Bomb Scare in Mumbai amid 2024 New Year Celebrations: ముంబై నగరంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. న్యూఇయర్ వేడుకలు జరుగుతున్న వేళ నగరంలోని పలు చోట్ల బాంబులు పేలుతాయని ఓ గుర్తుతెలియని వ్యక్తి కాల్ చేశాడు. దాంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబై అంతా విస్తృతంగా గాలింపు చేపట్టినా.. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. ప్రస్తుతం ముంబై నగరం మొత్తం హై అలర్ట్లో ఉంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ఎదురు…
Human Trafficking : మానవ అక్రమ రవాణా ఆరోపణలపై ఫ్రాన్స్లో అదుపులోకి తీసుకున్న రొమేనియా విమానం భారత్కు చేరుకుంది. ఈ విమానంలో 276 మంది ప్రయాణికులు ఉన్నారు.
మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనుంజయ్ ముండే కరోనా బారిపడ్డారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్గా తేలిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు. అయితే వైరస్ ఇన్ఫెక్షన్ గురించి ఎవరూ భయపడనవసరం లేదని పవార్ పేర్కొన్నారు.ఈ మేరకు అజిత్ పవార్ ట్వీట్ చేశారు. ‘నా క్యాబినెట్ సహచరుడు ధనుంజయ్ ముండేకు కొవిడ్ పాజటివ్ వచ్చింది. నాగ్పూర్లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు ముండేకు కొవిడ్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి…
ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు తగలడంతో ఆసుపత్రిలో చేరారు.. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే కారణమని పోలీసుల ప్రధాన విచారణలో తేలింది.. వివరాల్లోకి వెళితే.. ఉల్హాస్నగర్లో తెల్లవారుజామున తన SUVని రెండు ఆటోరిక్షాలు మరియు మరో నాలుగు చక్రాల వాహనంపై ఢీకొట్టిన వ్యక్తిని థానే పోలీసులు అరెస్టు చేశారు, ఫలితంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు మరియు మరో ముగ్గురికి గాయాలయ్యాయి.. పోలీసులు…
ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి కట్టుకున్న భార్యపై లైంగిక దాడి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భర్తతో సహా అతడి ఇద్దరి స్నేహితులను అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. నిందితుడు తన 23 ఏళ్ల భార్యతో కలిసి ముంబైలో నివాసం ఉంటున్నాడు. ఉద్యోగం లేని అతడు డబ్బుల కోసం తన స్నేహితులతో…
టాలివుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుస షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకేక్కిస్తున్నారు.. త్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.. నార్త్ లో చాలామంది చరణ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. తాజాగా రామ్ చరణ్ హైదరాబాద్ నుంచి ముంబైకు వెళ్లినట్లు…
ముంబైలో ఓ పోలీసు అధికారి మహిళతో కలిసి డ్యాన్స్ చేసిన ఘటన వివాదానికి దారితీసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో.. ముంబై లోకల్ ట్రైన్లోని సెకండ్ క్లాస్ లేడీస్ కోచ్లో ఓ యువతితో కలిసి డ్యాన్స్ చేసినట్లు వీడియోలో ఉంది. ఈ ఘటన సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండగా SF గుప్తా అనే పోలీసు అధికారిని పోలీసు ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటన డిసెంబరు 6న రాత్రి 10:00…
మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్ 2023లో హైదరాబాద్ "భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరం"గా ర్యాంక్ చేయబడింది.. ఈ జాబితాలో 153వ ర్యాంక్తో హైదరాబాద్ టాప్ స్పాట్లో నిలవగా.. ఆ తర్వాత 154వ ర్యాంక్తో పుణె రెండో స్థానం, 156వ ర్యాంక్తో బెంగళూరు మూడో స్థానం, 161 ర్యాంక్తో చెన్నై నాలుగో స్థానం, 164 ర్యాంక్తో ముంబై ఐదో స్థానం, 170 ర్యాంక్తో కోల్కతా ఆరో స్థానం, 172 ర్యాంక్తో న్యూఢిల్లీ ఏడో స్థానంలో నిలిచాయి.
Floods: మైచాంగ్ తుఫాను కారణంగా చెన్నై నగరం అతలాకుతలం అవుతోంది. చెన్నై మొత్తం నదిలా మారిపోయింది. రోడ్లు, కాలనీలు నీటిలో మునిగిపోయాయి. గత కొన్నేళ్లుగా తుఫానులు వస్తున్నాయంటే చాలు చెన్నై వణికిపోతోంది. డిసెంబర్ 4, 2023 నాటికి 48 గంటల్లోనే 40 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాత నమోదు కావడం నగరాన్ని ముంచెత్తింది. గతంలో కూడా పలు తుఫాన్ల సమయంలో చెన్నై ఇలాగే వరద గుప్పిట చిక్కుకుంది.
ముంబైలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ టీచర్. ఆంటోప్ హిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సియోన్ కోలివాడ ప్రాంతంలో ఉన్న కోచింగ్ సెంటర్లో 16 ఏళ్ల విద్యార్థిని కోచింగ్ తీసుకుంటుంది. ఈ క్రమంలో వేధింపుల ఘటన వెలుగులోకి రావడంతో.. బాధితురాలి కుటుంబసభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.