మార్స్పై పరిశోధనలు చేసేందుకు నాసా పెర్సెవెరెన్స్ రోవర్ను గతంలో ప్రయోగించింది. ఈ రోవర్ గతేడాది ఫిబ్రవరి 18 వ తేదీన మార్స్ గ్రహంపై ల్యాండ్ అయింది. రోవర్ మార్స్ పై పరిశోధనలు చేపట్టడం ప్రారంభించి నేటికి ఏడాది కావడంతో నాసా శుభాకాంక్షలు తెలియజేసింది. రోవర్ తయారీలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఆరుచక్రాలు కలిగిన ఈ రోవర్ మార్స్పై సంవత్సరం పాటు పరిశోధనలు చేసేలా రూపొందించారు. మార్స్పై ఒక ఏడాది అంటే భూమిపై 687 రోజులు అని…
2030 తరువాత మనిషి ఎలాగైనా మార్స్ మీదకు వెళ్లాలని, అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు. దానికోసమే కోసమే మార్స్పై పరిశోధనలు జరుగుతున్నాయి. మనిషి ఆవాసం ఏర్పాటు చేసుకోవాలి అంటే తప్పనిసరిగా నీరు కావాలి నీరు ఉంటేనే అక్కడ మానవ ఆవాసం సాధ్యం అవుతుంది. మార్స్పై నీటి జాడలు ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు నాసా ప్రయోగాలు చేస్తున్నది. ప్రస్తుతం అంగారకుడిపై పరిశోధనలు చేస్తున్న మార్స్ రికనసెన్స్ ఆర్బిటార్ కీలక విషయాలను తెలియజేసింది. Read: కోట్లాది…
ఇటీవలే పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా దీవుల్లోని అగ్నిపర్వతం బద్దలైంది. ఈ అగ్నిపర్వతం బద్దలైన దృశ్యాలను నాసా శాటిలైట్ ద్వారా చిత్రీకరించింది. టోంగా దీవుల్లో బద్దలైన ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడిన శక్తి హిరోషిమా అణుబాంబు శక్తి కంటే 200 రెట్లు అధికంగా ఉందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అగ్నిపర్వతం బద్దలైనపుడు వెలువడిన బూడిద సుమారు 40 కిలో మీటర్ల మేర వ్యాపించిందని, పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, కాలువలు, చెరువులు, నదులు బూడిదతో నిండిపోయిందని నాసా తెలియజేసింది.…
గతేడాది డిసెంబర్ 25 వ తేదీన ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి నాసా, యూరప్, కెనడా దేశాలు సంయుక్తంగా తయారు చేసిన అతిపెద్ద టెలిస్కొప్ జేమ్స్ వెబ్ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వివిధ కక్ష్యలను దాటుకొని సుమారు 15 లక్షల కిమీ దూరం ప్రయాణించి రెండో లాంగ్రెంజ్ పాయింట్ను చేరుకుంది. అక్కడి నుంచి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ విశ్వం నుంచి వివిధ సమాచారాన్ని సేకరించి భూమికి పంపనున్నది. Read: What’s…
భూమివైపు అతిపెద్ద గ్రహశకలం దూసుకొస్తున్నట్టు నాసా హెచ్చరించింది. 1994 పీసీ 1 గా దీనికి నామకరణం చేశారు. మొదటిసారిగా దీనిని రాబర్ట్ మెక్నాట్ అనే ఖగోళ శాస్త్రవేత్త 1994 ఆగస్ట్ 9న కనుగొన్నారు. ఈ గ్రహశకలం గంలకు 43,754 మైళ్ల వేగంతో ప్రయాణం చేస్తున్నది. అయితే, ఇది భూమి నుంచి సుమారు 1.2 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్తుందని, దీని వలన భూకక్ష్యలో పెను మార్పులు వచ్చే అవకాశం ఉందని నాసా హెచ్చరించింది. జనవరి 18,…
భూమిలాంటి గ్రహాలు ఈ విశాలమైన విశ్వంలో అనేకం ఉన్నాయని ఇప్పటికీ నమ్ముతున్నారు. ఒకవేళ గ్రహాల్లో గ్రహాంతరవాసులు ఉంటే ఎలా ఉంటారు. వారు మనుషుల కన్నా టెక్నికల్గా అభివృద్ధి సాధించిన వ్యక్తులా లేదా, వారి జీవన విధానం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి నాసా ఎప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నది. త్వరలోనే గ్రహాంతరవాసుల జాడను కనుగొని తీరుతామని నాసా చెబుతున్నది. దీనికోసం 24 మంది పూజారుల సహాయం తీసుకోబోతున్నది. వివిధ మతాలకు చెందిన నిష్ణాతులైన పూజారులను దీనికోసం వినియోగించుకోబుతున్నది నాసా.…
మనిషి భవిష్యత్తులో భూమి మీద నుంచి చంద్రునిమీదకు, అంగారకుని మీదకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రుని వాతారవణంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయి. అక్కడ మానవుని నివాసానికి అనుగుణంగా ఉంటుందా లేదా అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని పరిశోధనలు చేశారు. చంద్రునిపైన, మార్స్ పైనా ఘనీభవించిన మంచు జాడలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగోన్నారు. Read: మరో రికార్డ్ సృష్టించిన…
టెక్నాలజీ అభివృద్ది చెందిన తరువాత మనిషి తన అవసరాల కోసం, ప్రపంచం మనుగడ కోసం రోబోలను తయారు చేశాడు. ఈ రోబోలు మనిషికి అన్ని రంగాల్లోనూ సహకరిస్తున్నాయి. కృత్రిమ మేధతో తయారైన రోబోలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్తో సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా రోబోలకు ఉంటుందనడంలో సందేహం అవసరం లేదు. మనుషులు ఆలోచించిన విధంగానే రోబోలు కూడా ఆలోచించగలిగితే మనిషి మనుగడకే ప్రమాదం కావొచ్చు. ఇక ఇదిలా ఉంటే 2021లో చాలా…
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించింది. గయానా నుంచి ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఎరియాన్-5 రాకెట్ ద్వారా నింగిలోకి అతిపెద్ద వెబ్ స్పేస్ టెలీస్కోప్ను విజయవంతంగా నాసా సైంటిస్టులు ప్రవేశపెట్టారు. దీని ద్వారా విశ్వం పుట్టుక తొలినాళ్లలో ఏర్పడిన గెలాక్సీలను వెబ్ స్పేస్ టెలీస్కోప్ పరిశోధనలు జరపనుంది. ఓ రకంగా ఇది గత కాలానికి చెందిన ప్రయాణాన్ని సుసాధ్యం చేసే టైం మెషీన్లాంటిది. 21 అడుగుల పొడవైన వెబ్ స్పేస్…
చిన్న చిన్న తప్పులు చేయడం సహజమే. కొన్నిసార్లు అవసరం లేదని పడేసిన వస్తువుల విలువ భారీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలానే యూకేకు చెందని జేమ్స్ హువెల్స్ మాజీ భార్య 2013 వ సంవత్సరంలో పనికి రాదేమో ఆని చెప్పి ఓ హార్డ్ డిస్క్ను చెత్తబుట్టలో పడేసింది. ఆ హార్డ్ డిస్క్ విలువ ఇప్పుడు రూ.3,404 కోట్లు. వామ్మో అంత విలువనా… అందులో ఏముంది అనే డౌట్ రావొచ్చు. ఆ హార్డ్ డిస్క్లో 7500 బిట్ కాయిన్స్…