ఈరోజు న్యూజిలాండ్, ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పై టీం ఇండియాతో పాటు భారత అభిమానులు మొత్తం ఆశలు పెట్టుకున్నారు. ఈ మ్యాచ్ లో ఆఫ్మఘం గెలవాలని అనుకున్నారు. కానీ ఈ మ్యాచ్ లో ఎట్టకేలకు న్యూజిలాండ్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘన్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 ఒరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో నజీబుల్లా ఒక్కడే 73 పరుగులతో రాణించాడు.…
టీ20 ప్రపంచకప్లో ప్రస్తుతం టీమిండియా ఆశలన్నీ అప్ఘనిస్తాన్ చేతుల్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఆదివారం న్యూజిలాండ్తో జరగనున్న మ్యాచ్లో అప్ఘనిస్తాన్ గెలిస్తేనే భారత్ సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేకపోతే సోమవారం నాటి నమీబియా-భారత్ మ్యాచ్ నామమాత్రంగా మారుతుంది. ముఖ్యంగా న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో నలుగురు అఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు రాణించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. Read Also: నేడే న్యూజిలాండ్తో అఫ్గానిస్తాన్ మ్యాచ్..భారత్ కు అగ్ని పరీక్ష ! అప్ఘనిస్తాన్ జట్టుకు రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్, మహ్మద్…
ఇవాళ న్యూజిలాండ్పై అఫ్గానిస్తాన్ గెలుస్తుందా? భారత్ సెమీస్ ఆశలు నిలుస్తాయా? సగటు భారత అభిమాని ఇప్పుడు ఈ మ్యాచ్ ఫలితం కోసమే ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ కివీస్ చేతిలో అఫ్గాన్ ఓడితే టీమిండియా సెమీస్ అశలు గల్లంతైనట్లే. టీ-20 వరల్డ్ కప్లో భారత్ సెమీస్కు వెళ్లాలంటే ఇప్పుడు మరో ప్రత్యర్థి జట్టు గెలవాలనునే పరిస్థితి వచ్చింది. పాక్, కివీస్తో జరిగిన రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో భారత్ సమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ తరుణంలో అఫ్గాన్, స్కాట్లాండ్పై…
ఒకవైపు టీ20 ప్రపంచకప్ జరుగుతుండగానే.. మరోవైపు భారత పర్యటనకు న్యూజిలాండ్ జట్టు సన్నద్ధమవుతోంది. నవంబర్ 17 నుంచి టీమిండియాతో మూడు టీ20లతో పాటు మూడు టెస్టులను ఆ జట్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్లను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రెండు ఫార్మాట్లకు కేన్ విలియమ్సన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. టెస్టులకు ప్రధాన బౌలర్ ట్రెంట్ బౌల్ట్కు సెలక్టర్లు విశాంత్రి ఇచ్చారు. Read Also: వెల్లివిరిసిన మతసామరస్యం.. రాముడికి ముస్లిం మహిళల హారతి టీ20 జట్టు:…
టీ20 ప్రపంచకప్లో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని జట్ల కంటే ముందుగా దుబాయ్ చేరుకుని ఐపీఎల్ మ్యాచ్లు ఆడటం ద్వారా పిచ్లపై అవగాహన ఉన్న టీమిండియా క్రికెటర్లు దారుణంగా ఆడుతున్నారని పలువురు క్రికెట్ విశ్లేషకులు మండిపడుతున్నారు. పటిష్టమైన పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లపై ప్రణాళిక ప్రకారం ఆడకుండా కోహ్లీ సేన భారీ మూల్యం చెల్లించుకుందని విమర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి టీమిండియాకు సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారినా.. పూర్తిగా అయితే దారులు మూసుకుపోలేదు. టీమిండియా సెమీస్ చేరాలంటే…
టీ20 ప్రపంచకప్లో గ్రూప్-2లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. టీమిండియా విధించిన 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 14.3 ఓవర్లలో కివీస్ చేధించింది. ఆల్రౌండర్ డారిల్ మిచెల్ (49), కెప్టెన్ విలియమ్సన్ (33 నాటౌట్) రాణించి తమ జట్టుకు…
టీ20 ప్రపంచకప్లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా తడబడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి న్యూజిలాండ్ తొలుత భారత్కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లుగా వచ్చిన ఇషాన్ కిషాన్ (4), కేఎల్ రాహుల్ (18) చెత్త షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ (14), కోహ్లీ (9) కూడా వారినే అనుకరించారు. దీంతో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రిషబ్ పంత్ (12), హార్డిక్ పాండ్యా (23), జడేజా…
టీ20 ప్రపంచకప్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. కాసేపట్లో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుండగా… ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాకిస్థాన్తో ఆడిన తొలి మ్యాచ్లోనూ కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ను ఓడిపోయాడు. ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మరి ఈ మ్యాచ్లో ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. భువనేశ్వర్ స్థానంలో శార్దూల్…
ఈరోజు భారత జట్టు న్యూజిలాండ్ తో ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ లో తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య ఆడితే మన జట్టుకు ప్రమాదం అని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే హార్దిక్ పాండ్య తన భారత కెరీర్ను కాపాడుకోవడానికి ఇప్పుడు ఆడుతున్నాడు. మేము హార్దిక్ను నెట్స్లో చూశాము. అయితే అతను దాదాపు రెండు నెలలుగా బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేయలేదు. అలంటి…
దుబాయ్ వేదికగా కాసేపట్లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక సమరం జరగనుంది. టీ20 ప్రపంచకప్లో ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాంటిది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీస్కు వెళ్లే అవకాశాలున్నాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం టీమిండియాను భయపెడుతున్నాడు. కొన్నేళ్లుగా టీమిండియా ఆడుతున్న నాకౌట్ మ్యాచ్లలో అతడు నిలబడితే చాలు.. ఆ మ్యాచ్లో టీమిండియా ఓటమి తథ్యం అన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకీ అతడు ఎవరంటే అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో. Also Read: భారత్-కివీస్…