ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం మొదటిరోజు ఘనంగా ముగిసింది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు.
కార్తిక మాసం వచ్చిందంటే చాలు అందరి దృష్టి హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంవైపే వెళ్తుంది. ఎందుకంటే ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవమే కారణం. వేలసంఖ్యలో భక్తులు వచ్చి కోటిదీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగిస్తారు.. ఇక, కుదరని వాళ్లు ఎన్టీవీ, భక్తి టీవీల్లో లైవ్లో వీక్షిస్తుంటారు.. ఈ ఏడాది కోటి దీపోత్సవం ఈ రోజే ప్రారంభమైంది. కోటిదీపోత్సవం-2024 మొదటి రోజు శంఖారావంతో ప్రారంభమైంది.
కార్తీక మాసంలో ప్రతీ ఏటా కోటి దీపోత్సవాన్ని.. అశేష భక్తవాహిణి మధ్య నిర్వహిస్తూ వస్తోంది భక్తి టీవీ.. లక్ష దీపోత్సవంతో ప్రారంభమై.. కోటి దీపోత్సవంగా మారిన ఈ దీపాల పండగను రచన టెలివిజన్ లిమిటెడ్ ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహిస్తోంది.
2012లో లక్షదీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపయజ్ఞం.. 2013లో కోటిదీపోత్సవమై.. పుష్కరకాలంగా భక్తుల మదిలో అఖండజ్యోతిగా వెలుగొందుతోంది. ఈ ఏడాది సైతం రండి.. తరలిరండి అంటూ మరోమారు ఆహ్వానం పలుకుతోంది.
డైలీ సీరియల్లో సస్పెన్స్ సీన్ లను తలపించేలా అక్కడి రాజకీయాలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు వైసిపి కోర్టులో ఉన్న బాల్.. టిడిపి వైపు వెళ్ళింది. ఆ తర్వాత అదే బాల్ మళ్ళీ వైసిపి కోర్టులోకి వచ్చింది. ఇప్పుడు ఎత్తులకు పైఎత్తు వేస్తూ…టిడిపి వేసిన వ్యూహంలో వైసిపి చిక్కుకుందా…? పొలిటికల్ టూర్లను తలపించే విధంగా క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయా ? ఎన్నికలు లేని సమయంలో క్యాంప్ రాజకీయాలు ఏంటి ? ఎన్నికలు లేవు. ఓటింగ్ అసలే లేదు. అయినా…
ఆ పార్టీ నేతలు…పైకి మాత్రం మేమంతా ఐక్యంగా ఉన్నామని చెప్పుకుంటారు. లోపల మాత్రం ఎవరికీ వారే…యమునా తీరే. ఒకరి రిస్క్లోకి ఇంకొకరు రారు…వైరి పక్షం నుంచి విమర్శలు వచ్చినా…అసలు పట్టించుకోరు. అరోపణలను తిప్పికొట్టడానికి ప్రయత్నించరు. విమర్శలు ఎదుర్కొన్న నేతలే…చివరికి కౌంటర్ ఇచ్చుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది ? రాజకీయాల్లో పార్టీలు, నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు కామన్. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం…పాలిటిక్స్లో నిత్యం జరిగేదే. పార్టీలపై ప్రత్యర్థులు ఏవైనా ఆరోపణలు, విమర్శలు చేస్తే…వాటిని ఇంకో పార్టీ తిప్పి…
తెలంగాణలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీల ఎన్నికలకు పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు..ఎవరి వ్యూహాలో వారి మునిగిపోయారు. మరి ప్రతిపక్ష బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ? గ్రాడ్యూయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా ? లేదంటే ఎన్నికలకు దూరంగా ఉంటుందా ? కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ సారి పోటాపోటీగా ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నడుస్తోంది. 2019 మార్చిలో జరిగిన…
ఉమ్మడి ప్రకాశం వైసీపీలో భారీ మార్పులే జరగబోతున్నాయా? ఆ దిశగా పార్టీలో కసరత్తు జరుగుతోందా? ఎన్నికల టైంలో నియోజకవర్గాలు మారిన నేతలు కొత్త స్థానాలు మాకొద్దు బాబోయ్…. అని మొత్తుకుంటున్నారా? అలా సేఫ్ జోన్ వెదుక్కుంటున్న నాయకులు ఎవరు? జిల్లాలో ఎలాంటి మార్పులకు అవకాశం ఉంది? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్క ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్ మినహా… మిగతా 11 చోట్ల కొత్త అభ్యర్థుల్నే బరిలో దింపింది వైసీపీ. కానీ… కేవలం దర్శి, యర్రగొండపాలెంలో మాత్రమే గెలవగలిగింది.…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్రకు ఫిక్స్ అయ్యారా? పర్సనల్ ఇమేజ్తో పాటు పార్టీని నిలబెట్టడానికి అదే కరెక్ట్ మెడిసిన్ అని క్లారిటీకి వచ్చేశారా? కానీ… అంతకు మించి ఆయన ఇంకేదో ఆశిస్తున్నారన్న విశ్లేషణల్లో వాస్తవం ఉందా? పైకి చెప్పేవన్నీ కాదు, అసలు సీక్రెట్ అదేనన్న వాదన ఎందుకు బలపడుతోంది? కేటీఆర్ పాదయాత్ర సెంట్రిక్గా…. సీక్రెట్స్ పేరుతో జరుగుతున్న కొత్త చర్చ ఏంటి? రాజకీయ నాయకుల పాదయాత్రల పరంపరలో మరో కొత్త టూర్ మొదలవబోతోందా అంటే… యస్…