడర్కే క్లారిటీ లేదు. ఎవరు పార్టీని లీడ్ చేస్తారో.. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థెవరో తెలియక సతమతం చెందుతున్నారట. ఎవరివైపు వెళ్లాలో తేల్చుకోలేక అయోమయంలో ఉన్నారట తమ్ముళ్లు. కావలిలో టీడీపీ కేడర్కు దిశానిర్దేశం లేదా?ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం కావలి. అలాంటిచోట సైకిల్ పార్టీని నడిపించే నాయకుడు కరువయ్యాడు. వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి కోసం అన్వేషణ మొదలైంది. బీద మస్తానరావు పార్టీని వీడి వెళ్లాక…