Current Bills: కరెంటు బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లిన ఉద్యోగిపై దాడి చేయడంతో విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిక్ నగరంలో, ప్రస్తుతం మహావిత్రన్ ద్వారా విద్యుత్ బకాయిల రికవరీ ప్రచారం జరుగుతోంది.
మహారాష్ట్రలో అన్నదాతలు కదం తొక్కారు. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 10 వేల మందికి పైగా రైతులు కలిసి దాదాపు 200 కిలోమీటర్ల మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ మహాపాదయాత్ర దిండోరి నుంచి ముంబయి వరకు జరుగుతోంది.
Dead Body In Plastic Bag: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం వెలుగులోకి వచ్చింది. కన్న తల్లినే కూతురు అతి కిరాతకంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ముంబైలోని లాల్ బహుగ్ ప్రాంతంలో ఆ తల్లికూతుర్లు ఉండేవారు.
Huge Fire : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో విషాదం చోటుచేసుకుంది. మలాద్లోని కురార్ ఆనంద్నగర్లోని అప్పా పాడా ప్రాంతంలోని మురికివాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
Physical abuse of Polish woman: ముంబైకి చెందిన ఓ వ్యక్తి తన సహోద్యోగి పోలాండ్ దేశానికి చెందిన యువతిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ గత ఆరేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే పోలాండ్ దేశానికి చెందిన యువతి ముంబైలో ఉద్యోగం నిమిత్తం నివసిస్తోంది. అయితే అదే కంపెనీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా పనిచేసే మనీష్ గాంధీ అనే వ్యక్తి ఆమెను లైంగికంగా వేధించడం ప్రారంభించారు.
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇళ్లు ముంబై లోని మన్నత్ బంగ్లాలోకి ఇద్దరు అక్రమంగా చొరబడ్డారు. ఏకంగా 8 గంటల పాటు ఇద్దరు బంగ్లాలోని షారూఖ్ ఖాన్ మేకప్ రూంలో దాక్కుని ఉన్నారు. షారూఖ్ ఫ్యాన్స్ అయిన ఇద్దరు అతడిని కలిసేందుకు ఇదంతా చేశారు. చివరకు వీరిద్దరిని చూసి షాక్ అవ్వడం షారూక్ వంతైంది. ఈ ఘటన గత వారం జరిగింది. నిందితులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Bank SMS Fraud:‘‘డియర్ కస్టమర్.. ఈరోజు మీ బ్యాంకు ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడుతోంది.. డియాక్టవేట్ కాకుండా ఉండేందకు ఇప్పుడే మీ కేవీసీ, పాన్ ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేయడానికి కింద లింక్ క్లిక్ చేయండి’’ అంటూ మేసేజ్ వస్తే మీరు దాన్ని ఓపెన్ చేశారంతే అంతే సంగతులు. మోసగాళ్లు మీ ఖాతాలోని నగదును కొట్టేస్తారు. ఇలాంటి మేసేజులు వస్తే క్లిక్ చేయొద్దు. ఇలాంటి మెసేజులను చదివి నిజమే అనుకుని ముంబైలో ఓ బ్యాంకుకు చెందిన 40…
Vada Pav Best Sandwiches In The World: ‘వడాపావ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండియాలో స్ట్రీట్ ఫుడ్స్ లో చాలా ఫేమస్. ముంబై, మహారాష్ట్రలకు ఎక్కువగా గుర్తింపు పొందిన ఈ స్నాక్ నెమ్మనెమ్మదిగా ఇండియా మొత్తం విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచంలోని ఫుడ్ లవర్స్ ను కూడా మెప్పిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వడాపావ్ అంతర్జాతీయ గుర్తింపును పొందింది. దీనికి అరుదైన గుర్తింపు లభించింది.
Air Pollution : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జనాలు గాలి పీల్చుకునేందుకు జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నగరంలో గాలి నాణ్యత ఎన్నడూ లేనంత దారుణ స్థాయికి పడిపోయింది.
Record in Railway Fines: సెంట్రల్ రైల్వేస్ ముంబై డివిజన్ అరుదైన రికార్డును సాధించింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికుల నుంచి రూ. 100 కోట్లను జరిమానాల రూపంలో వసూలు చేసింది. దీంతో భారతీయ రైల్వేల్లో అద్భుతమైన రికార్డ్ సృష్టించిన తొలి డివిజన్ గా ముంబై నిలిచింది. ఏప్రిల్ 2022 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 18 లక్షల మంది టికెట్ లేని ప్రయాణికుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేేసింది. గతేడాది ఇది రూ.…