న్యూజిలాండ్ సిరీస్ కు జట్టును ఎంపిక చేసిన బీసీసీఐ.. కెప్టెన్ ఎవరంటే…?
యూఏఈ లో బీసీసీఐ నిర్వహిస్తున్న ఐసీసీ ప్రపంచ కప్ నుండి భారత జట్టు నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 17 నుండి టీం ఇండియా న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో తలపడనుండగా… దానికి తాజాగా జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ప్రపంచ కప్ ముగిసిన వెంటనే టీ20 ఫార్మటు లో కోహ్లీ కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో ఆ బాధ్యతలు ఇప్పుడు ఎవరు చెప్పటనున్నారు అనే ప్రశ్నకు బీసీసీఐ సమాధానంగా రోహిత్ శర్మను కెప్టెన్ గా ప్రకటించింది. ఇక వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేసింది. ఇక ఈ జట్టులో వెంకటేష్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్ వంటి వారిని అనూహ్యంగా ఎంపిక చేయగా.. శిఖర్ ధావన్, కుల్దీప్ యాదవ్ వంటి వారిని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక విరాట్ కోహ్లీ, బుమ్రా వంటి వారికి విశ్రాంతిని ఇవ్వడం కోసం ఈ సిరీస్ కు ఎంపిక చేయలేదు అనేది తెలుస్తుంది.
భారత జట్టు : రోహిత్ శర్మ (c), కేఎల్ రాహుల్ (vc), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (wk), ఇషాన్ కిషన్ (wk), వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అశ్విన్, అక్షర్ పటేల్ , అవేష్ ఖాన్, భువనేశ్వర్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, సిరాజ్
Also Read
తాజావార్తలు
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!