Off The Record: కర్నూలు జిల్లా కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల సరిహద్దుల మధ్య హంద్రి నదిపై కాజ్వే, రహదారి నిర్మాణం… ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టింది. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మధ్య ఈ వంతెన నిర్మాణం విషయంలో విభేదాలు తలెత్తాయి. ఈ పంచాయితీని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తీర్చాల్సి వచ్చిందట. కోడుమూరు మండలం గోరంట్ల- పత్తికొండ నియోజకవర్గం ఎస్.హెచ్. ఎర్రగుడి మధ్య హంద్రీనదిపై 330 మీటర్ల పొడవునా కాజ్ వే, కొత్తపల్లి…
Off The Record about BJP Floor Leader in Telangana Assembly: తెలంగాణ శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వివరణ ఇవ్వాలని నోటీసులు ఇస్తే… వాటికి రిప్లై కూడా ఇచ్చారు. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు బీజేపీ జాతీయ నాయకత్వం స్పందించలేదు. సస్పెన్షన్ ఎత్తేస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ అది కూడా జరగలేదు. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో బీజేపీకి పార్టీ ఫ్లోర్…
Off The Record: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ప్రసంగిస్తారు.అయితే గతేడాది సాంకేతిక కారణాలతో గవర్నర్ స్పీచ్ లేకుండా బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఇక ఈ మధ్య కాలంలో గవర్నర్కు, రాష్ట్ర సర్కార్కు మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇద్దరి మధ్య విమర్శల తీవ్రత కూడా అంతే స్థాయిలో ఉంటూ వచ్చింది. ప్రస్తుతం ప్రసంగంపై కుదిరిన సయోధ్యతో…
Off The Record: వైసీపీలో అసమ్మతి గళాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో లుకలుకలు ఓ రేంజ్లో రచ్చకెక్కుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి… ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, ఈ వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్గా తీసుకోవడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. వెంకటగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఆనంను తప్పించి… నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని నియమించింది. ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజవర్గం వంతు వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి…
Off The Record: ఒకప్పుడు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్రెడ్డికి అనుంగుడుగా ఆయన సమీప బంధువు గంగవరం శేఖర్రెడ్డి ఉన్నారు. అయితే కొంతకాలంగా ఆయన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేని కాదని నియోజకవర్గంలో సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే వల్ల నష్టపోయిన, నిర్లక్ష్యానికి గురైన నేతలను దగ్గరకు తీసుకుని వర్గం ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే అసమ్మతి నేతల వర్గానికి ఆయనే నాయకత్వం కూడా వహిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా గంగవరం శేఖర్రెడ్డి నియోజకవర్గంలో తన…
Off The Record: అచ్చంపేట బీఆర్ఎస్లో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా రాజకీయం నడుస్తోంది. తమ రాజకీయ ప్రయాణానికి అడుగడుగునా స్పీడ్ బ్రేకర్గా మారిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు టార్గెట్గా ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తూ… వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలవడం ఖాయమని చెప్పుకొస్తున్నారు. దీంతో అచ్చంపేట గులాబీ పార్టీ రెండు వర్గాలుగా చీలినట్లు కనిపిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ చైర్మన్ పీఠం… అచ్చంపేట నియోజకవర్గ…
ఇదే అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గం. కోఆపరేటివ్ సొసైటీలకు ఎన్నికలు లేకపోవడంతో వేస్తున్న త్రిసభ్య కమిటీలు ఇక్కడ అధికార వైసీపీ ప్రజాప్రతినిధికి కాసులు కురిపిస్తున్నాయట. ఇందుకోసం అధికారులపై తీవ్రస్థాయిలో ఆ నేత ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అంతేకాదు.. త్రిసభ్య కమిటీలో చోటు కల్పించేందుకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. త్రిసభ్య కమిటీలో ఒకరిని ఛైర్పర్సన్గా ఎన్నుకునేందుకు కూడా చెయ్యి తడపాల్సిందేనట. ఈ అంశంపై నియోజకవర్గంలో ఓ రేంజ్లో చర్చ జరుగుతోంది. Read Also:…
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల బిజీలో పడింది. సమయం దగ్గర పడుతుండటంతో.. పార్టీని సమరానికి సిద్ధం చేసే పనిలో పడ్డారు నాయకులు. ఎన్నికల కోసమే కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్లకు వ్యూహకర్తగా ఉన్నారు సునీల్ కనుగోలు. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహన్ని ఆయన పార్టీకి అందజేశారట. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు.. పార్టీ బలాబలాలు తదితర అంశాలపై నేరుగా కాంగ్రెస్ హైకమాండ్కే ఆయన రిపోర్ట్ ఇచ్చారట. తెలంగాణలో కాంగ్రెస్ బలంగానే ఉందని ఆయన తన నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం. ఈ…
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పారు. 1994, 1999లో నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే. ప్రస్తుతం బీజేపీ నాయకుడు. సొంత పార్టీని విమర్శించకుండానే సంగమేశ్వరం వద్ద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఐకానిక్ వంతెనను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేపట్టబోతున్నారు. అక్కడ బ్రిడ్జి కం బ్యారేజి నిర్మించాలనేది ఆయన డిమాండ్. ఈ ఉద్యమం వెనుక కండువా మార్చే ఎత్తుగడ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీకి గుడ్బై చెప్పి తిరిగి టీడీపీలోకి వెళ్లే అవకాశాలు…
కొంత కాలంగా గవర్నర్, తెలంగాణ సర్కార్ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఈ దూరం కారణంగా బడ్జెట్ ఆమోదించలేదని హైకోర్టు తలుపు తట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పరిణామాల్లో వచ్చిన మార్పుతో గవర్నర్, రాష్ట్ర సర్కార్ మధ్య సయోధ్య కుదిరింది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గవర్నర్ తమిళిసై తీరుపై అధికార BRS పార్టీ నాయకులు కొంతకాలంగా భగ్గుమంటున్నారు. రాజ్భవన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సీన్ మారడంతో గవర్నర్ విషయంలో అధికారపార్టీ నేతల…