టీమిండియా సెమీస్ చేరాలంటే.. ఈ అద్భుతం జరగాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్లో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని జట్ల కంటే ముందుగా దుబాయ్ చేరుకుని ఐపీఎల్ మ్యాచ్లు ఆడటం ద్వారా పిచ్లపై అవగాహన ఉన్న టీమిండియా క్రికెటర్లు దారుణంగా ఆడుతున్నారని పలువురు క్రికెట్ విశ్లేషకులు మండిపడుతున్నారు. పటిష్టమైన పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లపై ప్రణాళిక ప్రకారం ఆడకుండా కోహ్లీ సేన భారీ మూల్యం చెల్లించుకుందని విమర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి టీమిండియాకు సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారినా.. పూర్తిగా అయితే దారులు మూసుకుపోలేదు. టీమిండియా సెమీస్ చేరాలంటే ఓ అద్భుతం జరిగి తీరాలి.
Read Also: భారత ఆటగాళ్లకు మానసిక ధైర్యం లేదు : గంభీర్
Also Read
- Cockroach Party: మరో దేశానికి పొంచి ఉన్న ‘కాక్రోచ్’ ముప్పు.. అవినీతిపై ఢిల్లీ తరహాలో కసరత్తు
- El Nino Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టులో తక్కువ వర్షాలుంటాయని హెచ్చరిక
- Delhi: ఐబీ ఉద్యోగి అంకిత్ శర్మ హత్య కేసులో సంచలన తీర్పు.. మాజీ ఆప్ నేత తాహిర్ హుస్సేన్కు జీవిత ఖైదు
- Central Cabinet Decision: సముద్ర మంథన్ ప్రాజెక్ట్ ఆమోదం.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లతో పాటు అప్ఘనిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్ ఉన్నాయి. భారత్ తొలి రెండు మ్యాచ్లను పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లతో ఆడి ఓటమి పాలైంది. మిగతా మూడు మ్యాచ్లలో పసికూనలతో తలపడాల్సి ఉంటుంది. వీటిలో భారత్ విజయం సాధించడం సులభమే. అయితే న్యూజిలాండ్ కూడా ఈ మూడు జట్లపైనే ఇంకా ఆడాల్సి ఉంది. పాకిస్థాన్కు దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారైనట్లే. ఈ గ్రూప్ నుంచి సెమీస్ చేరనున్న రెండో జట్టు భవితవ్యమే తేలాల్సి ఉంది. న్యూజిలాండ్ ఇప్పటికే భారత్పై గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. కానీ టీమిండియా సెమీస్కు చేరాలంటే పసికూనలపై ఆడాల్సి ఉన్న మూడు మ్యాచ్లలో న్యూజిలాండ్ ఒక మ్యాచ్లో తప్పనిసరిగా ఓడిపోవాలి. అంతేకాకుండా పసికూనలపై భారత్ భారీ తేడాతో విజయం సాధించాలి. అప్పుడు మాత్రమే టీమిండియా సెమీస్ చేరగలదు.
ఇప్పటికైతే భారత్ అభిమానుల ఆశలన్నీ న్యూజిలాండ్-ఆప్ఘనిస్తాన్ మ్యాచ్పైనే. ఈ మ్యాచ్ నవంబర్ 7న జరగుతుంది. అయితే అంతకంటే ముందే ఆప్ఘనిస్తాన్తో ఈనెల 3న భారత్ తలపడనుంది. కాగా మన ఆటగాళ్లలో సత్తా లేనప్పుడు ఇతరులు ఓడిపోవాలని కోరుకోవడం అత్యాశే అవుతుందని పలువురు భావిస్తున్నారు. అయితే మనిషి నైజం ఆశించడమే కాబట్టి న్యూజిలాండ్పై ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదని మరికొందరు వాదిస్తున్నారు. చూడాలి టీ20 ప్రపంచకప్లో టీమిండియా ప్రయాణం ఎక్కడి వరకు వెళ్తుందో?
తాజావార్తలు
-
Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
-
The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్నెస్కు రెడీ అవ్వండి!
-
Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
-
CM Revanth Reddy : పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు TOMCOMదే బాధ్యత
-
Cockroach Party: మరో దేశానికి పొంచి ఉన్న ‘కాక్రోచ్’ ముప్పు.. అవినీతిపై ఢిల్లీ తరహాలో కసరత్తు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!