మహిళలు బయటకు వచ్చే వరకు ప్రభుత్వం స్పందించలేదు: రాజధాని మహిళలను కించపరిచేలా జర్నలిస్ట్ అని చెప్పుకునే కృష్ణంరాజు నీచంగా మాట్లాడారని కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. నాలుగేళ్లు అలుపెరగని పోరాటం చేసిన మహిళలను దూషిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరలా మహిళలు పోరాటం చేయాల్సిన పరిస్థితికి తెచ్చారన్నారు. ఇంత జరిగినా రాజధాని మహిళలు బయటకు వచ్చే వరకు ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను…
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో గత 10-15 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్స్ పూర్తిగా నిండిపోయి.. వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న 88,257 మంది భక్తులు శ్రీవారిని…
భూమి కబ్జా చేశారని జవాన్ సెల్ఫీ వీడియో: తన భూమి కబ్జా చేశారని మడకశిరకు చెందిన ఓ జవాన్ జమ్మూ కాశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. మడకశిర మండలం హుదుగూరు గ్రామంలో కబ్జాదారుల నుంచి తన భూమిని కాపాడాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా అధికారులను వేడుకున్నారు బిఎస్ఎఫ్ జవాన్ నరసింహమూర్తి. జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న తన భూమి గ్రామంలోని తన మామ కబ్జా చేస్తున్నాడని ఆరోపించాడు. తన భూమిలో సాగు…
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం: మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్డులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. పెద్ద బండరాయిని ఢీ కొట్టి బస్సు నిలిచిపోవడంతో 30 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని జగదల్ పూర్ కు పెళ్లి బృందం వెళ్లి వస్తుండగా అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. చక్రాలు లోయలోకి…
మాజీ ఎమ్మెల్యే బోల్డ్ కామెంట్స్: వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రజలు ఈ ప్రభుత్వ పాలనపై విసుగుతో ఉన్నారని, మాటలతో మోసగిస్తున్నారని స్పష్టం చేశారు. అలాగే శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రాప్తాడు సిద్ధం సభకు వచ్చిన ప్రజల సంఖ్యను చూసిన తర్వాత కూడా కొందరు టీడీపీ మహానాడు సమావేశంతో పోల్చడం హాస్యాస్పదం. మేము నిర్వహించిన సభకు జనాలు స్వచ్ఛందంగా…
తీరం దాటిన వాయుగుండం: రాష్ట్ర వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత పశ్చిమ బెంగాల్ – దక్షిణ ఛత్తీస్గఢ్ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 40–50 కి.మీ. వేగంతో…
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పటికప్పుడు వాళ్ళ కోసమే ఆగుతోందా..? ఏం చేయాలో… ఎలా డీల్ చేయాలో అర్ధం అవకపోవడమే అసలు సమస్యా? ఒకే కుటుంబం నుంచి ఇద్దర్ని కేబినెట్లోకి తీసుకోవడం సాధ్యమేనా..? ఎన్నాళ్ళని వాళ్ళిద్దరి పేరుతో నానుస్తారు? ఫైనల్గా బ్రదర్స్ లొల్లిని కాంగ్రెస్ అధిష్టానం ఎలా డీల్ చేయబోతోంది? ఎవరా సోదరులు? వాళ్ళ వల్ల పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం అన్నట్టు తయారైందట తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. మరీ…
ఆ టీడీపీ ఎమ్మెల్యే నోట సిట్ మాట ఎందుకు వచ్చింది? మాజీ మంత్రిని బెదిరించడానికా? లేక అసలా దిశగా అడుగులు పడుతున్నాయా? ఎమ్మెల్యే అన్న మాటలే నిజమైతే… ఆ ఎక్స్ మినిస్టర్ పరిస్థితి ఏంటి? ఎవరామె? ఆమెను టార్గెట్ చేసిన సిట్టింగ్ శాసనసభ్యుడు ఎవరు? ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నేతలకు గడ్డు కాలం ఎదురైందా అంటే… అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. జిల్లాలో ఉన్న సీనియర్స్ అంతా.. ఏదో ఒక అవినీతి అక్రమాల కేసులో ఇరుకున్నవారే. ఎమ్మెల్యే…
తెలంగాణ బీజేపీలో క్రమశిక్షణ కట్టు తప్పుతోందా? విషయం ఏదైనాసరే… ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ చేసేస్తున్నారా? నోరు అదుపులో పెట్టుకోమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి నాయకులకు వార్నింగ్ ఇచ్చింది నిజమేనా? అదుపు.. అదుపు… మాట పొదుపని సూటిగా సుత్తిలేకుండా చెప్పేశారా? ఇంతకీ టీజీ బీజేపీలో ఏం జరుగుతోంది? కిషన్ ఆ స్థాయికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? పార్టీ లైన్ దాటొద్దు…., సొంత అజెండాలతో ఎవ్వరూ మాట్లాడవద్దు. సబ్జెక్ట్ ఏదైనా, మాట్లాడేది ఎవరైనా… పార్టీ వాయిస్ ఉండాలే…
టీడీపీ నాయకుల హత్యలకు పిన్నెల్లికి ఏంటి సంబంధం?: తెలుగుదేశం నాయకుల హత్యలకు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఏంటి సంబంధం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రహనించారు. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన స్కార్పియోపై జేబీఆర్ అని ఉందని.. జేబీఆర్ అంటే జూలకంటి బ్రహ్మారెడ్డి కానీ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కాదన్నారు. హత్యకు గురైన వారి బంధువులు కూడా తెలుగుదేశం నాయకులే చంపారని చెప్పారని.. కానీ ఈ హత్యలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామి…